Sunday, October 3, 2021

Eknath Chapter 13 Sloka 3

13.4

తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతస్చ యత్

స చ యో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు

నేను చెప్పింది విను. నేను క్షేత్రం యొక్క లక్షణాన్ని , దానిలో మార్పు ఎలా వస్తుందో చెప్తాను. అలాగే క్షేత్రమును తెలిసినవాడు (క్షేత్రజ్ఞుడు) వాని శక్తిని వివరించెదను

పెక్కుమంది ప్రపంచ మధ్యలో నిలబడి బాహ్య దృష్టి కలవారని తలచుదురు. చెట్లు, వాహనాలు, జంతువులు, మనుష్యులు మనకన్న వేరని, మనం విజాతీయమని; ధృక్కు, తెలిసికొనేవారు బాహ్య ప్రపంచానికి అర్థం చెపుతారు.

కానీ ఒక భౌతిక శాస్త్రవేత్త మనం చూసే వస్తువులు విజాతీయం కాదని తెలుసుకొంటాడు. మన ఇంద్రియ గ్రహణశక్తి కొంచెమే. కావున వస్తువులు వేర్వేరుగా ఉన్నట్టు కనిపిస్తాయి. మన కళ్ళకు ఏడు రంగుల కన్న సూక్ష్మమైన కాంతి కిరణాలను చూడగల శక్తి ఉంటే ఒక అణు శాస్త్రవేత్త చూచే విధంగా ప్రపంచాన్ని చూస్తాము. నిజంగా ప్రపంచం పదార్థం, శక్తితో కూడిన సజాతీయం.

శాస్త్రవేత్తలు పదార్థము అణువుల సముదాయమని చెప్పినపుడు అదొక వింత అయింది. అణువు ప్రపంచమనే ఇంటికి ఒక ఇటికెలా పని చేస్తుంది. అణువు ఒక ఘన పదార్థమని భావించేరు. తదుపరి అణువు కన్నా చిన్నవి--పరమాణువులు--ఉన్నవని తెలిసికొన్నారు. అలాగే అణువులో అధిక భాగం ఆకాశం (space). కన్ను చూడలేని పరమాణువులు ఒకప్పుడు ఘన పదార్థంగాను, మరొక్కప్పుడు శక్తిగాను పనిచేస్తాయి. శాస్త్రవేత్తలు పరమాణావుల మీద తీవ్ర పరిశోధనలు చేసి వాటి శ్వస్వరూపామును తెలిసకొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే ఆశ్చర్య చకితుడై (లెక్కపెట్టలేనన్ని) పరమాణువులను లెక్క పెట్టడం మానేసాను.

మొత్తానికిది గ్రాహ్యము కాని ప్రపంచ సత్యం. ప్రపంచంలో ఘన పదార్థమన్నది లేదు; అది ఇంద్రియాలకు గ్రాహ్యము కాదు; అది సదా మారుతూనే ఉంటుంది (స్థిరంగా ఉండదు). ఆర్తర్ ఎడ్డిoగ్ టన్ (Sir Arthur Eddington) "బాహ్యమైన భౌతిక శాస్త్రము చెప్పినది ఏమిటంటే ప్రపంచం మీద అనేక నీడలు పడ్డాయి. ఎప్పుడైతే దాని మాయ తీసివేస్తామో, పదార్థము తీసివేయ బడుతుంది. ఎందుకంటే పదార్థము మనకున్న భ్రాంతి మాత్రమే". మనం ప్రపంచాన్ని ఘన పదార్థాల సముదాయంగా విజాతీయంగా చూస్తున్నామంటే దానికి ముఖ్య కారణం మనకున్న ఇంద్రియాలకు తగినంత గ్రాహ్య శక్తి లేకపోవడమే. కాబట్టి ఇక మనం వేర్వేరుగా ఉన్న భౌతిక శరీరాలుగా ఎలా అనుకోగలం?

