Friday, December 31, 2021

Eknath Chapter 13 Sloka 17

13.17

ధ్యానేనాత్మని పశ్యoతి కేచిదాత్మాన మాత్మనా

అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే

దేహము నందలి ఈ ఆత్మను కొందరు శుద్ధబుద్ధితో ద్యానము చేసి దర్శింతురు. కొందరు జ్ఞానయోగము చేతను, మరికొందరు కర్మయోగము చేతను దర్శింతురు

అన్యే త్వేవ మజానంతః శృత్వా అన్యేభ్య ఉపాసతే

తే అపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః

ఈ విధముగ గ్రహించలేని కొందరు అన్యులవలన ఆలకించి ఉపాసన చేయుచున్నారు. శ్రవణాసక్తులగువారు కూడా మృత్యువును దాటుచున్నారు

హిందూ సంప్రదాయములో 4 యోగాలు అనగా దేవుని చేరడానికి మార్గములు, ఉన్నవి. అవి: జ్ఞాన యోగ అనగా జ్ఞానము ద్వారా, కర్మ యోగ అనగా నిస్వార్థ కర్మ ద్వారా, రాజయోగ అనగా ధ్యానం ద్వారా, మరియు భక్తి యోగ అనగా దేవునిపై ప్రేమ ద్వారా. భారత దేశంలోని యోగులు సాధనకు ఇందిలో ఒక మార్గాన్ని ఒకని స్వభామువల్ల గాని వాని అవసరాలను బట్టి సూచిస్తారు. ఇందులో ఏ ఒక్క మార్గమూ మిగతా వాటిని నివారించదు. సాధనకి అన్ని మార్గాలూ ముఖ్యమే.

శ్రీ రమణ మహర్షి జ్ఞాన యోగమును అనుసరించిన మహనీయుడు. ఆయన దక్షిణ భారతదేశంలో ఇతరులకు తెలియబడక, అజ్ఞాతంగా 1950 వరకు తన సాధనను చేసెను. మహాత్మా కర్మ యోగమునకు చక్కని ఉదాహరణ. ఆయన చేసిన నిస్వార్థ సేవ వర్ణింప శక్యము కానిది. శ్రీ రామకృష్ణ భక్తి యోగానికి ప్రతీక. మిగతా మతస్తుల లాగ, ముఖ్యంగా క్రిస్టియన్ లలాగ, ఆయనకు దేవుడంటే ఎనలేని ప్రేమ. ఈ మూడు పద్దతులూ నీరు చొరబడని గోడలతో కట్టబడినవి అనుకునేవారికి, నా అమ్మమ్మ, నా ఆధ్యాత్మికకి మొదటి గురువు, ప్రేమకు ప్రతీక, ఇలా వివరిస్తుంది. ఆమె గొప్ప మేధావి కాకపోయినా నన్ను ప్రోత్సహించిన గురువు. ఎవరైనా ఆమెను జ్ఞానము, ప్రేమ, నిస్వార్థ సేవలలో, ఏదో ఒకటి ఎన్నికచేసుకోమంటే, ఆవిడ ఆ భావన అర్థరహితమని చెప్తుంది. జ్ఞానము, సేవ కలిగేవి ప్రేమ భావన వలననే. ఆ మూడూ ధ్యానము తదితరుల వలన వ్యక్త మవుచున్నవి. ఒకవేళ మహాత్మా గీత కర్మ యోగానికి, అనగా నిస్వార్థ సేవకి, చిహ్నమనంటే నేను ఆయనను ఖండించకుండా గీత ప్రేమకు కూడా చిహ్నమని నా అమ్మమ్మను దృష్టిలో ఉంచుకొని అంటాను. శ్రీ అరబిందో జీవితమే యోగమని వచించారు. గీత సూచించిన 4 మార్గములు ధ్యానంచేయడం , ప్రేమతో పని చేయడం, నిస్వార్థ సేవ చేయడం వల్ల మేళవించ బడతాయి.

యోగా పదములోనే మనకీ కిటుకు తెలుస్తుంది. యోగ గురువు పతంజలి యోగ రసాన్ని ఇలా చెప్పేరు: "యోగమనగా మన మనస్సులోని అన్ని ఆలోచనలను నిలిపివేయుట." దీని వల్ల మనకు తెలిసినదేమిటంటే ఏ మార్గమైనా మన ఆలోచనలను నియంత్రిస్తే అది యోగం. ఇలాగ ఇతర మతములు సూచించిన మార్గములను కూడా కలుపుకోవచ్చు. గీత సూచించిన యోగా భావగర్భితమైన అనుభవానికి మూలం. 99

Saturday, December 25, 2021

Eknath Chapter 13 Sloka 16

13.16

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః

పరమాత్మేతి చాప్యుక్తో దేహే అస్మిన్ పరుషః పరః

ఈ దేహమునందున్న విలక్షణమైన పురుషుడు ఉపద్రష్టయు, అనుమతించువాడును, భరించువాడును, భోక్తయును, మహేశ్వరుడును, పరమాత్మయునని చెప్పుచున్నాడు

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ

సర్వథా వర్తమానో అపి న స భూయో అభిజాయతే

ఎవడు ఈ విధముగ పురుషుని, గుణములతో కూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, వాడు సర్వవిధముల ప్రవర్తించుచున్నను తిరిగి జన్మించడు

నేను 20 ఏళ్ల క్రిందట యూరప్ నుండి అమెరికాకు వస్తున్నప్పుడు నేను ప్రయాణించే పడవ అరేబియన్ పెనిన్సులా చుట్టి గల్ఫ్ ఆఫ్ ఈడెన్ వైపు కొనసాగింది. నాకు అరబిక్ మరియు పర్షియన్ సాహిత్యంలో పండిపోయిన పండితులు, కవులు చాలామంది భారత దేశములో మంచి మిత్రులు. ముస్లిం సంస్కృతితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఎండిపోయిన ఎడారులతో నిండిఉన్న అరేబియా చరిత్ర భారతదేశంతోనూ , ప్రపంచంతోనూ ముడిపడి ఉంది. ఇదంతా నా మనస్సులో చెరగని ముద్ర వేసింది.

