Friday, July 28, 2023

vemana

upanishad
ramana maharshi

Here you will find links to translated (into Telugu) works of various authors on Gita, Upanishads, Ramana Maharshi and Vemana. For Vemana's work, English Translation is provided. Enjoy!

Hexfecta that one has to be aware of (అరిషడ్వర్గాలు) (English)
Sri Sookatam (శ్రీ సూక్తం)(Telugu/English)
Purusha Sookatam (పరుష సూక్తం)(Telugu/English)
True Love(English)
Syamala Dandakam (శ్యామలా దండకం) (Telugu/English)
Kanka Dhara Stotram (కనక ధారా స్తోత్రం) by Adi Sankaracharya (Telugu)
Mantra Pushpam (మంత్ర పుష్పం)(Telugu/English)
Sri Rudram -- Namakam (శ్రీ రుద్రం నమకం) (Telugu/English)
Sri Rudram -- Chamakam (శ్రీ రుద్రం చమకం) (Telugu/English)
Prof. Eknath Easwaran's Bhagavat Gita Parts 1, 2, & 3 (Telugu)
Prof. Eknath Easwaran's Upanishads (Telugu)
Ramana Maharshi's Teachings (Telugu)
Vemana's 2000 Poems (Telugu & English)
Swami Paramananda Bharati's Discourse On Causality in Science and Vedanta (English)
Swami Paramananda Bharati's Discourse On Adhyaasa (English)
Swami Paramananda Bharati's Discourse (English)
vemana
gita

Sunday, January 22, 2023

Causality in Science and Vedaanta by Swami Paramaananda Bhaarati

Causality in Science and Vedaanta

By Late Sri Swami Paramaananda Bhaartai (IIT Physics Professor)

Entire world is an effect. The quest is to find its cause. Universe consists of two essential categories: observers and observables. The cause of the universe is dependent on them. How to fix the cause of observers and observables?

Whenever such discussions take place for understanding things we adopt a pramaana (the means of understanding). The pramaanas are the same in science and vedanta. For example pratyaksha pramaana is the direct observation.Both the science and vedanta reject anything that is not experiential.

Aim and the means of achieving it is the same in science and vedanta. Where they differ is in the method of approach.

Science adopts bits and pieces like molecules, atoms, nuclei, subatomic particles, etc.

In the case of vedanta it is holistic. Vedaanta takes into account the whole universe

We know that a molecule is that part of the object which is the smallest. The smallest particle of salt is the molecule NaCl for example. This line of approach is adopted by vaiseshikas.

Molecules are effects only. One has to search for the cause of the universe and molecules. Molecule is not the ultimate kaarana but intermediate cause (avaantara kaarana).

We know that a molecule is a collection of atoms. Atom is also an effect. Break it further and arrive at nucleus. Nucleus can be further broken into subatomic particles. Ultimately we end up with quantum fields which can't be broken

The divide and conquer approach didn't work any more.

The purpose of doing all this is to find the cause of the universe. Unlike molecules and atoms the subatomic particles are unsteady. They are explosive. How can an explosive (highly reactive) material be the cause of the universe? It is impossible to find a stable cause using science.

The methodology however revealed so many secrets of the world. It is not the same kind of mechanisms of classical physics. It gave raise to tremendous technology.

Science is unable to find the cause of the universe. Science has made enormous progress without knowing the cause.

When something is unavailable for pratyaksha pramaana then we try anumana pramaana (where there is fire, there is smoke). There should not be conflict in the pramaanas.

Science of particle physics finally ended up in quantum fields. Now consider the observables and observers. Vedanta uses objects and properties as observables. One has to find the common cause of observer and observables. Till they obtained quantum fields, no one thought of observer. Now they realized the role of the observer needs to be studied.

How to obtain the common cause? From vEdaanta the essential difference is the knowledge of the observer. Take a window. The knowledge of the window which certifies that we are the knower and the window is the object, knows both observer and observable. We have to investigate this knowledge.

There is a certain law in the intermediate causes. Take any effect and its previous cause atoms, molecules, nuclei, particles, fields, etc. The exclusive features of cause are absent in the effect.

What is the nature of the cause? It must be holistic and must simultaneously include observer and observed. Suppose we hear a sound. Sound is the observable and ears are hearing it. If the sound is of veena the musical notes come into the ear. Where do they go? The sound signal can't be independent of the sound field. The signal is a singularity in the field. You have to conclude, it is the sound field that connects the sound and the hearer. Anything produced in the field must be consumed in the field. Saastra says such a field is ether. Ether is not vacuum. Sight field is electro-magnetic.