నేను ఒక క్రొత్త సూక్ష్మ దర్శిని (Microscope) గురించి వార్తల్లో చదివేను. అది అణువులను సైతం కళ్ళకు చూపిస్తుంది. మనకళ్ళకి కూడా అంత సూక్ష్మ పదార్థాల -- లేదా పరమాణువుల--చూసే శక్తి ఉంటే ఏమవుతుందో ఊహించుకోండి. పదార్థాల మధ్య ఉన్న పరిమితి నీడలు మాత్రమే. జీవితాన్ని వేర్వేరుతనo , పరిచ్చిన్నాల మధ్య ఊగిసలాడేది. అట్టి ప్రపంచం వింతగా ఉంటుంది. మనం గాలి, నీరు ఆకుల, వ్రేళ్ళ, రాళ్ళ, చర్మం లోని కణాల గుండా దూసుకుపోవడం చూస్తాం. సూర్య శక్తి తో పచ్చని ఆకులు తమ ఆహారాన్ని ఎలా తయారుచేస్తాయో తెలుసుకొంటాం. అలాగే కాయలను , పండ్లను తిని జంతువుల శరీరం ఎలా వృద్ధి నొందుతుందో చూస్తాం. శరీరం మరణించిన తరువాత అది పంచ భూతాలలో ఎలా కలసిపోతుందో చూస్తాం. దీనివల్ల మనకు తెలిసినదేమిటంటే జీవి ఒక అపరిచ్చిన్నమైన ఐక్యతలో ఒక భాగం మాత్రమే.

మళ్ళీ స్టీవ్ తోటకి వెళ్దాం . ఆ తోట చుట్టూ కంచె ప్రక్కింటి పాల వ్యాపారి పెరటితో సరిహద్దుగా ఉంది. అతను కంచెలోపు భూమి తక్కిన భూమితో పోలుస్తే వేరని తలుస్తాడు. ఇది ఒక విధంగా నిజం. అలాగే పాల వ్యాపారి కంచెవల్ల ఉపయోగం ఉందని అంటాడు. బహుశా అతను భూముల పట్టాల అధికారి చెప్పిన విధంగా ఒక జానెడు భూమి ఆక్రమించకుండా కంచె వేసి ఉంటాడు. ఒక వానపాము కంచె ఉన్నా లేకున్నా పట్టించుకోదు. దానికి కంచెతో పనిలేదు. దానికి స్టీవ్ తోట వేరని తెలీదు. ఎక్కడ భూమి ఉంటే అది అక్కడికి ప్రాకుతుంది. అది దాని తప్పు కాదు. ఉన్నది ఒక్క భూమే. ఆ పాల వ్యాపారి రసాయనిక ఎరువులు వాడితే అవి స్టీవ్ తోటలో ప్రవేశించి అతని పిల్లల శరీరాల్లోకి పండ్ల, కాయల ద్వారా చేరుతాయి. మనందరి శరీరాలు ఇంతే. కొన్ని ముఖ్య కారణాలవల్ల మనం వేర్వేరు. పర్యావరణంలో మనoదరం కలసికట్టుగా ఉన్నాము.

శ్రీకృష్ణుడు క్షేత్రం అనే పదం వాడడం మన శరీర పరిధిని దాటి అని అర్థం చెప్పుకోవాలి. పర్యావరణమంతా క్షేత్రం క్రింద వస్తుంది. దానిలో మన కర్మ అనే విత్తనాలు నాటి వానినుండి వచ్చిన ఫలాన్ని అనుభవిస్తాం. ఇది చెప్పడానికి సులభమే. ఆచరణ వేరు. దాని అర్థం ప్రతి కర్మ క్షేత్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.