నాకు అన్నిటికన్నా రెడ్ సీ లో ప్రయాణం బాగా గుర్తు ఉంది. అది నేను పెద్దది అనుకోలేదు. ఒక పగలు, రాత్రి ప్రయాణం అనుకొంటే 3 రోజులు పట్టింది. అక్కడి గాలి వేడిగా, తేమగా అనిపించింది. గాలికి ఆ నీరు చలించలేదు. తోటి ప్రయాణీకులు వేడి భరించలేక డెక్ నుండి తమ గదుల్లోకి వెళ్లిపోయేరు. నన్ను నేను ఒక పురాతన నావికుడుగా భావించుకున్నాను. "ఒక్కడే రంగువేసిన సముద్రముపై". గదిలో చాలా మంది ఉన్నారు. అది ఇరుకు గది. ఉక్కగా ఉండడంతో, నేను నా పక్కని డెక్ మీద వేసికొని గంటలపాటు ఆకాశాన్ని ఆసక్తిగా చూస్తూ గడిపేను. షిప్ పర్వతాలని దాటి నక్షత్రాల క్రింద పయనించింది.

ఒక రాత్రి అరేబియన్ పెనిన్ సులాలో మండుతున్న స్తంబాలు కనిపించేయి. భయం గొలిపించే అరుదైన దృశ్యం. భూమి ఆకాశాన్ని తన మండుతున్న నాలుకతో తాకుతున్నట్టు అనిపించింది. ప్రోఫేట్ నరకాన్ని అలా వర్ణించేడా? సృష్టి లయమైపోతోందా?

ఒక నావికుడు "అవి ఆయల్ రెఫైనరీలు మండించే వంట గ్యాస్ వంటి వాయువు" అని చెప్పేడు.

మీకు ఆత్మనని జ్ఞానము ఉన్నప్పుడు జీవితంలోని గందరగోళాన్ని, నేను డెక్ మీదనుండి చూసిన నిశ్శబ్ద ఎడారుల , రిఫైనరీల దృశ్యాలులాగా, చూసి వైరాగ్యంతో గడుపుతారు, ఒక జర్మనీ దేశస్తుడు "నరకంలో ఏదీ మండదు మన అహంకారం తప్ప" అని వ్రాసేడు. అన్యుడిని చూడలేని ఎడారులు, కష్టాలలో ఉన్నట్లు అనిపించే మంటలు ఉన్నాయి. మీరు రిఫైనరీ కారు. మీరు నిజంగా మంటల్లో లేరు. మీరు శాంతంగా చూస్తారు. జీవితం ఒక ఖాళీ భ్రాంతి కాదు. దానికి ఒక గమ్యం ఉంది. కష్టాలలో ఉన్నా, తెర వెనుక ఒక శాశ్వతమైనది , దుఃఖాన్ని అంతంచేసేది ఉంది అని తెలుసు. ఇతరులకు సహాయం చేయడం, కష్టాలలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం వంటి కార్యాల వల్ల మీరు పరిమితిలేని ఆనందాన్ని అనుభవిస్తారు. చుట్టూ శబ్దాలతో నిండివున్నా మీరు హృదయంలో, మనస్సులో శాంతంగా ఉంటారు.

కొంత ఉపశమనం ఎందుకొస్తుందంటే గత స్మృతులు మీ భుజస్కందాల నుండి, అరేబియా పర్వతాలు కనుమరుగయినట్లు, జారి పోవడంవల్ల. ఆ పర్వతాలు నిజం. కానీ అవి నీడలంత సత్యం. మనం శరీరముతో తాదాత్మ్యం చెంది, తక్కిన వారితో వేర్పాటు చెందితే, అది తప్పు భావన. దానివల్ల మనకు, చుట్టూ ఉన్న వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనం ఆత్మ పరిశీలన చేసికొని మనం నిజంగా ఎవరని తెలుసుకొంటే మన తప్పులు మనని బాధించవు. అవి వేరే, గతంలో ఎరిగిన, వారికి చెందుతాయి. గతం గతః. గాంధీని గతంలో మీరు ఆ పని ఎందుకు చేశారు లేదా ఆ మాట ఎందుకన్నారు అని అడిగినప్పుడు ఆయన "జీవితాన్ని అప్పుడు అలాగ చూసేను. ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాను" అని సమాధానం ఇచ్చేవాడు.

ఆత్మ జ్ఞానం ఉదయించగానే, మన శాస్త్రాలు చెప్పినట్లు, మరొక జీవిగా మరు జన్మ ఉండదు. దీన్ని అంత సులభంగా అర్థం చేసికోలేము. కొన్ని హిందూ, భౌద్ధ శాఖలు దాన్ని అక్షరాలా తీసుకొంటాయి: నీకు మరో పుట్టుక లేదు. నేను ఉంకో శాఖకు చెందినవాడిని. కొన్ని కారణాలవల్ల రెండవది నమ్ముతాను. దీని ప్రకారం ఆత్మ జ్ఞాని, మళ్ళీ మళ్ళీ, సంసార బంధంలో పడకుండా, ఇతరులకు చేయూత నీయడానికి, వారి దుఃఖాన్ని పోగొట్టడానికి పుడతాడు.

ఈ మిడి మిడి జ్ఞానంవల్ల మరణం అనగా జీవితం అంతమయ్యేది కాక వేరొక ద్వారాన్ని చూపేది అన్న అవగాహన మనని తేలికగా ఉంచుతుంది. బాల్యంలో, మా ఆవు మరణిస్తూ ఉండగా, నా అమ్మమ్మ అక్కడికి పిలిచింది. ఆవు ముఖం ఎత్తి దైన్యంగా చూసింది. నేను దాని కళ్ళలో భయం, సంశయం చూసేను. అది అచ్చం నా బంధువులలో మరణాన్ని ఎదురుచూసే వారలను చూచినపుడు వచ్చే భావనలే. "ఏమిటవుతున్నాది? దీని తరువాత ఏమిటి? చివరికి అంతా అయిపోయిందా?" అని అంటున్నటు అనిపిస్తుంది. పైపైనే కాదు, మనస్సు లోతుల్లో కూడా, మరణమంటే భయం ఉండదు. ప్రతి మతంలో జ్ఞానులు "మాకు మరణమంటే భయం లేదు. మాకు తెలుసు" అని చెబుతారు.

