Saturday, January 29, 2022

Eknath Gita Chapter 14 Sloka 1

14.1

శ్రీ భగవానువాచ :

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం

యజ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః

దేనిని తెలిసికొని మునులు ఉత్తమమైన మోక్షమును బొందిరో, అట్టి విద్యలలో ఉత్తమ విద్యయైన పరవిద్యను మఱల చెప్పుచున్నాను

ఇదం జ్ఞాన ముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః

సర్గే అపి నోపజాయంతే ప్రళయే న వ్యథoతి చ

ఈ జ్ఞానమును ఆశ్రయించి నా స్వరూపామును పొందినవారు సృష్టి కాలమున జన్మించరు. ప్రళయ కాలమున నశించరు

ఇక్కడ ఉపనిషత్తులు చేప్పే పరాపార విద్యల గూర్చి చెప్పబడినది. అపర అనగా ఆథ్యాత్మిక జ్ఞానం. తక్కినవన్నీ పరా విద్యలు. పరా విద్య మేధా శక్తి పై ఆధారపడివుంది. దానిచే ఎక్కువ తెలుసుకొనవలెనని కాంక్ష కలుగుతూనే ఉంటుంది. అది మంచికే కావచ్చు. కానీ అపరా విద్య మనకు మృత్యువుని దాటిన తరువాత కూడా ఉపయోగపడుతుంది.

మనమెంత శరీరంతో తాదాత్మ్యం చెందుతామో, మరణం గురించి అంత వ్యధ ఉంటుంది. మనం ఇతరులని భౌతికంగా చూస్తే --ఉదాహరణకు మనము ఒకరి అందమును చూసి ప్రేమించవచ్చు -- మరణకాల మాసన్నమైనప్పుడు వారిని పోగొట్టుకుంటున్నామన్న వ్యధ కలుగుతుంది. వేర్పాటుతో కలుగు పరితాపము భరించలేనిది. ఒకరు ఇక సాకారంగా కనిపించరేమో అన్న బాధ మనని వేధిస్తుంది.

రెండవది, మరణం శరీరాన్ని బలవంతంగా లాక్కుంటుంది. మనము శరీరముతో లావాదేవీ పెట్టుకొంటే, మరణం తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. క్రుంగి కృశించి పోయినప్పుడు, శక్తినంతా వెచ్చించి శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాము. భౌతికంగా ఆలోచించే వారు, మరణ కాలంలో తీవ్ర యాతనకు గురవుతారు. అది చేతన స్టితి లోనే కాదు. వాళ్ళ ఎరుక మరణమునకు చేరువలో ఉన్నప్పుడు అచేతనమనస్సుకు లాక్కో బడుతుంది. ఇదంతా శరీరాన్ని విడిచివేస్తున్నామన్న బాధ వల్ల. శరీరము అచేతనముగా పడి ఉన్నప్పుడు, నిశితమైన దృష్టితో ఈ బాధను చేతన మనస్సుతో చూడవచ్చు.

నేను మరణం సంబంధిత విషయాలను చెప్పడానికి ఒకే కారణం: మిమ్మల్ని శరీరముతో తాదాత్మ్యం చెందవద్దని చెప్పడానికి. మీకు ఇతరులతో నున్న స్నేహబాంధవ్యాలు ఆధ్యాత్మికత పరంగా ఉండాలి. మన బాంధవ్యాలు ఆధ్యాత్మికత పరంగా ఉంటే, ముఖ్యంగా ఆడ మగవారల బంధం, మనమధ్యనున్న ఐకమత్యం లేదా సాన్నిహిత్యం అర్థమవుతుంది. ఇది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. దాని తరువాత వేర్పాటు ఉండదు. ఇది భౌతిక పరంగా చెప్పలేము. ఇద్దరు తమను ఏ పరిస్థితిలోనూ ఎట్టి శక్తీ వేర్పాటు చేయలేదని భావిస్తారో, వాళ్ళ సాన్నిహిత్యం మరణంలోకూడా ఉంటుంది. 110

Saturday, January 22, 2022

Eknath Chapter 13 Sloka 21

Bhagavat Gita

13.21

అనాదిత్వా న్నిర్గుణత్వాత్ పరమాత్మా ఆయా మవ్యయః

శరీరస్థో అపి కౌన్తేయ ! న కరోతి న లిప్యతే

కౌన్తేయా ! అవ్యయుడగు ఈ పరమాత్మ ఆదిలేనివాడగుట చేతను, గుణరహితుడైనందునను శరీరమునందున్నను కర్మలను చేయడు. కర్మలచే అంటబడడు

యథా సర్వగతం సాక్షామ్యత్ ఆకాశం నోపలిప్యతే

సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే

సూక్ష్మమైనందున సర్వగతమైన ఆకాశము దేనిచేతను అంటబడని విధముగ ఆత్మ దేహమునందు సర్వత్ర ఉన్నను అంటబడదు

యథా ప్రకాశయత్వేకః కృత్సనo లోకమిమం రవిః

క్షేత్రం క్షేత్రీ తథా కృత్సనo ప్రకాశయతి భారత!