నేను మొదట భౌతిక ప్రపంచాన్ని తీసుకొని వివరిస్తాను. నేను టైమ్స్ బీచ్ , మిస్సోరీ (Times Beach , Missouri) గురించి వార్తల్లో చదువుతున్నాను. అది ఒక బాధాకరమైన విషయం. మీరు భవిష్యత్తులో దీని గురించి మరిన్ని వార్తలు వింటారు. ఈనాడు అది ఇంకా మొదటి దశలో ఉంది. పదేళ్ళ క్రిందట ఒక ట్రక్కు (Truck) నడిపేవాడు టైమ్స్ బీచ్ రోడ్ల మీద పెట్రోలియం నూనె (oil) జల్లేడు . ఆ నూనె డైఆక్సిన్ (dioxin) అనే విష పదార్థముతో కూడినది. శాస్త్రజ్ఞులు పరిశోధనా శాలల్లో జంతువుల మీద డైఆక్సిన్ జల్లితే వాటికి అవిటితనం (Birth Defects), నరాల బలహీనత (Nervous Disorder) , కేన్సరు (Cancer) మొదలగు వ్యాధులు, కొన్నిటిలో మరణం కూడా వచ్చేయి. కొన్ని రహదారుల మీద డైఆక్సిన్ మామూలుకన్నా వంద రేట్లు సాంద్రత ఉన్నది. వానలు కొంత డైఆక్సిన్ ను ఊరంతటికీ ప్రాకేలా చేశాయి. ఎంత మంది పిల్లలు ఆ వూరిలో బయట ఆడేరు? ఆ విషం ఎంత లోతుకు ప్రాకింది ? అది త్రాగే నీటిలోనూ తినే కాయల, పండ్లలోనూ ప్రాకిందా ? దాన్ని కనిపెట్టడం ఎలా? దాన్ని కట్టడి చేయడం ఎలా ? వీటన్నిటికీ కారణం దశాబ్దాల క్రిందన తీసికొన్న చిన్న చిన్న నిర్ణయాలు. ఆ ట్రక్ డ్రైవరు తెలీక పలు చోట్ల అ విషపూరిత నూనెను జల్లేడు. అధికారులు ఆ నూనె విషపూరితమని వార్తల్లో వచ్చిన కథనాలను పెడచెవిన పెట్టేరు. శాస్త్రవేత్తలు దానిని ఒక చిన్న విషయంగా పరిగణించేరు. అ విష ప్రభావం ఇప్పటికే చాలా స్థలాల్లో ఉంది. జన్యులలో జరిగిన మార్పులు పుట్టబోయే వారిని ప్రభావితం చేస్తాయి

ఇది ఒకానొక చోట జరిగిన విషయం. ప్రభుత్వ కథనం ప్రకారం అమెరికాలో 14 వేల ప్రదేశాల్లో విష పూరిత పదార్థాలను దాచి ఉంచేరు (hazardous waste dumps). వాటి ప్రభావం దేశ కాలాల మీద ఎలా వుంటుందో వేచి చూడాలి .

మరియొక చిన్నదైన దుర్ఘటన ఈమధ్య జరిగింది . పి సి బి (PCB : Polychlorinated Biphenyls) అనే విష పదార్థం ఆహార పదార్థాలలో కనిపించింది. ఎలాగంటే అది ఒక ప్రేలిన ట్రాన్స్ఫార్మర్ (Transformer) ద్వారా పది రాష్ట్రాలలో వ్యాపించింది. 18 రాష్ట్రాలలో తినే పదార్థాలలో పిసిబి కనబడినది. దేశ విదేశాల వ్యాపారం చేసేవాళ్ళ వల్ల ఆ విషపూరిత పదార్థాలు మొత్తం అమెరికాకు లేదా ప్రపంచానికి ఎగుమతుల వల్ల ప్రాకేయి. ఇటువంటి దుర్ఘటన ఒక మనిషి చేసిన చిన్న తప్పు వల్ల కలుగుతుంది . ఒక ట్రక్ డ్రైవరు ప్యాకేజీలు (Containers) మీద అంటించిన సూచనలను (labels) చదివి ఉండకపోవచ్చు. కానీ వాటి ప్రభావం ఎంత ఉన్నదో! కర్మ సంభందమైన క్షేత్రం యొక్క ఐక్యతను తెలియజేసే విషయాలివి . ఒక చోట పాతిన విత్తనం పలు చోట్ల దుఃఖమనే ఫలాన్ని కలుగజేసింది.