మీరు నిద్రకు ఉపక్రమించేటప్పుడు, మీకు మళ్ళీ లేస్తారని తెలుసు. లేకుంటే అది గాబారపెట్టే విషయం. అది బుద్ధుని మతం. ఆయన మనను "నువ్వు నిన్న రాత్రి నిద్ర పోలేదా? మేల్కొన్నప్పుడు నువ్వు మునపటివాడివేనా? ఒకానొక నిద్రావస్థలో నీవు వేరొక వ్యక్తివని అనిపించలేదా? " అని అడుగుతాడు. మరణం కూడా మనం అర్థం చేసుకొంటే అటువంటిదే. పంచభూతాలతో చేయబడిన దేహం పోతుంది. కాని ఆత్మ మాత్రం, రెడ్ సీ లో నిశ్శబ్దంగా పయనించిన ఓడ లాగ, సాగిపోతుంది.

నాకు ఇతరుల మరణాన్ని చూసే ఘటనలు ఎదురయ్యేవి. వాళ్ళ మరణ ఘడియలు ఆసన్నమైనప్పుడు వాళ్ళ ప్రక్కన కూర్చొని, చేయి పట్టుకొని, నా మంత్రాన్ని జపిస్తూ, వాళ్ళకి మరణం మీద అవగాహన కల్పిస్తూ, అంటే మరణమంటే అంతం కాదని, అది ఒక నూతనమైన అనుభవానికి వెళ్లేముందు కొంత విశ్రాంతి అని చెప్పేవాడిని. ఒక వ్యక్తి చిన్న పిల్ల లాగ స్పందించేడు. అతని బంధు మిత్రులు ఆయనవద్ద లేరు. నేను కొన్ని నిమిషాలు అక్కడే ఉన్నాను. "మీరు నన్నేమైనా ప్రశ్నని అడగ దలుచు కొన్నారా?" అని అడిగేను.

"అవును. ఒక్కటే: నేనీ దేహాన్ని వదిలేసిన పిదప మిమ్మల్ని మళ్ళీ చూస్తానా?"

"అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు మనం వేర్పడకూడదని గాఢంగా నమ్మితే , మనమెప్పుడూ కలిసే ఉంటాము. " అన్నాను.

శాస్త్రం చెబుతుంది నీ గురువును గాఢంగా నమ్మితే, ఆయన మీది ప్రేమ వల్ల కలిగిన బంధం మరణం కూడా త్రెంపలేదు. ఆత్మ జ్ఞానులు సృష్టినంతటిని ఎంత గాఢంగా ప్రేమిస్తారంటే, మళ్ళీ మళ్ళీ పుట్టి ఇతరుల దుఃఖాన్ని తీసివైసి వాళ్ళ గమ్యాన్ని గుర్తు చేస్తారు, అని భౌద్ధులు నమ్ముతారు. "ఏఒక్క జీవి దుఃఖిస్తున్నా, నేను నిర్వాణాన్ని పొందలేను" అని గౌతమ బుద్ధుడు వచించేడు.

Saturday, December 18, 2021

Eknath Chapter 13 Sloka 15

13.15

కార్యకారణక ర్త్రు త్వే హేతుహుః పర్కృతి రుచ్యతే

పురుష సుఖదుఃఖానాం భోక్త్రుత్వే హేతురుచ్యతే

దేహేంద్రియములు ప్రవర్తించుటకు ప్రకృతి కారణమనియు, సుఖదుఃఖములు అనుభవించుటకు పురుషుడు కారణమనియు చెప్పబడినది.

పురుషః ప్రకృతిస్తో హి భుఙ్క్తే ప్రకృతిజాన్ గుణాన్

కారణం గుణసంగోఅస్య సదసద్యోని జన్మసు

ప్రకృతియందున్న పరుషుడు ప్రకృతి జన్యములగు గుణములను అనుభవించుచున్నాడు . గుణ సంగము వలననే అతనికి నీచోన్నత జన్మలు కలుగుచున్నవి

మనము పదార్థము, మనస్సు అనబడే క్షేత్రము మీద దృష్టి కేంద్రీకరించు కారణము వలన ఈపై శ్లోకములను అర్థము చేసికొనుట కష్టము. కర్మలు, ఆలోచనలు, క్షేత్రమునందే జరుగునని గీత పదే పదే చెప్పుచున్నది. వాటి పర్యావసానము కూడా క్షేత్రమునందే జరుగును. కానీ క్షేత్రము జడము. మనస్సు, పదార్థము గల క్షేత్రమునకు ఎరుక లేదు. కావున మనస్సు తనంతటతాను ఆనందాన్ని అనుభవించలేదు. మేధ విశ్లేషణం చేయలేదు. ఇంద్రియాలు అనుభవించలేవు. శుద్ధమైన, అందరిలో సమానముగాయున్న ఆత్మ మాత్రమే చూసి ఆనందమును అనుభవించునది.

ఇది అంతయు అనుభవములో లేని సిద్ధాంతము. అనుభవం వచ్చిన ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగిన శక్తి వాటికున్నది. ఉదాహరణకు ఒక మంచి మిత్రుడు మేపిల్ సిరప్ కేన్ క్రిస్మస్ బహుమతిగా ఇచ్చేడు. నా పిల్లలు దానిని ఆనందంగా తింటున్నారు. వాళ్ళు ఉదయాన దోసలతో ఆనందంగా తింటూ ఉంటే తీపి అందరికీ ఎందుకు నచ్చుతుందని నేను ఆలోచించేను. చెక్కెర తీపేగాని ఎటువంటి ఆహ్లాదము ఇవ్వదని నేనంటే ఎంతమంది అర్థంచేసుకొంటారు అని ప్రశ్న వేసికొన్నాను. పదములు వాడడం సులభమే కాని వాటి అర్థము తెలిసికోవడం మిక్కిలి కష్టం. ఆనందము మనోహరమైనది కాదు, చెడు కాదు. అది ఇంద్రియానుభూతి.