అర్జునా! ఒక్క సూర్యుడు సమస్త ప్రపంచమును ప్రకాశింప జేయునట్లు క్షేత్రజ్ఞుడు క్షేత్రము నంతటిని ప్రకాశింపజేయుచున్నాడు

క్షేత్రక్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞాన చక్షుషా

భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్

ప్రాణులు ప్రకృతి చేత విడువబడు మార్గమును తెలిసికొనుచున్నారో వారు మోక్షమును పొందుచున్నారు

నా చిన్నప్పుడు సినిమాలు తక్కువగా విడుదల చేసేవారు. నేనున్న పల్లెలో ప్రపంచ సంబంధాలున్న సంస్థలులేవు. అలాగే సినిమా హాళ్లు, సమావేశ మందిరాలు లేవు. అప్పుడప్పుడు ఒక ఉత్సాహపూరితుడైన వ్యక్తి తన వాహనములో ప్రొజెక్టర్, జనరేటర్, ఒక పాత ఆంగ్ల ఫిల్మ్ తీసికొని వచ్చేవాడు. మేము ప్రొజెక్టర్ ను ఒక గుడారంలో పెడితే, ఊర్లో వారందరూ చీకటైన తరువాత సినిమా చూడడానికి అక్కడ గుమిగూడేవారు. వాళ్ళకు అదొక కొత్త వింత. వాళ్ళు ఆ రోజుల్లో చాలా అమాయకులు. చాలామంది ఆ ఊరొదిలి ప్రక్క ఊరుకు కూడా వెళ్ళలేదు. మేము ఆ సినిమాని చూస్తున్నాం కానీ, దాని గూర్చి పూర్తి అవగాహన లేదు. మాకు తెలిసింది అదొక చలనచిత్రమని. ఒకడు తెరమీద ఏమవుతున్నాదో ఎవరూ అడగకుండానే గట్టిగా చెపుతూవుంటే ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. కానీ ఆ చిత్రాలు ఎంత అనుభూతిని ఇచ్చేవంటే, మేము మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచేవాళ్ళం. తెరమీద ఒక దొంగ పడుక్కుని ఉన్న వ్యక్తి వెనుక ఉంటే, మేము చిన్న పిల్లల్లాగ ఊపిరి బిగ పెట్టు కొనేవాళ్ళం. నా మామయ్య తెరమీద నిద్రిస్తున్న వ్యక్తి నుద్దేశించి "నిద్రలే, వాడి దగ్గర కత్తి ఉంది" అని అరిచేవాడు.

పాత రోజులు గుర్తుకు తెచ్చుకోవడం సరదాగా ఉంటుంది. మనం సినిమా అనే ఆభాశకు ఎంత అలవాటు పడ్డామంటే, దాని శక్తిని మరచిపోతున్నాం. పౌలీన్ కేల్ "మనని చీకటిలో అవాక్కయి పిస్తాయి" అన్నారు. చూసినంత సేపూ నిజమైన ప్రపంచం గూర్చి మరచిపోతాము. జీవితం -- ప్రపంచంతో వేర్పడిన ఉనికి -- అదే చేస్తుంది. సినిమాలు మనకు ప్రపంచంతో వేర్పాటు ఎలాగ అన్నది ముఖ్యంగా చెప్తాయి.

నేనూ, క్రిస్టీన్, గాన్ విత్ ది విండ్ అనే సినిమా చూడడానికి వెళ్ళేము. ముందు ఆ మిలమిలలాడే తెర మీద తెల్లని కాంతి పడుతున్నాది. అంతలోనే అది తన రూపాన్ని చిన్న కిటికీగా మార్చుకున్నట్టయి, మమ్మల్ని క్రిందటి శతాబ్దంలోని అమెరికాలో దక్షిణ ప్రాంతానికి తీసికెళ్లింది. ఎక్స్ట్రా లు కాకుండా ఆ సినిమాలో కొన్ని డజన్ల పాత్రలు ఉన్నాయి. వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. ఒక మారు క్లార్క్ గేబుల్ తెర అంతా వ్యాపించి ఉంటాడు. మరొకమారు వివియన్ లై తెరంతా ఉంటాడు. హఠాత్తుగా తెర మీదకి గుర్రాలూ , సైనికులూ యుద్ధానికి వస్తారు. సినిమా అయిపోయిన తరువాత ఆ తెర తన సహజ స్థితికి వస్తుంది. అది తెల్లగా అసంగత్వంగా ఉంటుంది.