Wherever there is a communication the same field is there in the observer and observed.

The 5 elements (pancha bhootaas) are holistic. The field does not have the features of the signal. The cause does not contain the effect.

Quantum measurement problem: the probability field takes a definitive field upon taking a measurement. For example, the position and charge of an electron cannot be measured simultaneously. Once a position is measured, the charge can't be measured. Vice-versa.

Every apparatus for measurement is a classical object and also has quantum fields. Depending on the experimental situation it will be either classical or quantum .

Features of effects can't be found in the cause. Both observables and observer are changing. So change is the fundamental feature. The whole set up is inert. Even the observer (mind/body) is also inert. So we identify change and inertia as the quintessensial features of the ultimate cause.

The cause should not contain change (asat) and inertia. The cause has to be satya. Inertia should be absent in the cause. Where is the anti-inertia hiding? That which doesn't do work by itself is inertia. A conscious person has to use force to change it. Consider the act of throwing a stone. Some anti-inertial entity is hiding in the observer. When using the arm to throw the stone, we will have to have some knowledge. Such knowledge is qualified (knowledge of the stone, distance of throw, etc.)

The anti-inertia is still hiding. But the qualified knowledge is changing. Knowledge per se is not changing and is anti-inertia. That is gnaana.

So the cause of the entire universe has to be satya (unchanging), gnaana.

Thus we determine, the cause is satyam-gnaanam-anantam. How to verify? You can't verify it in laboratory. It is not accessible to instruments or mind. To verify, have a sound sleep and experience sushupti.

Saturday, March 26, 2022

Eknath Gita Chapter 14 Sloka 9

14.9

సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే

జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ద౦ సత్త్వమిత్యుత

ఈ శరీరద్వారములైన సర్వేంద్రియముల యందును ఎప్పుడు ప్రకాశమానమగు జ్ఞానము ఆవిర్భవించునో అప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి నొందుచున్నదని గ్రహింపుము

ఈ శ్లోకంలో ఉపనిషత్తులు చెప్పిన విధముగా: శరీరమును చుట్టూ గోడ, రాకపోకలకి ద్వారాలు గల పురాతన పట్టణములతో పోలిక చెప్పబడినది. ఇంద్రియాలు శరీరం యొక్క ద్వారాలు. శ్రీకృష్ణుడు శరీరము లోపల ఒక అధ్యక్షుడుగా ఉన్నానని గుర్తు చేయుచున్నాడు. పట్టణము చక్కగా ఉండి, కాపలా భటులు అధ్యక్షుడు చెప్పినట్లుగా కొందరిని లోపలికి రానిస్తారు, కొందరిని వెనుకకు పంపిస్తారు. ఇది సత్త్వ గుణముతో పోలిక. రజస్ తో కూడిన పట్టణములో కాపలా భటులు వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారు. తమస్ తో కూడిన పట్టణములో వాళ్ళు పడుకొని ఉంటారు.

ఒక చిన్న ఉదాహరణ. నేను ఉంటున్న పెటలూమా అనే ఊరులో ఒక భయానకమైన సినిమా విడుదలయింది. ఆడ మగ పెద్ద ఎత్తున ఆ సినిమా చూడడానికి, అనారోగ్యము వస్తుందని తెలిసినా, బారులు కట్టేరు. అది వారికి నచ్చుతుంది. సాన్ ఫ్రాన్కిస్ కో నగరంలో ఒక ఆడది సినిమా హాల్ లో మూర్ఛతో పడిపోయినదని విన్నాను.

నేను ఒక దంపతులను ఆ వరసలో చూసేను. టిక్కెట్టు కొంటున్నప్పుడు జరిగే దృశ్యాన్ని ఊహించగలను. "ఈమె నా జూలిఎట్. నాకు ఆమె అంటే ఎంత ఇష్టమంటే, ఆవిడకి మూర్ఛ తెప్పిస్తాను. "

కళ్ళు, చెవులు మనస్సుకు రహదారులు. ఇటువంటి సినిమా చూస్తున్నప్పుడు మనం విన్నది, కన్నది వికల్పమైన మనస్సుకు దారి తీస్తాయి.