ఈ ఐకమత్యం వల్ల ఒక భయంకరమైన న్యాయం కర్మ మీద ఆరోపితమౌతుంది. ఈ విషయం గూర్చి మిగతా పుస్తకంలో చెప్తాను. కర్మ యొక్క ముఖ్య అంశం: మన స్వార్థం గురించి మన జీవితం గడపరాదు . మనం నాటిన విత్తనాల నుంచి పండిన ఫలాలను మనం పొందుతాము. అది కేవలం ఒకరికి ఆ పండ్లను పంచి పెట్టడానికైనా కావచ్చు. ఉదాహరణకు పంటల (Agriculture) పండించడం గురించి ఆలోచిద్దాం. అమెరికాలో కనిపెట్టబడి, తయారుచేయబడిన క్రిమి సంహారక రసాయనాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా బీద దేశాలకు. వీటిలో కొన్ని రసాయనాలు అమెరికా లోనే నిషేధింపబడినవి! లేదా తీవ్రంగా నియత్రింప బడినవి. వాని గురించి కొనేవాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు. ఎందుకంటే వాటి ప్రమాదాల గూర్చి సూచనలిస్తే ఎవ్వరూ కొనరు గనుక. కానీ వాటి వలన కలిగే అపాయాలు ఒక దేశానికే పరిమితం కావు. ఖరీదైన క్రిమి సంహారక రసాయనాలు తమ దేశస్తులకు పండించిన పంటమీద జల్లరు . ఎందు కంటే ధర గిట్టుబాటు కాదు. ఏ పంట ఐతే ఎగుమతి చెయ్యడానికి పండించేరో దాని మీద జల్లుతారు. ఈ విధంగా ఆ విషపూరిత పదార్థాలు మళ్ళీ అమెరికా వంటి సంపన్న దేశాలకు తిరిగి వస్తాయి.

ఇవన్నీ కర్మ సిద్ధాంతానికి ఉదాహరణలు . కర్మను నా ఉద్దేశంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకొంటారు. కాబట్టి నేనీ అవకాశాన్ని తీసుకొని కర్మ గూర్చి విపులంగా చెప్తాను. సంస్కృతంలో కర్మ అంటే ఒకరు చేసిన పని. దాన్ని క్రియ లేదా కార్యమనవచ్చును. కర్మ సిద్ధాంతం చెప్పేదేమిటంటే ఒకే సంఘటన హేతువు లేదా కారణము మరియు కార్యము లేదా ఫలము అగుట. ప్రతి క్రియకీ పర్యావసానము ఉంటుంది. ఆ పర్యావసానికి మళ్ళీ పర్యావసానము ఉంటుంది. దీనిని అనవస్తా దోషం అంటారు. అలాగే ప్రతి కర్మ అంతకు పూర్వం చేసిన క్రియకి పర్యావసానము.

దీనిలో అత్యంత వ్యాపితమైన భావం ఉంది. ముందు నేను ఒక వ్యక్తికి సంభందించిన కర్మ గూర్చి చెప్తాను. ఎందుకంటే సాధారణంగా మనం చేసే కర్మ క్షేత్రమనే మన శరీరానికి మనస్సుకూ పరిమితం కనుక.

భారతీయులకు మరియు ఇతర దేశస్తులకు కర్మ అంటే భౌతికమైన క్రియ అనే అర్థము సర్వ సాధారణము. దీని ప్రకారం మనమేమి క్రియ చేసినా మనకది ఫల రూపంలో తిరిగి వస్తుంది. రాముడు కృష్ణుడిని కొడితే , దాని ఫలము కృష్ణుడు రాముడిని కొట్టే రూపంలో వస్తుంది. ఒకప్పుడు అది వింతగా, అగుపడని రీతిలో ఉంటుంది. ఎందుకంటే దాని పర్యావసానములన్నీ మనం ఊహించలేము కనుక. కానీ కర్మకు పర్యావసానము ఉంది. ఈవిధంగా కర్మ సిద్ధాంతము అతి గుహ్యమైనది కాదు. గురుత్వాకర్షణ ఎలా పని చేస్తుందో అలాగే కర్మ సిద్ధాంతం కూడా పని చేస్తుంది.

మళ్ళీ కృష్ణుడు రాముని కొట్టిన ఉదాహరణ చూద్దాం . కర్మ సిద్ధాంతం ప్రకారం దానికి పర్యావసానము ఉంటుంది. రాముని కన్నుకు దెబ్బ తగిలి ఉండచ్చు. అది రాముని అంతరంలో ముద్రితమౌతుంది. దాని వల్ల అతనికి కోపం వస్తుంది. అది కృష్ణుని అంతరంలో ముద్రితమౌతుంది. రాముడు కృష్ణుని కొట్టి ప్రతీకారము వెంటనే తీసికొనవచ్చును. దీనిని నేను "క్యాష్ కర్మ" (cash karma) అంటాను. దీని అంతరార్థo చెల్లుకు చెల్లు అని రాముడు కృష్ణుని వెంటనే కొట్టడం. కొన్ని కారణాల వల్ల రాముడు కృష్ణుని వెంటనే కొట్టడు. తనకు కలిగిన కోపం తన భార్యపై ప్రదర్శిస్తాడు. లేదా ఇంట్లోని పిల్లిని కాలుతో బయటకు తంతాడు.