మనము దీనిని ప్రతిరోజూ అనుభవానికి తెచ్చుకొంటాము. దానిని ఎంత పరిశీలించనా అది సర్వ జీవులకు వర్తిస్తుందని చెప్పలేము. దానినుండి అనుభవానికి అందే అభిప్రాయమును చెప్పలేము. నాకు క్రీడలు అనుభవములో చాలా అప్రీతికరం అవ్వచ్చు. కాని ఒక క్రీడాకారుడుకి తన క్రీడా చాలా ప్రీతి. గుర్రం స్వారీ అన్నిటికన్నా నాకు ప్రీతి. అది రోజు సైకిల్ తొక్కేవాళ్ళకి అర్థంకాదు. ఇంద్రియ అనుభవము ఒకటే. కాని దానిని వివరించే పదముల సముదాయము వేరు. నేను "గుర్రం స్వారీ ఆహ్లాదము కాదు" అని చెప్తే, వాళ్ళు "కాదు. అది చాలా మనోహరం" అని చెప్తారు. మేమిద్దరమూ తప్పే. ఎందుకంటే అది అమనోహరం అనే పదాల గారడీతో చెప్పవచ్చు.

ఆహారం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. కొందరు చిక్కని, చేదు కాఫీని ఇష్టపడతారు. వేలమందికి బీర్ అంటే ఇష్టం. అలాగే పరమ చేదైన, నాలుకకు వికారం కలిగించే విస్కీ కూడా. మనం వాడే మసాలా నోటిని కాలుస్తుంది. మనకు వాటి తేడాల ఎరుక ఉంది. కానీ "ఇష్టాయిష్టాలు మనస్సులోనే" అన్ని జీవులందరికి వర్తింప జేసే విధంగా చెప్పలేము.

ఒక మానసిక భావన ప్రియము లేదా అప్రియము కావచ్చు. అది ఒక మానసిక అనుభవము. ఒక మానసిక స్థితి. మనం దాని ఆది చూడవచ్చు. పిదప దానిని మరచిపోవచ్చు. కానీ స్మృతికి మానసిక భావన వర్తించదు. ఏదీ స్మృతిని మాటలు లేదా క్రియగా మార్చలేదు. దాన్నే వైరాగ్యం అంటారు.

తల్లులు తమ పిల్లలకు ఆహార సంబంధిత అలవాట్లు ఎలా వచ్చాయని నన్ను అడుగుతూ ఉంటారు . మనకు కొంత అనుభవము జీవితంలో అవసరము. పిల్లలు తగిన మోతాదులో అప్పుడప్పుడు తీపి పదార్థాలను తినడంలో తప్పు లేదు. వాళ్ళు మంచి రుచి గల , పౌష్టిక ఆహారం తినాలి. కేవలం రుచికై పదార్థాన్ని తినకూడదు. నేను బాల్యంలో తినే పదార్థాలను ఆనందంతో తినేవాడిని. ఎందుకంటే అవి ప్రేమతో చేయబడినవి. రుచుల నేర్చు కోవచ్చు కాని ప్రేమ అలా కాదు.

నా అమ్మకి రుచికరమైన పదార్థముల మీద అంత మక్కువ లేదు. కానీ నా అమ్మమ్మ విషయం వేరు. ఆమెకి రుచులు కావాలి. అలాగని ఆమె అదేపనిగా దాని గురించి ఆలోచించదు. ఎప్పుడైతే భోజనం చేస్తుందో అప్పుడే. నా అమ్మకు తినే పదార్థము అమనోహరం. ఆమెకి రుచి కావాలా వద్దా అనే సందిగ్దావస్త లేదు. ఆహారం తినేది కేవలం జీవించడానికే. అది తక్కిన క్రియల వంటిదే. ఈ భావన మిక్కిలి అరుదైనది. నాకది సంక్రమించలేదు. కాని నా అమ్మకున్న వైరాగ్యం నా ఆధ్యాత్మిక కృషికి కారణ భూతమైంది. ఆమె వంట అద్భుతంగా చేస్తుంది. ఆమె నాకై పిండివంటలు చేసి నేను తింటూవుంటే చూసి ఆనందించేది. ఆమెకు ఎందుకు తినాలనిపించదో నాకు అర్థంకాని విషయం. నా ఆనందమే ఆమె ఆనందం. ఈ భావన నాకు నా అమ్మనుంచి సంక్రమించింది. సంవత్సరాల తరబడి ఆధ్యాత్మిక సాధన చేయడంవల్ల నాకు రుచుల మీద పెద్ద ఆసక్తి లేదు. నేను రుచిగల వంటలను ఒక పాక శాస్త్ర ప్రవీణుడు కన్న ఎక్కువ ఆనందంతో తింటాను. పిల్లలను చాకలేట్, ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసికెళ్లినపుడు వాళ్ళ కన్నా నేనే ఎక్కువ ఆనంద పడతాను. వాళ్ళ వల్ల నా ఆనందం అనేక రేట్లు పెరుగుతుంది. నిజానికి నా ఆనందానికి అవధులు లేవు.