ఇది చెప్తే ఊర్లో ఉన్న నా మామయ్య ఆశ్చర్య పడేవాడు. ఆ చిత్రాలు ఎంతో నిజం అనిపించేవి. కానీ తెర మీద ఎవ్వరూ రంగులు పూయలేదు. ఉద్రేకం, యుద్ధం, డిక్సీ మండుతున్నప్పటి మంటలు ఏవీ తెర మీద గురుతు వేయలేదు. ఒకే కాంతి వివధములైన పాత్ర ధారులను తెరమీద చూపించింది. క్లార్క్ గేబుల్ మీద పడ్డ కాంతి, వివియన్ లై మీద కూడా పడింది. మనం కూడా ఆఫీస్ లో , దుకాణాల్లోనూ ఒకరినొకరు చూసుకొని ఇలా ఆలోచిస్తాం: "వాళ్ళు ఎంతో మారిపోయేరు. వాళ్ళు వేరే విధంగా చేష్టలు చేస్తున్నారు. నేను అటువంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోను. నేను నా పైవాడితో ఆఫీస్ లో అలా మాట్లాడను. నేను ఆ సంస్థ యొక్క నూడుల్స్ తినను. కాబట్టి మనమందరము లోపల సమానంగా ఉన్నామని ఎలా తలుస్తాము?" ఎలా ఐతే ఒకే కాంతి సినిమాలో పాత్రలను తెరమీద చూపిస్తోందో, అలాగే ఆత్మ యొక్క ప్రకాశము క్షేత్రములో ప్రసరించి వివధములైన శరీరాలను ధరించి వేర్వేరు రూపాలతో కనిపిస్తున్నాది

మనము ఈ దృష్టాంతాన్ని పొడిగించ కూడదు. ఎందుకంటే మన శరీరాలు మిథ్య కాదు. కానీ మనలోని తేడాలు మిథ్య. ఒకే ఆత్మ మన వివిధములైన శరీరాలను , వ్యక్తిత్వాలను చైతన్యవంతము చేస్తున్నాది. సినిమా అంతమైన పిదప, ప్రొజెక్టర్ ను ఆపివేస్తే ఎంత గొప్ప పాత్ర అయినా మనుకగుపించదు. తెరమీద ఏమీ లేదు. ఫిల్మ్ వల్ల దానికి రంగులు, పాత్ర ధారులు ఆపాదించబడ్డాయి. కఠ ఉపనిషత్తు అడుగుతుంది: "ఆత్మ శరీరాన్ని విడిచితే, ఏమి మిగులుతుంది?" పంచభూతాలు తప్ప ఏమీ మిగలవు. ప్రాణం, చైతన్యం, బుద్ధి, ఉనికి అన్నీ ఆత్మ వల్లనే సాధ్యం.

సాన్ ఫ్రాన్ సిస్కో లోని ఒక సినిమా హాల్లో పాత ఏడుపు సినిమా కొన్ని నెలలుగా చూపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రిచర్డ్ అటెన బరో దర్శకత్వంలో చేయబడిన "గాంధీ" సినిమా చూపిస్తున్నారు. మొదట ఒక హీనమైన వ్యక్తి యొక్క పాత్రలో హింస, స్వార్థం, కామం, క్రోధం చూపించేరు. గాంధీ సినిమా ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని చూపిస్తుంది. ఒక సాధారణ మనిషి ప్రేమ, సత్యం, అహింస లతో తనను ఎలాగ మహా మనీషి గా మార్చుకొన్నాడో, ఎలాగ మనను మలిచేడో, ఆ సినిమా ప్రతిబింబింప చేస్తుంది.

నాకు ఆ సినిమా హాలు చేసిన ఎన్నికకు ఆనందం కలిగింది. ఆ నగరం అంతా ఆ సినిమా వల్ల లాభం పొందింది. కానీ చిత్రాన్ని చూపించిన తెరలో ఎటువంటి మార్పూ లేదు. మనం దానిమీద హింస చూపవచ్చు. కానీ దానికి ఎటువంటి హానీ జరగదు. దానిమీద మంటలు చూపవచ్చు. కానీ అది మండిపోదు. అలాగే శ్రీకృష్ణుడు మనకు చెప్పే బోధ: ఆత్మ కి మన ఆలోచనలు, కర్మలు చెందవు. అనగా ఆత్మని వాటితో ప్రభావింప చేయలేము.

మనము దీన్ని నిజంగా అర్థం చేసుకొంటే, మన భుజస్కందాల మీదనుంచి గతంలో చేసిన తప్పులన్నీ తీయ బడతాయి. మనం మన శరీరముకాదు. మనం మనస్సుము కాము. శరీరము ఒక పదార్థము. సహజంగా అది భౌతిక ప్రపంచంతో లావాదేవీ పెట్టుకుంది. మనస్సు సహజంగా తప్పులు చేస్తుంది. శరీర, మానసిక కర్మల మధ్య అవినాభావ సంబంధం ఉంది. కాని మన ఆత్మ వాటివల్ల కళంకమైనది లేదా హీనమైనది కాలేదు. వ్యక్తిత్వం లోలోపల ప్రతి మనిషిలోనూ, అతడు ఎన్ని తప్పులు చేసినా, శుద్ధత, పరిపక్వత ఉన్నాయి. అలాగ గతంలో మనము ఎన్ని తప్పులు చేసినా, మనలో ఎన్ని లోటుపాట్లున్నా, మన వ్యక్తిత్వము యొక్క ప్రతి కళంకమును చెరుపుగోగలం.