ఆత్మ కాంతి వంటిది. తమస్ గాఢాంధకారము. రజస్ పట్టణంలో రభస. సత్త్వ౦ అనగా ఆ పట్టణం ప్రశాంతంగా ఉండడం. ఆ స్థితిలో మీ హృదయం ప్రేమతో, జ్ఞానముతో నిండుగా ఉండి, మీ తేజస్సు నలుదిక్కులా వ్యాపిస్తుంది. 139

Saturday, March 19, 2022

Eknath Gita Chapter 14 Sloka 8

14.8

రజస్తమశ్చాభిభూయ సత్త్వ౦ భవతి భారత

రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా

భారతా! సత్త్వగుణము రజో తమోగుణములను, రజోగుణము సత్త్వ తమో గుణములను, తమోగుణము సత్త్వరజోగుణములను అణుచుచు ఆయా గుణము ప్రధానమగుచుండును

ఎవ్వరూ రజో, తమో గుణములతో జీవించాలని కాంక్షించరు. కాని చాలామంది వాటితోనే జీవిస్తారు. మంచి ఉద్దేశము ఉన్నా, ఎందుకు నిస్వార్థ కర్మల చేయుటకు మానసిక అవరోధాలు ఉన్నాయి? అపాయం కలిగించే స్వార్థ కర్మలు ఎందుకు చేస్తున్నాం?

ఇదే మానవులకున్న సందిగ్దావస్థ. కొన్నిసార్లు మనకు పని చేయవలసినప్పుడు బద్దకం ఆవహిస్తుంది. మనం "నేనిది చేయలేను. వేరేవాళ్ళచేత చేయిస్తాను" అనుకుంటాం. మనకు ఇష్టమైన పని చేయవలసినపుడు పూనుకొని మనః పూర్వకంగా చేస్తాం. దాని వల్ల ఏ లాభం ఉండకపోవచ్చు. దానివల్ల మనకు, ఇతరులకు అపాయం కలగవచ్చు. మరుసటి రోజో, కొన్నినెలల తరువాతో, లేదా తరువాత తరంలోనో దాని ప్రభావం తెలుస్తుంది. మనం పని మీద దృష్టి కేంద్రీకరించి సమయాన్ని మర్చిపోతాం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని మరచిపోయేం.

ఈ శ్లోకం ఒక గుహ్యమైన విషయం చెప్తోంది. సత్త్వ గుణంతో బ్రతకాలంటే రజస్ తమస్ లను నియంత్రించుకో. ఈ విధంగా రెండు గుణాలను స్వాధీనంతో పెట్టుకొంటే మూడవది అనుభవంలోకి వస్తుంది.

మీ స్వీయానుభవంతో తెలుసుకోవచ్చు. మీరు సోమవారము గీత చదివి ఉత్సాహపూరితలు అవుతారు. ఆ బోధ మనస్సులో బాగా నాటుకు౦ది. మీరు జీవితాన్ని తదనుగుణంగా మార్చుకొని దాని పరమార్థం తెలిసికొన్నారు. మరుసటిరోజు ఉదయం వేరంగా లేచి, ధ్యానం చేసి, సాత్విక టిఫిన్ తిని, పనిమీద పూర్తి ధ్యాస పెట్టి, తోటివారలను గౌరవంగా చూసి, నిర్దయులకు ప్రేమ చూపిస్తారు. బద్దకం వస్తే నడక మొదలెట్టి మంత్రం జపించుకొంటూ వెళతారు. లేదా జాప్యం చేసిన పనిని మొదలెడతారు. మనస్సు వేగంగా ఉంటే మంత్ర సహాయంతో దాని వేగం తగ్గిస్తారు. ఒక ముఖ్యమైన పని చేయడానికి తక్కిన వాటిని ప్రక్కన పెడతారు. వీటివల్ల రజస్ తమస్ ల నుండి విడివడి ఒక మూడు రోజులు సాత్వికంగా ఉంటారు.

ఆ తరువాత నెమ్మదిగా పట్టు సడలుతుంది. నిరుత్సాహం ఆవరిస్తుంది. ఆఫీస్ లో పని ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ ఉన్న వారు ఏదో పని వెంటనే చేయమని అడుగుతారు. మనకు తెలీకుండానే పాత అలవాట్లు తిరిగి వస్తాయి. మనస్సు వేగంగా చలిస్తుంది. ఇతరులు మీ పనికి అడ్డం వస్తే వాళ్ళ మీద చికాకు పడతారు. గురువారం మీరు ఇంటిలో ఆఫీస్ పని చేయ బూనుతారు. భోజనం చేస్తున్నప్పుడు దానిపైనే ధ్యాస పెడతారు. భార్యను, పిల్లలను పలకరించరు. ఈవిధంగా సత్త్వగుణాన్ని వదలి, రజస్ తో ఉన్నారు.