95

Saturday, December 11, 2021

Eknath Chapter 13 Sloka 14

13.14

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే

ఈ విధముగ క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయముల విషయము తెలుపబడినది. దీనిని తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపామును పొందుటకు అర్హుడగుచున్నాడు

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విధ్ధి ప్రకృతిసంభావాన్

ప్రకృతి పురుషులకు ఆది లేదు . వికారములు, గుణములు ప్రకృతి వలన పుట్టిన వానివిగ తెలిసికొనుము

3 పదములు ఇక్కడ క్రొత్తగా చెప్పబడినవి. ఇవి సాంఖ్య సిద్ధాంతమునకు చెందినవి. ప్రకృతి అనగా శక్తి, పదార్థం, మనస్సు. మనమా శక్తి యొక్క క్రియలను చూడకపోయినా భౌతిక ప్రపంచము శక్తి నుండి ఆవిర్భవించినది. పదార్థమే కాక మనస్సులోని విభాగాలను మనకు ఇంద్రియముల ద్వారా చూడ శక్యమకాని మౌలిక శక్తి వలన వచ్చినవిని సాంఖ్య చెప్తుంది. ఇది అన్ని వస్తువులలోను, ఘటనలలోనూ మన అనుభవానికి వస్తుంది. ముందు చెప్పిన క్షేత్రము యొక్క 24 విశ్వ మూల సూత్రములలో ప్రకృతి మొదటిది. అది అవ్యక్తమై యుండి, కనబడే ప్రపంచమునకు మూలమై యున్నది.

పురుషుడనగా క్షేత్రమును తెలిసినవాడు. ఏది జ్ఞేయమో -- తెలిసికొనబడినది -- అది ప్రకృతి. పురుషుడు జ్ఞాత అనగా తెలిసికొనువాడు. అదే ఆత్మ లేదా పరమాత్మ అనుబడునది.

మూడవ పదము గుణమునకు ఈ పుస్తకములో విశేషమైన స్థాన మున్నది. సాంఖ్య సిద్ధాంతం ప్రకృతి 3 స్థితులుగా మారిన ఎరుక కలిగిఉంటుందని చెప్తుంది. అవి మూడు గుణాలు. అన్ని పదార్థములు, మనస్సు వీటి సముదాయము. అవి తమస్సు, రజస్సు, సత్వ గుణములు. తమస్సు నిద్రను సూచిస్తుంది. రజస్సు క్రియలను ప్రేరేపించునది. సత్వ మనగా సామరస్యము లేదా సమత్వము.

బడిలో మనము పదార్థము యొక్క 3 స్థితులను: ఘన, ద్రవ, వాయువుగా నేర్చుకొన్నాము. 3 గుణాలను కూడా ఇలాగే వివరింపవచ్చు. తమస్సు అనగా ఘనీభవించిన శక్తి. జడత్వముతో అడ్డంకులు కలిగిoచునది. ఒక ఘనీభవించిన నీటిలో (ice) అణువుల మధ్య శక్తి దాగి ఉన్నది. కాని ఆ శక్తి బంధింపబడినది లేదా అవ్యక్తమైనది. మళ్ళీ నీరు ద్రవ రూపములో మారిన కొంత శక్తి విడుదలచేయబడుతుంది. అది రజస్సుకు ప్రతీక. మనకు పోటెత్తిన నదియొక్క శక్తిని గూర్చి తెలుసు. అది రజస్సు. అదే నీరు వాయు రూపంలో ఆవిరిగా ఉంటే అది సత్వం ఎందుకంటే దానితో యంత్రములను నడుపవచ్చు.

గుణాలను మనస్సు దృక్పథంతో చూస్తే అవి వివిధమైన మానసిక స్థితులు. తమస్సు అన్నటికిన్న క్రిందనున్న స్థితి. అది అచేతనమైన బేస్మెంట్ లాంటిది. చాలామంది ఇళ్ళలో పనికిరాని సోఫాలూ, డబ్బాలూ, పనిముట్లూ, పాత పుస్తకాలూ, చెత్తా చెదారం బేస్మెంట్ లో పడేస్తారు. అచేతన మనస్సు అటువంటిదే. అలజడితో, కోట్ల జన్మల సంస్కారములతో నిండి ఉంటుంది. దానిలో గొప్ప శక్తిఉంది. కానీ అది బుద్ధికి అందుబాటులో లేదు.

రజస్సు బేస్మెంట్ మీద ఉన్నది. అది కోర్కెలు, క్రోధం, కుతంత్రాలు, పోటీ పడడం, నిరుత్సాహంతో నిండి ఉంటుంది. అది శక్తి వ్యక్తమైన స్థితి. కానీ దానిని కట్టడి చేయడానికి వీలు పడదు. అలాగే అది అహంకారి.

సత్వం ఉన్నత స్థితి. వైరాగ్యంతో, చెదరనిదై, స్వతహాగా అణిగిమణిగి ఉన్నది. దాని స్థితిలో ఇది నియంత కాక సామరస్యం, లక్ష్యం, బుద్ధి, కోరికతో నిండి ఉన్నది. నిరుత్సాహం ఉండచ్చు కాని దాన్ని నివారించవచ్చు.

ఈ విధంగా మూడు గుణాలూ మనిషిని ప్రవర్తింపజేస్తాయి. ఇటువంటి విశ్లేషణం నేను ఏ సిద్ధాంతములోనూ, మానసిక శాస్త్రంలోనూ చూడలేదు. వీనివల్ల మన వ్యక్తిత్వం ఏ విధంగా చేయబడినదో, ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య తేడా ఎందుకు వుందో తెలియబడును. తద్వారా మనం ఒక ఉన్నత ఆదర్శం ఏర్పరుచుకోవచ్చు.

మిగతా పుస్తకంలో వీటిని గూర్చి చెప్పబడుతుంది. తన సహజ స్థితిలో ఎరుక చైతన్యంయొక్క ప్రవాహం. క్రియలపై గుణముల ప్రభావము వలన మనమా సహజ స్థితి నుండి ఖండితమైన, ముక్కలైన, ఒక్కొక్కప్పుడు నిశ్చల మైన ఎరుకగలిగిన వారాలమౌతాము. ఈ విధంగా గుణాలు కంటి అద్దాలలా జీవితాన్ని పరిశీలించడానికి తోడ్పడతాయి. అవి మనమెక్కడ చూసినా ఖండమైనవి, వేర్పడినవి. మన విరుద్ధమైన ఇష్టాయిష్టాలు, మనలోని సంఘర్షణ, వేర్పాటు వీని వలనే.