కర్మ ఇంత సులభంగా చెప్పబడేది కాదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చెప్పవలసిన విషయమేమిటంటే రాముని కోపం తన బంధమిత్రులు మీద ప్రభావితమౌతుంది. రాముని భార్య ఆ కోపం కృష్ణుడితో పనిచేసే అర్జునుడి మీద చూపవచ్చు. కృష్ణుడు అర్జునుని అవమానిస్తే అర్జునుడు కృష్ణుని కొట్టవచ్చు. కృష్ణునికి తనకు కలిగిన దెబ్బ తను మొదట రాముడిని కొట్టినందువలననే అని తెలియక పోవచ్చు. వాని కోపమంతా అర్జునుని మీదే . ఈ విధంగా కర్మ పర్యావసానము ఒక గొలుసులాగా ఉన్నది. కృష్ణుని కర్మ పంటకి బీజమవుతున్నది.

మన నడవడి ఎంత దూరం, ఎంతమందిని ప్రభావితం చేసిందో చెప్పలేం. దీని వల్ల మనకి తెలిసిన విషయమేమిటంటే కర్మ చాలా క్లిష్టమైనది. మనలో ఏఒక్కరికీ దాని గురుంచి పూర్తి అవగాహన లేదు. ఇంకో విషయమేమిటంటే ఈ కర్మ వలయం సహజంగా తరతరాలుగా ఉన్నది. మన ప్రస్తుత పరిస్థితి--చెడు అయినా మంచి అయినా-ఎప్పుడో ఎక్కడో కర్మవల్ల నిర్దేశింపబడినది. మనం ఒకరికి చేసిన పుణ్యమో పాపమో కర్మకి మూలంగా ఉన్నది.

దీని పర్యావసానము అనుభవానికి ఈ విధంగా వస్తుంది: మనకు జరిగేవన్నీ మన నడవడిక వలననే; వేరెవరూ దానికి బాధ్యులు కారు; తెలిసో తెలీయకో మన చేష్టలు మన పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. ఇకపోతా ఒక మంచి విషయం ఏమిటంటే మన నడవడికగానీ మార్చుకోగలిగితే మనకి జరిగే కర్మ మార్చుకోవచ్చు. మన విధిని మనమే నియంత్రించుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే మన విధివ్రాత మన చేతుల్లోనే ఉంది.

ముందు చెప్పినట్లు ఎంతో మంది కర్మను పైపైనే చూస్తారు. అది ఒప్పే కానీ సంపూర్ణమైన జ్ఞానం కాదు. మనం చూసే కర్మ ఒక ఐస్ బర్గ్ (Iceberg) కనిపించే శిఖరాగ్రాము. కర్మను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనస్సును విశ్లేషణం చెయ్యాలి.

మళ్ళీ కృష్ణుడు-రాముడు కథకి వెళదాం. కృష్ణుడు రాముడిని కొట్టడంవల్ల పరిణామాలు చాలా ఉన్నాయి. రామునికి దెబ్బ తగిలింది. రాముని మనస్సులో ముద్రితమయింది. అలాగే కృష్ణుని మనస్సులో కూడా. కృష్ణుడు తన నడవడికను మార్చుకోకపోతే అతనికి కోపంవల్ల ఇంకొకరిని కొట్టవచ్చు. అతను తన కోపం వల్ల కొట్టడం కొంత ఉపశమనం ఇస్తుందని తలచవచ్చు. నిజానికి అతని కోపం హద్దులు ఇంకా ఎక్కువగా దాటవచ్చు. ఎంతంటే హింస చేసే దాకా.

మన క్రియలన్నీ మన మనస్సులో కర్మను కలుగజేస్తాయి. ఇది అనుభవం లేని ఉత్తి జ్ఞానం కాదు. దాని పర్యవసానం కళ్ళారా చూడవచ్చు. కృష్ణుడు ఎలా క్రియవల్ల తనలోపల మార్పు చెందేడో చూద్దాం. అతను భవిష్యత్తులో కోపం నియంత్రిoచకపోతే ఇంకా క్రూరమైన పనులు చేస్తాడు. అతను మాటిమాటికి పరులను బాధ పెడతాడు. అతని ప్రకృతి వల్ల ఎప్పుడూ కోపానికి దారితీసే పరిస్థితులలో చిక్కు కొంటాడు. ఎప్పుడోఒకప్పుడు ఒక పెద్ద కోట్లాట చేసి తన్నులు తింటాడు. ఇది రాముని కొట్టడం మొదలు ఇంత దూరం వచ్చింది.