Friday, January 14, 2022

Eknath Chapter 13 Sloka 20

13.20

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః

యః పశ్యతి తథాఆత్మానాం ఆకర్తారం స పశ్యతి

సర్వకర్మలు ప్రకృతి చేతనే చేయబడుచున్న వనియు, ఆత్మ కర్మలకు కర్త కాదనియు ఎవడు చూచుచున్నాడో వాడే నిజముగ చూచువాడు

యదా భూతపృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి

తత ఇవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా

భిన్నములైన భూతజాలమంతయు ఒక్కదాని యందే ఉన్నవనియు, దానివలననే విస్తరించుచున్నదనియు ఎవ్వడు గాంచునో అతడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు

నేను బాలుడిగా ఉన్నప్పుడు అలెక్సాన్డర్ డ్యూమస్ రచించిన నవలలంటే ఇష్టపడేవాడిని. ముఖ్యంగా ది మ్యాన్ ఇన్ ద ఐరన్ మాస్క్ (The Man In The Iron Mask) అనే నవల. నాకు తెలిసిన మటుకు మాస్క్ వేసుకున్న మనిషి ఎవరో నిర్ణయింపబడలేదు. ఒకడు లూయీ xiv అనే రాజుచే 40 సంవత్సరాలు శిక్షింప బడి బాస్టిల్ అనే నగరంలో మరిణించేడని చరిత్ర చెపుతోంది. అతని పేరు, ఊరూ ఎవరికీ తెలీదు. డ్యూమస్ అతని గూర్చి మంచి కథ అల్లేడు. ఆ వ్యక్తి లూయీ రాజు కవల తమ్ముడు; అతను రాజుని అనుకరించి అతనిని బంధీని చేయబోయేడని డ్యూమాస్ వ్రాసేడు.

ఇది ఒక మంచి దృష్టాంతము కూడా. మనందరము ఇనుప ముసుగు వేసికొని జీవితాన్ని గడుపుతామని గీత చెపుతుంది. ముసుగులో నున్న భద్రత వల్ల -- హిందువుల, భౌద్ధుల దృక్పథంలో అనేక జన్మల వలన -- మనకు ముఖముందని మరచిపోతాం. ఆ ముసుగే మనమనుకుంటాం. ఇతరులకూ అలాగే అనిపిస్తుంది. కానీ ముసుగు క్రింద రాజు ఉన్నాడు. వాడే మనం.

ముసుగు మన వేరే వ్యక్తిత్వం. అది వింతగా ఎందుకుందంటే అది ఒక వస్తువు కాదు. హిందూ మానసిక శాస్త్రం మనం రెండు ముసుగులు వేసుకొన్నామని చెప్పచ్చు: ఒకదాని క్రింద మరొకటి. పై ముసుగు మన భౌతిక శరీరము. లోపల వున్నది సూక్ష్మ శరీరము. అది మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడి యున్నది. మనం శరీరం మనస్సులతో తాదాత్మ్యం చెందడంవల్ల, ప్రకృతి ఈ ముసుగులను చేసింది. దాన్ని ధరించినవాడు పురుషుడనబడును. అనగా మనలో ప్రతి ఒక్కరు.

ఈ రెండు ముసుగుల మధ్య సామరస్యముంది. దాని వలన మన స్వస్థతకి పర్యావసాన ముంది. శరీరము పాతుకుపోయిన వ్యక్తిత్వాన్ని అద్దంలాగా ప్రతిబింబింప చేస్తుంది. మనం తప్పక చేయాలనే మానసిక ఒత్తిడి వలన వ్యాధులు మొదలవుతాయి.

ఈ విషయం నిఘూడ మైనది కాదు. తప్పక చేయాలనే మానసిక ఒత్తిడి వల్ల మన నడవడిక కూడా అలాగే మారి మన శరీరము మీద ప్రభావిత మవుతుంది. చాలా కాలము రక్తపు పోటు తో ఉన్న వ్యాధిగ్రస్తుడు కలహశీలి అయినట్లు. ఇంకా లోతైన విషయం కూడా ఉంది. సూక్ష్మ శరీరం అతి క్లిష్టమైనది, అది ప్రాణముతో బాటు శక్తులతో --క్రోధం, భయం, కోరికలు తో -- కూడుకొని యున్నది. మనస్సును పోషించే ప్రాణము, మన మెదడును, శరీరాన్ని పోషించే ప్రాణము ఒక్కటే. మనస్సులో ఆలోచనలు గాఢమైతే శరీరములోని కొన్ని అవయవాలకు తగినంత ప్రాణ శక్తి చేరదు . దీని వలన కొన్ని సంవత్సరాల పిదప అనేక దౌర్భల్యములు వస్తాయి.