పరిణామం మన సహజ స్థితికి అతి నెమ్మదిగా తీసికెళుతుందని గీత చెపుతుంది. అంటే నిర్మలమైన, ఖండింపబడని ఎరుక. మొదట తమస్సును రజస్సు గా మార్చాలి. అంటే ఉదాసీనత, సున్నితమకాని గుణమును శక్తివంతమైనదిగా, ఉత్సాహమైనదిగా మార్చడం. కానీ రజస్సు యొక్క శక్తి అహంకారంతో, చెల్లాచెదరై ఉంటుంది. దాన్ని సత్వంగా మార్చాలి. దానివల్ల శక్తినంతా పరోపకారనికి వెచ్చించవచ్చు. ఈ స్థితిలో అత్యంత ఆనందం ఉంది. శాంతమైన మనస్సు, మిక్కిలి ఉత్సాహము, బుద్ధి కుశలత ఏర్పడుతాయి. కాని ఇదే గమ్యం కాదు. మనము కళ్ల అద్దాలతో జీవితాన్ని చూసినంతసేపూ అది ముక్కలైనట్లుగా కనిపిస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం ఆ కళ్ల అద్దాలని తీసివేసి సమాధి స్థితి పొందడం. అంటే మనస్సును స్థిరపరచడం. దానివల్ల మనము శుద్ధమైన, అఖండమైన చైతన్యంతో ఉంటాము. అది శాశ్వతమైన ఆనందం. గుణాతీతులు ఎక్కడా వేర్పాటు చూడరు. తమ ప్రతిబింబాలు ఇతరులలో, అందరి ప్రతిబింబాలూ తమలో చూస్తారు. ఇది జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం. అది అఖండం, సర్వం.

రైబ్రూక్ ఇలా చెప్పేరు: మనం వీక్షించేది మనలాగా ఉంటుంది. మనం వీక్షింప బడినట్టుగా ఉంటాము. మనము మనస్సుకున్న అద్దాలతో చూస్తాము. మనమెప్పుడైతే ఖండితమైనామో ఇతరులను వేర్పాటుతో చూస్తాము. మనం సర్వం అయితే, మన హృదయంలో దేవుని, ఇతరుల హృదయాలలో దేవుని చూస్తాం.

Sunday, December 5, 2021

Eknath Eswaran Bhagavat Gita Translation to Telugu Running Links

Click Here to Go To Complete 3 Volumes Of Prof. Eknath Easwaran's Gita Translation

Sep, 2021

https://gandikotam.blogspot.com/2021/09/ekanath-chapter-13-sloka-1.html

Oct, 2021

https://gandikotam.blogspot.com/2021/10/ekanath-chapter-13-sloka-2.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-3.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-4.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-5.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-6.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-7.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-8.html

Nov, 2021

https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-9.html https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-10.html https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-11.html https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-12.html

Dec,2021

https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-13.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-14.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-15.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-16.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-17.html

Jan, 2022

18. https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-18.html 19. https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-19.html 20. 21.https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-20.html https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-21.html

Chapter 14

Jan, 2022

22. https://gandikotam.blogspot.com/2022/01/eknath-gita-chapter-14-sloka-1.html

Feb, 2022

23. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-2.html 24. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-3.html 25. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-4.html 26. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-5.html

March, 2022

27. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-6.html 28. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-7.html 29. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-8.html 30. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-9.html

Saturday, December 4, 2021

Eknath Chapter 13 Sloka 13

13.13

అవిభక్తం చ్ భూతేషు విభక్త మివ చ స్థితం

భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ

అవిభక్తమైనను ప్రాణుల యందు విభక్తమై యున్నట్లు తెలియుచున్నది. ప్రాణులను సృష్టించునది , భరించునది, లయింపజేయునది అదియే.

జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పర ముచ్యతే

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం

అది జ్యోతులకు జ్యోతియై ఉన్నది. తనస్సునకు అన్యమైనది. అది జ్ఞానముగను, జ్ఞేయముగను, జ్ఞానగమ్యముగను భాసించుచున్నది. సకల ప్రాణుల హృదయాలలో ప్రకాశించు చున్నది

గీత పదే పదే ఆత్మ ప్రకాశమని, మూలమని చెప్పుచున్నది. అది ఒక ఉపమానము మాత్రమే కాదు. గాఢ ధ్యానంలో అది అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం వచ్చేవరకు ఆ పదాలను అర్థం చేసుకోవడం కష్టం.

ఆత్మ జ్ఞానం వచ్చేవరకు మనము చీకట్లో బ్రతుకుతున్నాము -- నిజంగా నేను శరీరమను భావంతో -- అని బుద్ధుడు వచించవచ్చు. ఇది మంచి శాస్త్ర జ్ఞానము. భౌతికంగా కూడా నిద్రలో వచ్చే కలలో అనుభవం, వేకువలో వచ్చే మాయా సంభంద కలలకు పెద్ద తేడా లేదు. జీవితమంతా మనము నిద్రలో నడుస్తున్నామని బుద్ధుడు చెప్ప వచ్చు. సూచనల ప్రకారం వెళ్ళి వచ్చి, మన వాటా చదివి, మన క్రియలను చేతన మనస్సుతో తెలిసికొనలేక, ఒక కలగంటున్న వాడికన్నా వేరుగా లేక ఉన్నాము.