శనివారం పడిపోతారు. పక్క మీద నుంచి లేవరు. కలలు కంటూ వాటితో రమిస్తారు. ధ్యానం చేద్దామని కూర్చొని, నిద్ర పోతారు. "నాకు ఈ వారమంతా పని ఒత్తిడి ఎక్కువయింది. ఇప్పుడు పూర్తిగా విశ్రమిస్తాను" అని అనుకొంటారు. టిఫిన్ ఎక్కువగా తిని కాఫీ కప్పు పట్టుకొని బయట ఎండలో కూర్చొని ఆనందిస్తారు.

ఆదివారం అయోమయంగా ఉంటుంది. ఎక్కడా నొప్పి లేకున్నా మనస్సు సరిగా ఉండదు. దేహంలో శక్తిలేనట్టు అనిపిస్తుంది. "ఏదో వైరస్ వల్ల కాబోలు" అనుకొంటారు. "నేను వేరే వాళ్ళని చూడను. పక్కమీదే ధ్యానం చేస్తాను" అని గుడికి వెళ్ళే కార్యక్రమాన్ని విరమించుకుంటారు. ఏవో పిచ్చి పుస్తకాలను తిరగేస్తారు.

రజస్ తాండవం చేస్తున్నప్పుడు సత్త్వ౦ కొరకు పెద్ద యుద్ధమే చేయాలి. ఏమైనప్పటికి తమస్ ను ఆశ్రయించకూడదు. సత్త్వ గుణం తగ్గుముఖం పడుతూంటే, దానికి ఊత నివ్వండి. ఇది చాలా బాధించేదే కాని పట్టుతో దాన్ని విడువకండి. వేరే మార్గం లేదు. 139

Sunday, March 13, 2022

Eknath Gita Chapter 5 Section 14

Bhagavat Gita

5.14

కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసా౦

అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్

కామాక్రోధముల నుండి విడిపడిన వారును, మనసు స్వాధీనపడిన వారును, ఆత్మ జ్ఞానులును అగు యతి పురుషులకు బ్రహ్మజ్ఞానము సర్వత్ర కలదు.

ఈ శ్లోకంలో బ్రహ్మనిర్వాణ అనే పదం శ్రీకృష్ణుడు ప్రయోగించేడు. అంటే ఒక ఉత్కృష్టమైన లక్ష్యం. దాన్ని చేరాలంటే రెండు అడ్డంకులు ఉన్నాయి. ఒకటి స్వార్థం. దాని వల్ల ఒకడు లాభము, పేరుప్రఖ్యాతలు, ప్రతిష్ఠ కొరకై ప్రేరేపింపబడతాడు. బుద్ధుడు దీన్నే తన్హా -- అంటే తనది పొందటానికి ఇతరులతో అవసరమైతే కలహం పెట్టుకొని చేయడం-- అంటాడు. రెండవ ప్రతిబంధకం క్రోధం. ఎక్కడైతే వేర్పాటు, తానొక్కడే తృప్తి పొందాలనే భావన ఉంటుందో అక్కడ క్రోధం ఉన్నట్టే. కామము, క్రోధము కలసి వస్తాయి. మనమంతా స్వార్థ౦తో ఒక పెద్ద వస్తువు పొందాలని ప్రయత్నిస్తే, అది ప్రపంచంలో ఒకే ఒక వస్తువయితే, మన మధ్య స్పర్థలు కలగక మానవు.

అనేక విడిపోవడాలలో -- వ్యష్ఠి అయినా, సమిష్ఠి అయినా-- మన ఇష్టం, ఇతరుల ఇష్టం మధ్య, మన సౌభాగ్యం ఇతరుల సౌభాగ్యం మధ్య కలహం ఉంటుంది. సౌభాగ్యం, శాంతి విడదీయబడలేవు. నేతలు ప్రపంచ శాంతి ఎంతో అవసరమని చెప్తున్నారు. ప్రపంచం ఒక మూలలో యుద్ధం జరుగుతూ ఉంటే, మరో మూలలో శాంతి ఉన్నా లాభం లేదు. అలాగే ఒక దేశంలో సౌభాగ్య ముండి, వేరే దేశం దరిద్రంతో బాధ పడుతూ ఉంటే కూడా లాభం లేదు. ఎలాగంటే మన ఇంట్లో వంట గది నిప్పంటుకుంటే, దానిని ఆర్పకపోతే, అది ఇల్లంతా వ్యాపించి ఇల్లునే తగలబెడుతుంది.

కామాక్రోధాలను నియంత్రించాలంటే, మన ఇంటిలో కలసిమెలసి ఉండాలి. లేకపోతే ఇంట్లో యుద్ధ బీజాలు నాటబడతాయి. ఇంట్లోని వ్యక్తుల మధ్య కలహాలు, వేర్పాటు భావాలు ఉన్నాయంటే, ఆ ఇంట్లో ఒక చిన్న యుద్ధం జరుగుతున్నట్టే. అది ప్రపంచ యుద్ధమంత పెద్దది కాకపోయినా, అది యుద్ధమే.

