Saturday, December 25, 2021

Eknath Chapter 13 Sloka 16

13.16

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః

పరమాత్మేతి చాప్యుక్తో దేహే అస్మిన్ పరుషః పరః

ఈ దేహమునందున్న విలక్షణమైన పురుషుడు ఉపద్రష్టయు, అనుమతించువాడును, భరించువాడును, భోక్తయును, మహేశ్వరుడును, పరమాత్మయునని చెప్పుచున్నాడు

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ

సర్వథా వర్తమానో అపి న స భూయో అభిజాయతే

ఎవడు ఈ విధముగ పురుషుని, గుణములతో కూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, వాడు సర్వవిధముల ప్రవర్తించుచున్నను తిరిగి జన్మించడు

నేను 20 ఏళ్ల క్రిందట యూరప్ నుండి అమెరికాకు వస్తున్నప్పుడు నేను ప్రయాణించే పడవ అరేబియన్ పెనిన్సులా చుట్టి గల్ఫ్ ఆఫ్ ఈడెన్ వైపు కొనసాగింది. నాకు అరబిక్ మరియు పర్షియన్ సాహిత్యంలో పండిపోయిన పండితులు, కవులు చాలామంది భారత దేశములో మంచి మిత్రులు. ముస్లిం సంస్కృతితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఎండిపోయిన ఎడారులతో నిండిఉన్న అరేబియా చరిత్ర భారతదేశంతోనూ , ప్రపంచంతోనూ ముడిపడి ఉంది. ఇదంతా నా మనస్సులో చెరగని ముద్ర వేసింది.

నాకు అన్నిటికన్నా రెడ్ సీ లో ప్రయాణం బాగా గుర్తు ఉంది. అది నేను పెద్దది అనుకోలేదు. ఒక పగలు, రాత్రి ప్రయాణం అనుకొంటే 3 రోజులు పట్టింది. అక్కడి గాలి వేడిగా, తేమగా అనిపించింది. గాలికి ఆ నీరు చలించలేదు. తోటి ప్రయాణీకులు వేడి భరించలేక డెక్ నుండి తమ గదుల్లోకి వెళ్లిపోయేరు. నన్ను నేను ఒక పురాతన నావికుడుగా భావించుకున్నాను. "ఒక్కడే రంగువేసిన సముద్రముపై". గదిలో చాలా మంది ఉన్నారు. అది ఇరుకు గది. ఉక్కగా ఉండడంతో, నేను నా పక్కని డెక్ మీద వేసికొని గంటలపాటు ఆకాశాన్ని ఆసక్తిగా చూస్తూ గడిపేను. షిప్ పర్వతాలని దాటి నక్షత్రాల క్రింద పయనించింది.

ఒక రాత్రి అరేబియన్ పెనిన్ సులాలో మండుతున్న స్తంబాలు కనిపించేయి. భయం గొలిపించే అరుదైన దృశ్యం. భూమి ఆకాశాన్ని తన మండుతున్న నాలుకతో తాకుతున్నట్టు అనిపించింది. ప్రోఫేట్ నరకాన్ని అలా వర్ణించేడా? సృష్టి లయమైపోతోందా?

ఒక నావికుడు "అవి ఆయల్ రెఫైనరీలు మండించే వంట గ్యాస్ వంటి వాయువు" అని చెప్పేడు.

మీకు ఆత్మనని జ్ఞానము ఉన్నప్పుడు జీవితంలోని గందరగోళాన్ని, నేను డెక్ మీదనుండి చూసిన నిశ్శబ్ద ఎడారుల , రిఫైనరీల దృశ్యాలులాగా, చూసి వైరాగ్యంతో గడుపుతారు, ఒక జర్మనీ దేశస్తుడు "నరకంలో ఏదీ మండదు మన అహంకారం తప్ప" అని వ్రాసేడు. అన్యుడిని చూడలేని ఎడారులు, కష్టాలలో ఉన్నట్లు అనిపించే మంటలు ఉన్నాయి. మీరు రిఫైనరీ కారు. మీరు నిజంగా మంటల్లో లేరు. మీరు శాంతంగా చూస్తారు. జీవితం ఒక ఖాళీ భ్రాంతి కాదు. దానికి ఒక గమ్యం ఉంది. కష్టాలలో ఉన్నా, తెర వెనుక ఒక శాశ్వతమైనది , దుఃఖాన్ని అంతంచేసేది ఉంది అని తెలుసు. ఇతరులకు సహాయం చేయడం, కష్టాలలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం వంటి కార్యాల వల్ల మీరు పరిమితిలేని ఆనందాన్ని అనుభవిస్తారు. చుట్టూ శబ్దాలతో నిండివున్నా మీరు హృదయంలో, మనస్సులో శాంతంగా ఉంటారు.

కొంత ఉపశమనం ఎందుకొస్తుందంటే గత స్మృతులు మీ భుజస్కందాల నుండి, అరేబియా పర్వతాలు కనుమరుగయినట్లు, జారి పోవడంవల్ల. ఆ పర్వతాలు నిజం. కానీ అవి నీడలంత సత్యం. మనం శరీరముతో తాదాత్మ్యం చెంది, తక్కిన వారితో వేర్పాటు చెందితే, అది తప్పు భావన. దానివల్ల మనకు, చుట్టూ ఉన్న వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనం ఆత్మ పరిశీలన చేసికొని మనం నిజంగా ఎవరని తెలుసుకొంటే మన తప్పులు మనని బాధించవు. అవి వేరే, గతంలో ఎరిగిన, వారికి చెందుతాయి. గతం గతః. గాంధీని గతంలో మీరు ఆ పని ఎందుకు చేశారు లేదా ఆ మాట ఎందుకన్నారు అని అడిగినప్పుడు ఆయన "జీవితాన్ని అప్పుడు అలాగ చూసేను. ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాను" అని సమాధానం ఇచ్చేవాడు.