"అర్థరహితము. నేను చూడలేనా ? వినలేనా? సూర్యుడు ప్రకాశించుచున్నాడు, పక్షులు కిలకిల మంటున్నాయి, ఇంటి ప్రక్క వారు వాదించుకుంటున్నారు. ఇవన్నీ నిద్రలో నాకు తెలీకుండా జరుగుతున్నాయి" అని చెప్దామనుకుంటాము. ఒక నిద్రిస్తున్న వ్యక్తి అలా అనలేడా? మనము వినడం చెవులతో కాక, చూడడం కళ్ళతో కాక వాటిని మనస్సుతో చేస్తాము. మనము నిద్రిస్తున్నంతసేపూ మనము కలలో విన్నవి, కన్నవి నిజం. ఒక కుక్క కలగంటునప్పుడు చూడ౦డి. దాని చెవులు, మూతి కదులుతాయి. అది దాని మనస్సులోని గత స్మృతులతో చేసిన ఒక పిల్లి గురించి కల గంటూ నిద్రలో రమిస్తున్నాది. నా కుక్క మూకా సముద్రపు ఒడ్డున పరిగెత్తుతున్నట్టు కల గంటుంది. ఎలా చెప్పగలనంటే నిద్రలో దాని కాళ్ళు ముందూ వెనుకకూ కదులుతూ ఉంటాయి. మీరు నిద్రలో ఎవరో చంపడానికి వస్తున్నారని కలగంటే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేహంలో రసాయనిక మార్పులు జరుగుతాయి. ఇదంతా మనం ప్రాణభయం నిజమనుకోవడమువల్ల.

మీరనవచ్చు: "అది సరే, కలలో జరిగే సంఘటలను ఒక క్రమంలో చూడు. ఒక నిమిషం నువ్వు 5 ఏళ్ల బాలుడివై కెనడా లో రైలులో ప్రయాణిస్తూ ఉంటావు. మరు నిమిషం నువ్వు డెడ్ సీ లో బోటు షికారు చేస్తూ ఉంటావు. కలలో ఎటువంటి తర్కము లేదు. నీ ఆధీనంలో ఏమీ లేదు."

మనం చేతనముతో అనుభవించే ప్రపంచం నిజమా? ఒక నిమిషం మీరు మిత్రురాలితో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. మరునిమిషం ఆమె ఏదో వెటకారం చేసిందని గట్టిగా గొడవపెట్టుకుంటారు. పనిచేసే చోట మర్యాదగా ఉంటారు. కానీ ఇంటికొస్తే వేరే రూపం మీ భార్యా పిల్లలకు చూపిస్తారు. మనకందరికి ఇటువంటి ఆశ్చర్యకరమైన నడవడిక తెలిసిందే. దయగల బుద్ధుడు "చేతనుడైన వానికి ఈ ప్రవర్తన కలకంటే వేరు కాదు" అనవచ్చు. వేకువలోనూ , నిద్రలోనూ మనం ఒకే మనస్సుతో, సంస్కారాలతో అనుభవిస్తాము. మన స్పందన వేకువలోనూ నిద్రలోనూ ఒకే రకంగా ఉంటుంది. అవి చేతన మనస్సుతో కప్పబడి ఉంటాయి.

మనం మెలుకువగా ఉన్నామని నిరూపించడానికి, బుద్ధుడు ఇలా చెప్పవచ్చు: మన దృష్టిని సులభంగా మనం తలచిన దానిపై చూపవచ్చు. అది కొందరికి సులభాతి సులభం. మరికొందరికి దానంత కష్టం ప్రపంచంలో మరేదీ లేదు.

మీరు మీ గదిలో రేపు ఇవ్వవలసిన నివేదిక పై మనస్సును కేంద్రీకరించేరనుకో౦డి . ఒకానొక పదం మీ కాలేజీ రోజులను గుర్తు చేస్తుందనుకో౦డి. మరుక్షణం మీ గదిలోనించి వెలుపలకు వెళ్తారు. మీ కళ్ళు గోడ మీద వ్రేలాడుతున్న చిత్రం చూడవు. మీ చెవులు బయట జరుగుతున్న వివాదం వినవు. మీరు బెర్క్ లీ కి తిరిగి వచ్చేరు. అర్థరాత్రి వీధుల్లో అనుమానాస్పద స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. ఇది మనందరికీ అనుభవం లోకి పలు మార్లు వస్తుంది. మన మనస్సు అంగీకరిస్తే మనం మన గదికి తిరిగి వచ్చేయ వచ్చు. కానీ కొందరికి అది సాధ్యం కాదు. వాళ్ళు మనస్సులో గిరికీలు కొడుతూ ఉంటారు. పాత స్మృతులు పునరావృతమవుతుంటాయి. వాళ్ళు గతంలోనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు తమ ఆలోచనలకి నిబద్ధులు. వాళ్ళ స్మృతులు వాళ్ళని అణగదొక్కుతాయి. బుద్ధుడు అలాంటి వాళ్ళు నిద్రలో ఉన్నారని అంటాడు. వాళ్ళు వేకువలో కలలుగంటున్నారు.

నేను ఒక అతిశయమైన ఉదాహరణను ఇచ్చేను. కానీ దాన్నే పరధ్యానం అంటాను. మన మనస్సు ఒక సంఘటన నుంచి వేరొకటికి, ఒక స్మృతి నుంచి వేరొకటికి, ఒక కోరిక నుంచి మరొకటికి, మారుతూ ఉంటే మీరంటారు "ఇది నిజం. ఇది ఆలోచనల గొలుసు." బుద్ధుడు "నువ్వు నిద్రపోయి ఉన్నావు. నువ్వు ఒకదాని నుంచి ఉంకోదానికి కలలోలాగ మారుతున్నావు. నిద్రలోని కలలతో పోలిస్తే మెలకువలో నీ ఆలోచనలను ప్రకటించ గలవు మరియు స్వశక్తిప్రేరిత సమాధానాలను ఇవ్వగలవు. "ఇవి స్వల్పమైన తేడాలు కాదు. అవి పరిమాణంలో తేడా. జాతిలో తేడా లేదు. మీరు మెలకువగా -- బుద్ధుడులా-- ఉన్నారని నిరూపించడానికి మీ కార్ అనబడే మనస్సును ఉంకో కారుతో ఢీ కొట్టకుండా తిన్నగా నడిపి, మీరనుకొన్న గమ్యాన్ని చేరగలగాలి.