యుద్ధ ప్రతిపాదిక మనస్సులో కలుగుతుంది. అది క్రమంగా మన హృదయాలలోనూ, ఇళ్లలోనూ, సమాజంలోనూ, చివరకు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. గీత చేసే బోధ: యుద్ధం స్వార్థం-నిస్వార్థం, శుద్ధం-అశుద్ధం, ఆసురిక-దైవీక స్వభావాల మధ్య జరిగే పోరాటం. గీత చెప్పే యుద్ధం మన మనస్సులో, హృదయంలో జరిగే గందరగోళం. యుద్ధం రెండు వర్గాల మధ్య పోరాటం కాబట్టి మనకి ఆసురిక వర్గమైనా లేదా దైవిక వర్గమైనా ఎన్నిక చేసికోవచ్చు. అది దేశాకాలమానాలతో సంబంధం లేనిది. 331

Saturday, March 12, 2022

Eknath Gita Chapter 14 Sloka 7

14.7

సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత

జ్ఞాన మావ్రుత్య తు తమః ప్రమాదే సంజయత్యుత

భారతా! సత్త్వ గుణము సుఖములో జీవుని ప్రవర్తింపజేయును. రజోగుణము కర్మలలోనికి నెట్టును. తమోగుణము జ్ఞానము నావరించి జీవుని ప్రమాదమున ముంచును

ఏ విషయానికైనా మన స్పందన యాంత్రికము. ధనము వచ్చిన మనము దాని వ్యామోహములో అనాలోచితంగా పడతాము. సుఖం దానికన్నాఎక్కువగా ఆకర్షిస్తుంది. పేదవాడు, ధనవంతుడు అని తేడాలేక వాటిచే ఆకర్షింపబడతారు. మనం "నేను తీసికోవచ్చు లేదా వదిలేయవచ్చు" అనుకోవచ్చు. కానీ ధన-సుఖాలకు వేరే మార్గముంది.

మనము ధ్యానం మొదలుపెట్టిన తరువాత, సుఖం వచ్చి మనను తనవైపు లాగుకొ౦టే, అప్రయత్నంగా మనము దానివైపు వెళదామనుకున్నా, వెళ్లము. దానికి కోపంవస్తుంది. సుఖము ఇలా అంటుంది: "ఇది క్రికెట్ కాదు. నీవు నా వైపు రావాలి. జీవితమంటే అదే. చుట్టూ చూడు. ఎవరయినా నన్ను చూసి దూరంగా పరిగెడుతున్నారా? ప్రతి ఒక్కరు నన్ను కాంక్షిస్తారు. నేను ప్రతిఒక్కరికి మిత్రుడను." సెయింట్ ఫ్రాన్ సిస్ ఇలా తలుస్తారు: "నేను ఆకర్ష-వికర్షణలకు బద్దుడను కాను. నేను నాకు కావలసినది చేస్తాను. సుఖం నన్ను ప్రభావితం చేయలేదు".

ఎంతో ధ్యానం చేసిన పిదప, మనం తీసికొన్న నిర్ణయాలు కాకతాళీయంగా, బయట విషయాల వల్ల కాక, ఉన్నా, అవి వేరే గతి లేని స్పందనలు మాత్రమే. అవి నిర్ణయాలు కావు. గాఢమైన కోర్కెలు. అవి యాంత్రికంగా మన మనస్సుకు వస్తాయి. మనం వాటిని నియంత్రించాలి. మోక్షమనగా అట్టి కోర్కెలకు బానిస కాకపోవడం.

తామసికుడు, జడత్వంతో, ఇలా ఆలోచిస్తాడు: "నేను ఈ రోజు పక్క మీదే ఉంటాను". తమస్ "నేను వీడిని ఒక వేలుతో నా స్వాధీనంలోకి తీసుకొన్నాను. వీడు మంచానికి తాళ్లతో కట్టి పడేసిన వాడిలా ఉన్నాడు" అంటుంది. వాడితో "నీకు స్వతంత్రం లేదు " అంటే నమ్మడు . "చూడు నా చేయిని ఎత్త గలుగుతున్నాను. నా కాళ్ళను కదపగలను. నేను స్వతంత్రుడిని" అని అంటాడు.

మనం అడుగుతాం "అయితే పక్క మీదనుంచి ఎందుకు లేవలేక పోతున్నావు?"