దీనికన్నా విచిత్రమేమిటంటే మన ఆరోగ్యం మీద కర్మ ప్రభావం.

బుద్ధుడు చెప్పినట్లు మనం కోపంవల్ల శిక్షింపబడం; కోపమే మనను శిక్షిస్తుంది. అంటే కోపం తనంతట తానే కర్మగా మార్చుకొంటుంది. కృష్ణుడు రాముని కొట్టి ఆనందించవచ్చు. కానీ ఒక అసంగతుడైన వైద్యుడు దానిని అంగీకరించడు. అతడు కృష్ణుని శరీరంలో జరిగే మార్పులను చూస్తాడు. అతని రక్తపోటు, నరాల వ్యవస్థ పై ప్రభావం కొలుస్తాడు. కోపం వల్ల కృష్ణుని రక్తపోటు పెరుగుతుంది, గుండె అతివేగంగా కొట్టుకుంటుంది, హార్మోనులు మరియు అడ్రినలిన్ విపరీతంగా ప్రకోపిస్తాయి. వైద్యుడు "నువ్వు పరిమితి మించిన ఒత్తిడిని నెత్తికెక్కించుకున్నావు" అని కృష్ణునికి సలహా ఇస్తాడు. నా ఉద్దేశంలో కోపం గుండెపోతుకన్నా వెయ్యి రెట్లు ప్రమాదం. నువ్వు కోపంవల్ల అప్పటి కప్పుడే చెడు అనుభవిస్తావు. ఇది ఒకరోజుతో తీరే సమస్యకాదు.

కృష్ణుని కోపం ఇలా చాలా యేళ్ళు కొనసాగింది అనుకొందాం. రాముడు తనని కొట్టక పోయినా, అతను తనలోనే తన్ను కొట్టుకుంటాడు. అతను తీవ్ర ఒత్తిడికి గురై ఎల్లప్పుడూ కొట్లాటా లేదా పలాయనమా (fight or flight) అని ఆలోచిస్తూ ఉంటాడు. వైద్య శాస్త్రం చెప్పేదేమిటంటే ఇటువంటి వొత్తిడి వల్ల గుండె జబ్బు, మానసిక వ్యాధులు, తీవ్రమైన తలనొప్పి, కడుపులో అల్సర్లు , చివరకు క్యాన్సరు కూడా రావచ్చు. ఈ విధంగా కోపం వల్లే కలిగే కర్మ నడుస్తూ ఉంటుంది.

కృష్ణుడు మండిపడడంవల్ల , ఇతరులమీద దాడి చేయడంవల్ల వానితో సహజీవనం చేయడం అతి కష్టం. మానవ సంభందాలు క్షీణిస్తాయి. అతని మిత్రులు అతన్ని చూసి తప్పుకుంటారు. సహ ఉద్యోగులు అతన్ని అసహ్యించుకొంటారు. దీనివల్ల అతను ఇంకా కోపం చెందుతాడు. జీవితం దుర్భరమవుతుంది. కృష్ణుడు ధూమపానం, త్రాగుడు తనని తాను శిక్షించుకోడానికి మొదలెడుతాడు. ప్రమాదకరమైన క్రియలు చేస్తాడు. స్కై డైవింగ్ (sky diving) , రాక్ క్లైంబింగ్ (rock climbing), కార్ రేసింగ్ (car racing) వంటి ప్రమాదకరమైన పనులు చేస్తాడు. ఇవన్నీ చెడు కర్మను పెంపొందించుకొనే మార్గాలు. ఇంకా ఎన్నో రకాలుగా కృష్ణుడు చెడిపోవచ్చు. అవన్నీ చెప్పడానికి ఈ పుస్తకం చాలదు.