నేను చెప్పింది సులభ౦గా అర్థం చేసుకోవడానికి మాత్రమే. వ్యక్తిత్వం క్లిష్టమైనది. ప్రతి వ్యక్తి అనేక భౌతిక, మానసిక కారణాల వల్ల వ్యాధిగ్రస్తుడవుతాడు. నయము చేయ శక్యము కాని వ్యాధులు-- హృద్రోగము, కీళ్ల వాతం, క్యాన్సరు -- ఇటువంటి కారణాలవల్ల వస్తాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. భవిష్యధ్యానముగల సర్ విలియం ఆస్లర్ తోటి వైద్యులనుద్దేశించి ఈ విధంగా అన్నారు: "రోగికి ఏ వ్యాధిఉందో అడగకు. కానీ ఎటువంటి రోగికి వ్యాధి ఉందో అడుగు."

హిందువులు, భౌద్ధులు ఏమని చెప్తారంటే : మనము ఎన్నో జన్మలుగా సూక్ష్మ శరీరమనే ముసుగును తయారు చేసుకొంటున్నాము. మనకు కలిగే ప్రతి ఆలోచన, స్పందన, చేసే క్రియ, ఎన్నిక ఆ ముసుగును మారుస్తూ ఉంటాయి. నాకిది సమంజసమనిపిస్తుంది. మనలో ఉండే స్వార్థ పూరిత ఆలోచన -- లేదా నిస్వార్థమైనది -- మన చేతన మనస్సులోని శక్తులను ప్రభావితం చేసి -- స్వార్థ లేదా నిస్వార్థ క్రియలు చేయిస్తుంది.

మొదట మనము నూనెతో, రంగుతో, బంకతో, మీసంతో తాత్కాలిక ముసుగును చేసికొంటాం . ఇది సూక్ష్మ శరీరము యొక్క సహజ స్థితి: సాగేది, వంగేది, స్వతఃసిద్ధమైనది, ఖచ్చితమైన ఆకారము లేనిది. కానీ మనస్సు అలా కాదు. అది దాని సహజ స్థితిలో ఉండదు. అది ఆలోచన చేస్తూ, చేస్తూ, కోరికలు కోరుతూ, కోరుతూ ఉంటుంది. అలా పోయి, అది స్వార్థ పూరితమై, కఠినముగా అవుతుంది. చివరికి మన ముసుగు ఇనుముతో చేయబడినదై అది మనల్ని అవయవమనిపించే లేదా వ్యక్తిత్వమనిపించే స్థితికి దిగజారుస్తుంది. ఈ ముసుగును, అదృష్టవశాత్తూ, తీసి వేయ వచ్చు. ధ్యానం తదితరమైనవి ఇందుకు ఉపయోగపడతాయి. మనమెప్పుడైతే ఆ ముసుగును తీసేస్తామో మనల్ని శుద్ధమైన, సంపూర్ణమైన, మిగతా సృష్టితో వేరు కాని వారములుగా చూస్తాము. 105

Saturday, January 8, 2022

Eknath Chapter 13 Sloka 19

13.19

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం

వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి

సమస్త భూతములయందు సమముగా ఉండి, ఆయా భూతముల శరీరములు నశించుచున్నను తాను అవినాశిగనుండు పరమేశ్వరుని ఎవడు గాంచుచున్నాడో వాడే నిజముగ చూచువాడు

నాకు ఒక చలన చిత్రములో భీకరమైన మంటలతో ఒక అడవి మండుచున్న వృత్తాంతం గుర్తుంది. అది పచ్చికలోకి పాకి ప్రతి గడ్డి మొక్కను ఆవరించింది. అది చెట్ల పై పాకి వాని ఆకారమును పొందియున్నది. ప్రతి కొమ్మ దారువుతో కాక మంటతో నిండినది. చెట్లు అలా నిలిచి, అగ్నితో కాల్చ బడుచున్నవి. వాటి కొమ్మలు నారింజ, బంగారు రంగుల్లో మండుతున్నాయి.