"నేను తలచుకొంటే లేవగలను. కానీ నేను పక్క మీదే ఉండాలని నిర్ణయం తీసికొన్నాను"

ఒకడు ఆఫీస్ కు వచ్చి "నేనీ ఆదివారం ఊరెళుతున్నాను" అని అంటాడు. రాజసికుడు నవ్వి "వీడు మనస్సు వికల్పమైనది. నేను వాడిని ఎక్కడికైనా ప్రయాణం కట్టించగలను." ఇవి నిర్భంధమైన విషయాలు. అవి మనను కర్మ చేత బంధిస్తాయి. ఎందుకంటే మనను ఒక ధ్రుక్పధంలో బంధిస్తాయి. దీనిని శ్రద్ద అంటారు. ఒక దృఢమైన, స్థిరమైన, తిరిగి ప్రశ్నించ బడలేని, నమ్మకం బయట వస్తువేదో ఆనందాన్ని కల్గిస్తుందని అనిపిస్తుంది. అది ప్రస్తుత కాలంలోనే కాదు. సుఖమును కోరినవారు చరిత్రపుటలలో చాలా మంది ఉన్నారు. సుఖానికై ప్రతిఒక్కరు వెతుకుతారు. కానీ దాన్ని సంపూర్ణముగా పొందలేరు.

మనలో చాలామంది ఇంద్రియ సుఖము ఎక్కడో ఉందని తలుస్తాము. మన కది దొరకటం లేదని భావిస్తాము. అతి కొద్ది మందికి జ్ఞానోదయం కలుగుతుంది: "సుఖం బయటెక్కడో లేదు. నా అంతర్గతంలోనే ఉంది." ఈ విధమైన పరిపక్వమయిన జ్ఞానము సత్త్వ గుణమువలననే సాధ్యము. తద్వారా మన౦ మంచి నిర్ణయాలు చేయగలిగే శక్తిని పొందుతాము.

పరిపక్వాన్ని చాలా విధాలుగా ఊహిస్తారు. ఈనాటి మంత్రం: "నీకు బాగా అనిపించేదాని కోసమై వెళ్ళు." అంటే "ఎంత వీలయితే అంత మూర్ఖంగా వుండు." పరిపక్వతకి అసంగత్వం ఉండాలి. అదిలేని వాడు స్వార్థంతో: తన కోర్కెలు, అభిప్రాయాలు, క్రియలు గురించే ఆలోచిస్తాడు. పరిపక్వత చెందినవాడు తన ఇష్టాయిష్టాలకు అతీతుడై , సహనంతో వాటిని ఎదుర్కోగలడు.

శ్రీకృష్ణుడు "సత్త్వ౦ మనను ఆనందంలో ఓలలాడిస్తుంది" అని చెప్పేడు. అంటే మనం ప్రపంచంలో ఏదీ శాశ్వత సుఖం ఇవ్వదని తెలుసుకొంటాం. మనం మార్పు చెందని సుఖం గురించి వెదుకుతా౦. దీనివలన మనం సత్త్వాన్ని దాటి, త్రిగుణాల కతీతంగా శాశ్వతమైన స్వతంత్రం, ఆనందాన్ని పొందుతా౦.

నాకు పదేళ్ళ వయస్సులో ఆంగ్ల సాహిత్యం పరిచయం చేయబడింది. అంత మంచి కథలు, పాత్రధారులు ఉన్నారని ఊహించలేకపోయేను. నా స్కూల్ లో గ్రంధాలయం అంతా ఒక బీరువాలో హెడ్ మాస్టర్ కుర్చీ వెనుక ఉండేది. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. నిజంగా శ్రద్ధ ఉన్న వారికి ఆయన పుస్తకాలు ఇచ్చేవాడు. ఆంగ్ల నవలలు చాలా పెద్దగా కూడా ఉండేవి. ముఖ్యంగా చార్లెస్ డికన్స్ వ్రాసిన నవలలు. ఆంగ్లం నేర్చుకోవడం నాకు అతి కష్టం అనిపించేది. అందువలన నేను నెమ్మదిగా చదివేవాడిని. ఆ పొడుగాటి నవలలో పూర్తిగా మునిగిపోయేవాడిని. వాటి ముగింపులో నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే అంతటితో నవల చదవడం అయిపోయింది. నేను దాన్ని ఇంకా పొడిగించటాకి దాన్ని మూసి, ప్రక్కన పెట్టేవాడిని. నా చిన్న మేనకోడలికి నా భార్య క్రిస్టినా చకలేట్ ఇస్తే అది దాన్ని దాచి అప్పుడప్పుడు తింటూ ఉండేది. అది చిన్న పిల్లలు చేస్తే ఫరవాలేదు. కానీ పెద్దవారు అలా చేయరు.