దీనికి ఎన్నో పర్యావసానాలున్నాయి. మీరు ఒకే గాడిలో కార్ నడుపుతూ ఉంటే కోపం రాదు. కోపం రావాలంటే మనస్సు గాడి తప్పాలి. దురాశ లేదా అసూయ రావాలంటే మీరు గాడి తప్పాలి. ఇది మానవ నైజం. మీరు కలలో తప్పు చేస్తే దానికి ఎవరు బాధ్యులు? అవి కలలోని మనుష్యులతో చేసే కలలోని తప్పులు. అవి మనస్సు చేసిన సృష్టి. అలాగే కొంతమందికి తమ ఆలోచనా క్రమమును స్వాధీనంలో పెట్టుకొనకపోతే వాళ్ళను దూషించడం అన్యాయము కాదా? వాళ్ళని నిందించడం నిర్దయత్వం కాదా? వాళ్ళ కారును నడపడం నేర్చుకోలేదు.

కొంతమంది, నన్ను గౌరవించి మెచ్చు కొనేవాళ్ళు, మనము వేకువలో నిద్ర పోతున్నామని చెప్పినందుకు, అది తమ మీద వేసిన నిందని, నా మీద కోపగించుకొన్నారు. "మీరు మాతో నవ్వుతూ ఉంటారు. వెంటనే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. అది నా గుండెలోకి బాణం వేసినట్టు ఉంటుంది" అని ఒక మంచి మిత్రుడు అన్నాడు.

చాలా మటుకు లైంగిక కార్యాల వల్లే. వాటికై మనుష్య జాతి చాలా నిహితమైన ఇష్టం ఉండి తమ శరీరాన్ని ఇతరులతో పోల్చుకొంటారు. "ఇది నాకు శిఖరాగ్రాము చేరినంత నిజం. లైంగిక కార్యం నిజం కాకపోతే మరేది నిజం?" అని ఆ మిత్రుడు అన్నాడు. "నీకు లైంగిక సంబంధమైన కలలు వస్తాయా?" అని అడిగేను.

"తప్పక"

"నీవు వాటివల్ల ఆనందం పొందుతావా?"

"తప్పకుండా"

"మెలకువలో వాటి అనుభవం ఉందా?"

నేను వేరే ఏమీ చెప్పక్కరలేదు. నేను వేసిన బాణం తిన్నగా వాని గుండెకు తగిలింది. ఒక తెలివైనవాడికి ఇంద్రియ సంబంధిత విషయాలు శాశ్వతము, నిజం కావు అని చెప్పినపుడు అర్థం అవుతుంది. కొంత కాలం తరువాత హేవ్ లాక్ ఎల్లిస్ అనే మానసికవేత్త వ్రాసినది చదివేను. ఆయన తన జీవితకాలమంతా మానవ లైంగికం మీద అధ్యయనం చేసేడు. "కలలు కల కంటున్నoత సేపూ అవి నిజం. జీవితం గురించి ఇంకా ఎక్కువగా వేరే మాట చెప్ప గలమా?" అని అతను వ్రాసేడు.

మన శరీరం పడుకున్నంత సేపూ మన వేకువతో పోలిస్తే సమమైన కలలు కంటాము. మన ఇంద్రియాలు, శరీరంలోని రసాయనాలు కూడా మనకు ఆ అనభావాన్ని ఇస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది. భౌతిక ఎరుక లేకపోయినా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మన ఉనికి ఉంటూనే ఉంటుంది. దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే భౌతికమైన ఎరుక జీవించడానికి అవసరం లేదు.

గీత భౌతికమైన జీవితం వ్యర్థమనటంలేదు. చేతనం అన్నటికన్నా ముఖ్యం కాదు అని చెప్తుంది. ఏవో రెండు డబ్బులు సంపాదించి, భోజనం చేసినంత మాత్రాన మీరు మెలకువగా ఉన్నానని చెప్పలేరు. కలల్లో లాగ ఈ అప్రయత్న కార్యం జరుగుతోంది.

ఆ స్థితిలో ఇంద్రియ సుఖం ఆయస్కాంతంలా పనిచేస్తుంది. అవి మనని లాగితే చాలు వాటివద్దకు వెళతాం. కలలను నియంత్రించడం మన చేతిలో లేదు. అవి మన మాటలు, చేష్టలు, సంస్కారముల వల్ల జనించినవి. ఎక్కువ మార్లు మెలకువలో అదే మనం చేసేది. కానీ ఒక తేడా ఉంది: మెలకువలో ఒక కార్యం చేయాలా వద్దా అని నిర్ణయించకోగలం. ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసికొని ఒక కార్యాన్ని ఎన్నుకుంటామో, ఇంద్రియాలు వెనుకకు లాగకపోతే, మనం మేలుకొంటాం. అప్పుడు వచ్చే ఆనందం నేను మాటల్లో చెప్పలేను. మీరు ఎల్లపుడూ మేల్కొనే ఉంటారు. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందక వాటిని కావలసినప్పుడు నియంత్రించి లేదా అనాలోచితంగా వాటితో ఒప్పుకొని జీవనం కొనసాగిస్తారు .

ధ్యానం చాలకాలం నుండి చేయక ఇప్పుడే మొదలపెడితే, అనాలోచింతగా చేయలేరు. పట్టుదలతో ఇలా వద్దు అని చెప్పగలగాలి. కానీ మనస్సు చంచలం. కొన్నాళ్ళకు దానికి ఊపిరి పీల్చుకొన్నట్టు, కాళ్లతో నడిచినట్లు అప్రయత్నంగా అలవాటైపోతుంది. సెయింట్ అగస్టీన్ అన్నారు: "నా చెయ్యి నే చెప్పే మాట వింటుంది. మనస్సు ఎందుకు వినదు?" మనం బాల్యంలో అనేక మార్లు చేతులతో పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసి మన చేతుల్ని మన ఆధీనంలో పెట్టుకున్నాము. అలాగే మన మనస్సుని కూడా మచ్చిక చేసుకొని మనం చెప్పే మాటను మనోహరంగాను, అనుకూలంగాను వినేటట్లు చేసికోవాలి. ఈ స్వతంత్రం మన వేకువ అవస్థకి నిదర్శనం. వేకువగా ఉండడం వల్ల మనం కోల్పోయేది బానిసత్వం మాత్రమే. 90