కర్మ యొక్క విశేషం ఏమిటంటే కృష్ణుడు ఎవరినీ కొట్టక పోయినా, అంతర్గతంలో కోపం శరీరాన్ని మనస్సునీ ప్రభావితం చేస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నిస్తే అతని రక్త పోటు పెరుగుతుంది, కడుపు మండుతుంది, గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. కానీ వాటి కర్మ ఫలము ఒకరిని కొట్టడం కన్న తక్కువ తీవ్రత గలది. కాబట్టి మన ఆలోచనలు కూడా మనపై ప్రభావం చూపిస్తాయి. అవి మన దృక్పధాన్ని మారుస్తాయి, దానివలన మన ఆరోగ్యం ప్రభావితమౌతుంది. మన నడవడిక, ఏ ఉద్యోగం చేస్తామో, మిత్రులు కూడా --ఒక్కమాటలో చెప్పాలంటే మనం చేసే క్రియలన్నీ-- మన ఆలోచనలవలననే .

మీరు కర్మ సిద్ధాంతం ఎంత తార్కికంగా బలీయమో, మానసిక కర్మ ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసికొన్నారని తలుస్తాను. అది భౌతిక కర్మ కన్నా విలక్షణంగా ఉన్నట్టుoటుంది, కానీ మరింత ప్రమాదకరమైనది. అది దీర్ఘ కాలం పనిచేస్తుంది. అందుకే "శరీరం, మనస్సు క్షేత్రoలాంటివి" అన్న వాక్యం నాకు నచ్చింది. ఆలోచన ఒక విత్తనంలాంటిది: అతి సూక్ష్మం; కానీ అది పెద్ద, శక్తివంతమైన, వృక్షం లాగా పెరగగలదు. నేను రోడ్ల మీద ఒక చిన్న కన్నంలో ఎలాగ ఒక విత్తు పెరిగి పెద్దదయి మహా వృక్షమై చివరకు ఆ రోడ్డునే చీల్చివేస్తుందో చూశాను. దాని వ్రేళ్ళు భూమిలో పాకి పక్కనున్న ఇంటి పునాదిని కూడా చీల్చివేసింది. అటువంటి వృక్షాన్ని వేళ్ళతో పెకిలించడం అతి కష్టం. అలాగే జీవితాంతం చెడు ఆలోచనలతో గడిపి సక్రమమార్గానికి రావడం కూడా. చెడు ఆలోచనలవలన తనను తాను హింసించుకోవడం కాక ఇతరులను ప్రభావితం చేయడం జరుగుతుంది.

నాకు ఎంతసేపూ చెడును గూర్చి మాట్లాడడం నచ్చదు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి విషయం చెప్తాను. పై ఉదాహరణలవలన మనకి తెలిసినదేమిటంటే కర్మకి మనము బాధ్యులము. అది మన ఆలోచనల, క్రియల మీద ఆధార పడుతుంది. కర్మకి మూలకారణం మనస్సు. కాబట్టి మన ఆలోచనలను మార్చుకొంటే కర్మయొక్క చెడు ప్రభావాన్ని నియంత్రిoచవచ్చు. ఒక వ్యక్తి ఎందుకో మనమీద కోపంగా ఉన్నప్పుడు, మనం సాత్వికం, దయ పూరిత విధంగా మాట్లాడితే అది మంచి కర్మ. అందరూ బాగుపడతారు. ఆ కోపిష్టికి కర్మభారం తగ్గుతుంది. శారీరకంగా మంచి మార్పులు వస్తాయి. అతని నరాల వ్యవస్థ స్వస్తతో పనిచేసి కోపం తగ్గిస్తుంది. అతను తక్కిన వారిమీద కోపం చెందక మరింత చెడు కర్మ చేయడు. మన శరీరం మనస్సు కూడా లబ్ది పొందుతాయి. మనం పరుషమైన మాటలు మాట్లాడకుండా అవసరమైతే పళ్ళు అరగదీసినా సరే అది మంచికి దారి తీస్తుంది. మన కీలక అవయవాలు క్షేమంగా కాళ్ళ మీద కాళ్ళేసుకొని "మంచి పని మిత్రమా" అంటాయి. మనం కోపిష్టికి సహాయ పడ్డామని తెలిసికొని, తృప్తితో ఉంటాం. దీనివల్ల ఇతరులతో కలిసిమెలిసి ఉండడంలో ప్రావీణ్యత పొందుతాo. సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పినట్లు మనం శాంతిని పెంపొందించడానికి ఒక పనిముట్టు మాత్రమే. 45

No comments:

Post a Comment