ధ్యానం గురించి నా ప్రసంగాన్ని వినడానికి అప్పుడప్పుడు క్రొత్తవాళ్ళు వచ్చేవారు. వాళ్ళు అశాశ్వతమైన విషయాలగురించి ఎంత నిరుత్సాహంగా ఉన్నారో చూద్దామని వాళ్ళని పరీక్షించే వాడిని. ఎవరైతే అశాశ్వత సుఖాలను కాంక్షి౦చరో వారు ఆధ్యాత్మికంగా పైకి ఎదగగలరు. అట్టివారు జీవితమనే బొమ్మలాటకు అతీతమైనవారు. వాళ్ళకి అప్పటికీ బట్టల విషయంలో వ్యామోహం ఉండవచ్చు. ఆధ్యాత్మికత వస్తే అదీ పోతుంది. ఆధ్యాత్మిక జీవితం కష్టమైనది. దానిపై గట్టి పట్టు ఉండాలి. వాళ్ళకి అది అలవాటైతే ముందుకు సాగగలరు.

శ్రీకృష్ణుడు "రజస్ మనను కర్మతో బంధిస్తుంది" అంటాడు. రాజసికుడు సవా లక్ష పనులు చేస్తూ ఉంటాడు. కానీ దేని మీదా వాడికి ఏకాగ్రత లేదు. ఎంతసేపూ చలనంలో ఉండి, అశాంతిగా ఉంటాడు.

ఇవాళ ఇంటికి వెళుతూ ఉంటే ఒక చెత్తలబండి మీద "ఇది ఎక్కువగా ఆగుతుంది" అని వ్రాసి ఉన్నది. ఇది రాజసికునికి వర్తిస్తుంది. చెత్తల బండి చెత్త ఉన్న అన్ని చోట్లా ఆగుతుంది. అది పెద్ద శబ్దం చేస్తుంది. చెత్తను ఎత్తి మీద వేసికొంటుంది. మరికొంత దూరం వెళ్ళి అదే పని చేస్తుంది. ఎవరైతే లక్ష్యంలేని పనులు చేస్తారో, సుఖానికి బద్ధులవుతారో అటువంటి వారే. వాళ్ళు దుకాణం నుంచ దుకాణంకు, హోటల్ నుంచి హోటల్ కు, దేశం నుంచి దేశంకు మారి తిరుగుతూ ఉంటారు. మార్పుకై జీవితాన్ని వృధా చేస్తారు. "నాకు మార్పు కావాలి" అనుకుంటాం. మనకి మార్పు ఆఖరుగా కావాలి. అది కానివి చాలా ఉన్నాయి. మనకి అత్యవసరం శాశ్వతమైనది.

కర్మ చేయాలనే పట్టువల్ల ఒత్తిడి కలుగుతుంది. ఒకనికి ధనార్జనపై ఎక్కువ కోరిక ఉంటుంది. వాడు ఇంటి గురించి ఎక్కువ ఆలోచించడు. తన కుటుంబంతో ఆనందంగా కాలం గడపడు. వాడు సెలవు రోజు కూడ దుర్భరంగా తలుస్తాడు.

రాజసికుడి మంత్రం: "లక్ష్య సిద్దికి ఏ పనైనా చెయ్యచ్చు ." అతడు లక్ష్యం నెరవేర్చుకోవడానికి సదా ఆలోచిస్తూ ఉంటాడు. అది పని చేస్తుందా? అది అధర్మం కావచ్చు కాని వృధా. మంచి దారులతో మంచి లక్ష్యాన్ని సాధించడమనేది ఆధ్యాత్మిక జీవనంలో మొదటి సిద్ధాంతం. మనం శాంతిని తయారు చేయలేం. శాంతి శాంతి వలననే కలుగుతుంది. యుద్ధం తననితాను పెంచుకుంటూ పోతుంది. దురాశ సంతృప్తి నివ్వదు. అది మరింత దురాశ కలిగిస్తుంది. పోటీ ఒకడికి క్షేమం కలిగించదు. అది వేర్పాటుని కలిగిస్తుంది.