ఆత్మ జ్ఞానం ఉదయించగానే, మన శాస్త్రాలు చెప్పినట్లు, మరొక జీవిగా మరు జన్మ ఉండదు. దీన్ని అంత సులభంగా అర్థం చేసికోలేము. కొన్ని హిందూ, భౌద్ధ శాఖలు దాన్ని అక్షరాలా తీసుకొంటాయి: నీకు మరో పుట్టుక లేదు. నేను ఉంకో శాఖకు చెందినవాడిని. కొన్ని కారణాలవల్ల రెండవది నమ్ముతాను. దీని ప్రకారం ఆత్మ జ్ఞాని, మళ్ళీ మళ్ళీ, సంసార బంధంలో పడకుండా, ఇతరులకు చేయూత నీయడానికి, వారి దుఃఖాన్ని పోగొట్టడానికి పుడతాడు.

ఈ మిడి మిడి జ్ఞానంవల్ల మరణం అనగా జీవితం అంతమయ్యేది కాక వేరొక ద్వారాన్ని చూపేది అన్న అవగాహన మనని తేలికగా ఉంచుతుంది. బాల్యంలో, మా ఆవు మరణిస్తూ ఉండగా, నా అమ్మమ్మ అక్కడికి పిలిచింది. ఆవు ముఖం ఎత్తి దైన్యంగా చూసింది. నేను దాని కళ్ళలో భయం, సంశయం చూసేను. అది అచ్చం నా బంధువులలో మరణాన్ని ఎదురుచూసే వారలను చూచినపుడు వచ్చే భావనలే. "ఏమిటవుతున్నాది? దీని తరువాత ఏమిటి? చివరికి అంతా అయిపోయిందా?" అని అంటున్నటు అనిపిస్తుంది. పైపైనే కాదు, మనస్సు లోతుల్లో కూడా, మరణమంటే భయం ఉండదు. ప్రతి మతంలో జ్ఞానులు "మాకు మరణమంటే భయం లేదు. మాకు తెలుసు" అని చెబుతారు.

మీరు నిద్రకు ఉపక్రమించేటప్పుడు, మీకు మళ్ళీ లేస్తారని తెలుసు. లేకుంటే అది గాబారపెట్టే విషయం. అది బుద్ధుని మతం. ఆయన మనను "నువ్వు నిన్న రాత్రి నిద్ర పోలేదా? మేల్కొన్నప్పుడు నువ్వు మునపటివాడివేనా? ఒకానొక నిద్రావస్థలో నీవు వేరొక వ్యక్తివని అనిపించలేదా? " అని అడుగుతాడు. మరణం కూడా మనం అర్థం చేసుకొంటే అటువంటిదే. పంచభూతాలతో చేయబడిన దేహం పోతుంది. కాని ఆత్మ మాత్రం, రెడ్ సీ లో నిశ్శబ్దంగా పయనించిన ఓడ లాగ, సాగిపోతుంది.

నాకు ఇతరుల మరణాన్ని చూసే ఘటనలు ఎదురయ్యేవి. వాళ్ళ మరణ ఘడియలు ఆసన్నమైనప్పుడు వాళ్ళ ప్రక్కన కూర్చొని, చేయి పట్టుకొని, నా మంత్రాన్ని జపిస్తూ, వాళ్ళకి మరణం మీద అవగాహన కల్పిస్తూ, అంటే మరణమంటే అంతం కాదని, అది ఒక నూతనమైన అనుభవానికి వెళ్లేముందు కొంత విశ్రాంతి అని చెప్పేవాడిని. ఒక వ్యక్తి చిన్న పిల్ల లాగ స్పందించేడు. అతని బంధు మిత్రులు ఆయనవద్ద లేరు. నేను కొన్ని నిమిషాలు అక్కడే ఉన్నాను. "మీరు నన్నేమైనా ప్రశ్నని అడగ దలుచు కొన్నారా?" అని అడిగేను.

"అవును. ఒక్కటే: నేనీ దేహాన్ని వదిలేసిన పిదప మిమ్మల్ని మళ్ళీ చూస్తానా?"

"అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు మనం వేర్పడకూడదని గాఢంగా నమ్మితే , మనమెప్పుడూ కలిసే ఉంటాము. " అన్నాను.

శాస్త్రం చెబుతుంది నీ గురువును గాఢంగా నమ్మితే, ఆయన మీది ప్రేమ వల్ల కలిగిన బంధం మరణం కూడా త్రెంపలేదు. ఆత్మ జ్ఞానులు సృష్టినంతటిని ఎంత గాఢంగా ప్రేమిస్తారంటే, మళ్ళీ మళ్ళీ పుట్టి ఇతరుల దుఃఖాన్ని తీసివైసి వాళ్ళ గమ్యాన్ని గుర్తు చేస్తారు, అని భౌద్ధులు నమ్ముతారు. "ఏఒక్క జీవి దుఃఖిస్తున్నా, నేను నిర్వాణాన్ని పొందలేను" అని గౌతమ బుద్ధుడు వచించేడు.

No comments:

Post a Comment