అగ్ని స్వతహాగా నుంచోదు, అబద్ధం చెప్పదు. అది దేనిని ఆవరిస్తుందో దాని ఆకారాన్ని పొందుతుంది. కఠ ఉపనిషత్తులో ఇలా ఉంది:

ఒకే అగ్ని వివిధ రూపాలు ధరించునట్టుగా

అది వివిధ ఆకారాలు గల పదార్థములను దహించుచున్నట్టుగా

ఆత్మ జీవిని బట్టి వివిధ రూపాములు ధరించుచున్నది

ఎవరిలో ఐతే అది అంతర్గముగా ఉందో

గాలి లాగా ఆ రూపాన్ని పొందుతుంది

అది వివిధ రూపాలుగల వస్తువులలో ప్రవేశించిన

ఒకే ఆత్మ ప్రతి జీవి ఆకారాన్ని పొందుతుంది

దానిలో అట్లు స్థితమై ఉన్నది

ఇది ఒక సిద్ధాంతము మాత్రమే కాదు. దానిని అనుభవంలోకి తెచ్చుకోవచ్చును. జీన్ మేయర్ అనే ఆయన ప్రపంచంలో అతి ప్రసిద్ధ ఆహారాన్ని శోధించే శాస్త్రజ్ఞుడు. ఆయన 1974 లో రోమ్ నగరములో జరిగిన సమావేశంలో వ్రాసిన వ్యాసంను నేను చదివేను. నేను ఆయని అభిప్రాయాలను గౌరవిస్తాను. అది ఆయన గొప్పతనం వలన కాదు. ఆయన ఆర్ధ్రత, దయాగుణముల వలన. ఒక బంగ్లాదేష్ శాస్త్రజ్ఞుడు తన దేశంలో త్వరలో రాబోయే కరువుగూర్చి ప్రసంగిస్తున్నాడు. మేయర్ ఇలా వ్రాసేరు: "ఆ గదిలో ఎవరూ లేరు. చాలామంది బయట ధాన్యంతో చేయబడిన మద్యాన్ని సేవిస్తున్నారు. అనగా మన ఆహారపదార్థంతో చేసిన మద్యం." ఆయన ఇంకా ఇలాగ వ్రాసేరు: "1973 లో మద్యం తయారు చేయుటకు వాడిన ధాన్యం కోట్ల మందిని పోషించేది." ఆయన అడిగేరు ఈ సమావేశంలో హాజరైన వారిలో ఎందరికి ఈ విషయం తెలుసు?

కొందరు అడగవచ్చు "మేమెందుకు పట్టించుకోవాలి? మద్యం తయారయిపోయింది. ఉన్నందుకు ఎందుకు త్రాగకూడదు?" దానికి సమాధానం: మనం త్రాగక పోతే ధాన్యంతో మద్యం చేయ బడదు. మేయర్ ఇలా అన్నారు: మనము ఒక ఎన్నిక చేసుకోవచ్చు. అది ఇతరులకు లాభంలేని -- మద్యం తయారుచేసే పరిశ్రమలకు తప్ప- అలవాటు చేసుకోవచ్చు లేదా ఆకలితో బాధపడుతున్న కోట్లమంది పొట్టలు నింపవచ్చు.

ఈ విషయం బుద్ధికి తెలుసు. కానీ బుద్ధిని ప్రేరేపించే శక్తి హృదయానికుంది. సున్నితమైన మనిషి, ఈ విషయం తెలికొన్న, ప్రతిసారి మద్యంతో నిండియున్న గ్లాస్ ని ఎత్తినపుడు, దాని అంచులలో ఆకలితో అలమటిస్తున్న పిల్లవాడిని చూస్తాడు.

ఉంకో అభ్యంతరం ఉంది: "నేను మద్యం సేవించడం మానేస్తే ఒరిగేదేమిటి? నా వంతు ధాన్యాన్ని మద్యం చేసే పరిశ్రమలు బీదవారికి ఇవ్వరు. వాళ్ళు దానితో గ్యాసహాల్ ఇంధనం చేస్తారు. లేదా ధరలు పెంచడానికి దాన్ని తగలెట్టచ్చు. లేదా ఆవులను బలిష్టం చేయడానికి వాటికి గ్రాసముగా పెట్టవచ్చు." ఈ అభ్యంతరములలో నిజం లేక పోలేదు. ఒక సంస్థ చేసే పదార్థాలను కొనకపోవడం మొదటి అడుగు మాత్రమే. కాని వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడం ముఖ్యం . గీత సంపూర్ణమైన జ్ఞానం ఇస్తోంది. మనకు ఎన్నిక చేసికోడానికి చాలా ఉన్నాయి. ప్రతి ఎన్నికను పరిశీలించాలి. సాధారణ బుద్ధికి ఆ శక్తి లేదు. దానికి నిశితమైన బుద్ధి కావాలి. చేతన మనస్సు మార్పుతో ఎన్నికను విశ్లేషించాలి. మనము తద్వారా భగవంతుని అన్నిటియందు చూసి, దాని ప్రకారము క్రియలుచేసి జీవి౦చాలి.