మహాత్మా చెప్పేరు లక్ష్యం, దాన్ని సాధించే మార్గాలు ఒక్కటే. మంచి మార్గంలో వెళ్ళి, ఇంటిలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఐకమత్యంతో ఉంటే "నేను విజయం సాధించేనా?" అని అడగనక్కర లేదు. ఆ ప్రశ్న నిరర్థకం. గాంధీ చెప్పేది: "పూర్తి ప్రయత్నము పూర్తి విజయాన్ని ఇస్తుంది. " మనం చేయవలసినదేమిటంటే హింసా కాండకి పరిష్కారం కనుగోవడం. మా ధ్యాన పాఠశాలవంటి దానికి సమయం, శక్తి, వనరులు సమకూర్చడం. బౌద్ధులు లాగ మనము గొప్పదైన క్రియను, కోపం, భయం, దురాశ లేకు౦డా చెయ్యాలి. మనం ఆడగవలసింది "నేను పూర్తి ఏకాగ్రతతో ప్రతి రోజూ ఏదో చేతనైనంత మంచి చేస్తున్నానా?"

పై శ్లోకం తమస్ భ్రాంతిని కలుగజేస్తుందని చెప్తుంది. అది జ్ఞానాన్ని కప్పివేసి అజ్ఞానాన్ని కలిగిస్తుంది. మన ఎరుకను తెలియకుండా చేయిస్తుంది. తామసికుడు మానవాళిలో అతి క్రింద ఉన్నవాడు. వాడు కర్మ ససేమిరా చేయడు. ఎందుకంటే వాడికి ఖాతరు లేదు.

మన అయిష్టమైన క్రియ చేయాలంటే తమస్ ఆవహించి మనని నిశ్చేష్టులిని చేస్తుంది. పక్షవాతంలా ఉంటుంది. తామసికుడు ఏ కర్మను చేయలేడు. సున్నిత స్వభావం వానిలో లేదు. వాని వలన ఇతరులకు కలిగే ఇబ్బందిని తెలుసుకోలేడు. వాడు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని తెలియక, తన స్వార్థాన్ని తాను చూసుకొంటాడు. ఎన్నో ద్రోహాలు, విశ్వాసఘాతక పనులు, తమస్ ఆవహించినప్పుడు కలుగుతాయి. మనకు విశ్వాసమంటే తెలియకపోతే దాని పర్యావసానము కూడా తెలియదు.

తమస్ వలన ఒక మనిషి, జాతి, దేశం స్వార్థానికి ఉపయోగింపబడితే మనకి ఏమీ పట్టనట్టు ఉంటాము. ఎటువంటి సానుభూతి, కోపం కలుగదు. ఒకనికి జరిగిన అన్యాయము, వాడు పడే యాతన, మన గుండెను కరిగించదు. అది చాలా బాధాకరమైన విషయము. చాలా మందికి ప్రపంచంలో జరుగుతున్న యాతన గురించి తెలియదు. ఎందుకంటే వారికి స్వార్థ బుద్ధి తప్ప వేరేది లేదు.

కొంత కాలం క్రిందట దినపత్రికలో సాన్ ఫ్రాన్సిస్ కో నగర అధ్యక్షుడు (mayor) తన సహోద్యోగి చే కాల్చి చంపబడ్డాడాని చదివేను. చంపినవాడు ఆ అధ్యక్షుడు వానికి అన్యాయం చేసేడని వెళ్ళి ఒక తుపాకీ కొన్నాడు. నేను ఆ నగరవాసులు కలత చెంది తుపాకీలకు సంబంధించిన చట్టాలను బలోపేతం చేస్తారని తలంచేను. కానీ వారు కొన్ని రోజులు శోకం చెంది, ఆ విషయం మరచిపోయేరు. క్రోధం వల్ల చాలా గొప్పవారు - కెనెడి, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు--వేలకొలది సామాన్యులు, ఆడవారు, పిల్లలు తుపాకీలచే కాల్చబడి మరణించేరు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతన్నా ప్రజలు షరా మామూలు అని ఉన్నారు. చాలా మందికి తెలీని విషయం మనం నిస్వార్థమైన, అహింసా చట్టాలను దబాయించి అడగాలి.

శ్రీకృష్ణుడు మనమందరమూ జీవితానికి తోడ్పడాలి అని మన కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. మన భూలోక వాసానికి ఉన్న కారణమదే. ఎవ్వడైతే స్వార్థంతో, దేహాభిమానంతో, ఇతరులకేమైనా జరిగినా పట్టించుకోకుండా, పర్యావసానాలను తెలిసికోకుండా, ఉన్నాడో వాడు తమస్ అనే మసుగేసుకొని, తను తక్కిన వారిని ప్రభావితం చేయనట్టు ఉన్నాడు. అయినప్పటికీ వాడు తమస్ ను వీడి ధ్యానంలో ప్రవేశిస్తే బాగుపడతాడు. 137