మేయర్ ఇంకా ఇలా వ్రాసేరు: ప్రపంచ దేశాలు, ప్రజలు తిండిలేక బాధపడుతున్న వర్ధమాన దేశాలను కలుపుకొని, కోట్లాన కోట్లు ఆయుధాలపై వెచ్చిస్తున్నారు. 1987 సంవత్సరములో ఆయుధాలకై రోజుకి 7 కోట్లు ఖర్చుపెట్టేరు. అందులో ఒక భాగం స్వయం ప్రపత్తికై వినియోగిస్తే, ఆహార పదార్థ లేమిని అరికట్టవచ్చు. నేను వాదించటంలేదు. ఆయుధాలు చేసే సంస్థలను చూడండి. మేధావులైన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు కొన్ని దశాబ్దాలలో ఒకానొక అంశముపై దృష్టిని కేంద్రీకరించి ఎలా నమ్మశక్యం కాని వస్తువులను చెయ్యగలరో చూడవచ్చు. ఆ ఉత్సాహాన్ని ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవాడానికి వ్యచ్చిస్తే, బీద దేశాలేకాదు, అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాలలో ఉన్న బీద వారికి కూడా, ఒక తరంలో తిండిలేమిని తొలగించవచ్చు. ఇదేమీ జటిలమైన సమస్య కాదు. కాని స్వార్థం వలన, అయిష్టత వల్ల, దృష్టిని దీనిపై సారించటంలేదు.

మన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్ శైక్ లో పీడియా బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 1975 లో ఇలా వ్రాసేరు:

"ఏ దేశమూ తన స్వార్థంకోసం సంకుచిత భావాలతో తమ ఇష్టం వచ్చినట్టు ఉండుట తగదు. ఎందుకంటే మనమందరమూ ఒకే సంధింపబడిన ప్రపంచంలో బ్రతుకుతున్నాము. సంపన్న దేశాలు వాళ్ళ బాధ్యతను విస్మరించకూడదు. పేదరికంలో ఎక్కువమంది ఉండగా అతి కొద్ది ధనవంతులు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ప్రపంచ శాంతి లేకపోవడానికి కారణం ప్రపంచ యుద్ధం ఒకటే కాదు. తారతమ్యాలు కూడా యుద్ధంలాగే ప్రమాదం"

ఆమె ఇలా ఉపసంహరించేరు: "మన అన్వేషణ మానవాళికి సమానత్వ సంఘమును స్థాపించుటకే కాదు, ప్రపంచంలో తారతమ్యాలు లేకుండా చేయడం. ప్రపంచం ఒక పద్దతిలో కొనసాగాడానికి, అవగాహనతో, దయతో మనస్సులను మార్చక పోతే, కరువుకాటకాలను నిర్మూలించక పోతే, ప్రగతి సాధించలేము."

ఇది ఒక అర్థంలేకుండా వాదించడం కాదు. నాలాంటి ఆమెరికన్లు చరిత్రలోనే అత్యంత సంపన్నమైన దేశంలో మనుగడ సాగిస్తున్నారు . అయినప్పటికి ఏమి సాధించేము? పిల్లలకు చేయూతనిచ్చే, బీదవారిని ఆదుకొనే, మరియు సాంఘిక సమస్యలను తీర్చే ప్రణాళికలు చేయటంలేదు. అదేసమయంలో ఆయుధాలకై కోట్లానుకోట్లు, అప్పులుచేసి ఖర్చు పెడుతున్నారు. నిజంగా లక్షల పిల్లలు, ముసలివారు తిండిలేక అతి దీనావస్థలో ఉన్నారు. నేను అతిశయోక్తి చేయటంలేదు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి కారణం మనం స్వార్థంతో ప్రజలను దృష్టిలో పెట్టుకోవటంలేదు. బీదవారేకాదు మధ్య తరగతిలో ఉన్నవారు కూడా ఈ భౌతిక వాదన సంబంధిత ప్రగతి వల్ల బాధపడుతున్నారు. ఎవ్వరూ పేదల సంక్షేమమునకు ముందుకు రారు.

ప్రపంచ ఆహార సమావేశం జరిగిన కొన్ని నెలల తరువాత, నేను జేమ్స్ రెస్టన్ న్యూయార్క్ టైమ్స్ లో వ్రాసిన సునిశిత వ్యాసాన్ని చదివేను. ఆయన కూడా సంపన్న దేశాల జీవన ప్రమాణం మితిమీరిన వ్యర్థాలకు దారి తీస్తున్నాదని తప్పుబట్టేరు. వాళ్ళ విలాశాలకై వర్తమాన దేశాలలోని ముడి సరుకు నుపయోగించుకొని, తక్కువ జీతంతో ఎక్కువ శ్రమపడే వారల కష్టాన్ని అనుభవిస్తున్నారు. కాలం మారుతోంది. వర్ధమాన దేశాల ప్రజలు మనం చేసే కార్యాలను చూస్తూ నోరుమూసుకొని ఉండలేరు. మనం అంతర్జాతీయ ఉగ్రవాద శకములో ఉన్నాము. కొన్ని ఉగ్రవాదుల గుంపులు, అణ్వాశ్త్ర ములను చేజిక్కుంచుకొని ఒక దేశాన్ని చెఱపట్టచ్చు లేదా ఒక దేశంతో యుద్ధం చేయవచ్చు. ఈ శతాబ్ద చివరికి, పరిస్థితులు మారకపోతే, విచ్చిత్తి శక్తితో కూడిన పదార్థాలను రవాణాచేసి, వేల కొలది అణ్వాశ్త్రాలను తయారు చేస్తారు. ఫ్రెడ్ ఇక్లే ఇలా వ్రాసేరు: "నిజంగా మనం మనను రక్షించుకోలేం. అది అతి సున్నితమైన విషయం కావచ్చు లేదా శిక్షితమైన అణ్వాశ్త్రాల యుధ్ధం కావచ్చు. భారీగా సొమ్ము ఖర్చు చేసి, మనం చేసికొన్న రక్షణ వ్యవస్థవల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం ఎవ్వరితోనైతే శతృత్వము ఉండ కూడదో, వారి దాడికి అనువుగా ఉన్నాం." దయ, ఐకమత్యంతో కూడిన సిద్ధాంతాన్ని పర్యావసానము లేకుండా ఉల్లంఘించలేము.

మన సహజీవనానికి ఒకే ఒక మార్గమున్నది. అది ఇతరులను నమ్ముట. మానవాళికి అవసరమైన వస్తువుల్లో మనం ఆనందంగా తక్కువ వాటా తీసికోవాలి. ఇది ప్రతికూల అంశంకాదు. ఈ విషయాల్లో ఎక్కువ ప్రగతి కలుగలేదు. నిజానికి చాలా తక్కువ జరిగింది. ప్రజలకు అవగాహనకు తక్కువ పాటుపడ్డాం. ఇలా నిస్వార్థంగా బ్రతకడంలో చాలా ఆనందం ఉంది. మన స్వంత సాధనములతో కలసికట్టుగా అర్పితమై ఆత్మహత్యలతో బెదిరించే పరిస్థితిని తొలగించాలి. 103

Eknath Chapter 13 Sloka 18

13.17

యావ త్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమం

క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ

అర్జునా ! ఈ ప్రపంచమున చరాచర రూపమైన సకల వస్తువులను క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక వలననే కలుగుచున్నవని గ్రహించుము.

హిందూ మతము శివ శక్తులు సృష్టికి కారణమని చెప్పును. శివుడు అనాది పురుషునిగను, శక్తి అనాది స్త్రీగాను హిందువులు తలంతురు. శక్తి అనగా బలం, సామర్థ్యం, పరాక్రమము. ఇటువంటి అద్వితీయ సంప్రదాయములో బలాన్ని స్త్రీగా ఆపాదించేరు. శివుడు నిర్వికల్పము. శక్తి మార్పు చెందునది. శక్తి అనగా ప్రకృతి. మనస్సు మరియు పదార్థము లను కలుపుకొని, సమస్త సృష్టి క్షేత్రము. ఆమె తన సామర్థ్యముతో సృష్టి యొక్క ఆకారమును నిర్దేశించునది. ప్రతి స్త్రీ, ఆధ్యాత్మికతో చూచిన, పురుషుని కన్న మిక్కిలి సామర్థ్యం కలది కనుక, ఆమె శక్తికి ప్రతిరూపము. ఒక నిస్వార్థ స్త్రీ తన చుట్టూ ఉన్నవారిని పెంపొందించును. అట్లే ఒక అభద్రత, స్వార్థ పూరిత స్త్రీ తక్కిన వాళ్ళ పురోగతిని నిరోధించును. కాబట్టి ఆమె బాధ్యత విచిత్రమైనది. నా అమ్మమ్మను చూసినట్టే నేను ప్రతి స్త్రీని ప్రేమతో, గౌరవము తో చూస్తాను. ఎందుకనగా ఆమె గర్భిత, అవ్యక్త సామర్థ్యము గలది. ఆమె మిక్కిలి శక్తివంతురాలు.

సృష్టి జరగవలెనన్న శివ శక్తులు ఏకమవ్వాలి. వారి కలయికవల్ల సమస్త జీవులు ఆవిర్భవించుచున్నవి. ప్రసిద్ధమైన కవి, నాటక రచయిత కాళిదాసు రఘువంశ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో శివశక్తుల గూర్చి ఇట్లు రచించెను: "పదము దాని అర్థమువలె మిళితమైన ఆది దంపతులను ప్రార్థించెదను". పదమునుండి దాని అర్థమును వేరుచేయలేము. ప్రపంచము మనకు విదితమవ్వవలెనన్న తలిదండ్రుల వలె నున్న ఆ భగవంతుడు కరుణించవలెను . 100