Saturday, November 13, 2021

Eknath Chapter 13 Sloka 10

13.9

మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ

వివిక్త దేశ సేవిత్వం అరతి ర్జనసంసది

నాయందు అనన్యమైన అచంచల భక్తిని కలిగియుండుట , ఏకాంతవాసము చేయుట, జనసమూహమునందు ప్రీతి లేకుండుట మరియు

ఆధ్యాత్మ జ్ఞానవిత్యత్వం తత్త్వ జ్ఞానార్థదర్శనం

ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా

ఆత్మ జ్ఞానము నందు స్థిరత్వము, తత్త్వజ్ఞానము కొరకు శాస్త్రావలోకనము ఇది అంతయు జ్ఞానమని చెప్పబడినది. దీని కంటెను అన్యమైన దంతయు అజ్ఞానము

ముందు చెప్పిన శ్లోకాలు వలె ఇక్కడ కూడా వైరాగ్యం పొందే పద్దతి, దాని గమ్యం చెప్పబడుచున్నది.

మన మెప్పుడైతే అనుభవంతో భగవంతుడు మనయందే ఉన్నాడని తెలుసుకొంటామో, తక్కినదంతా అస్థిరముగా చూస్తాము. మనము భూమి మీద సేవ కోసం ఉన్నాము. ఏ శక్తీ మనను స్వార్థపూరితమైన బంధం వైపు ఆకర్షింపలేదు. కొందరు నన్నడిగే వారు: "మీరు దేనికైనా ఆకర్షింపబడతారా?" నా సమాధానము "ఎవరి ద్వారా?". మన ప్రతి అణువులోనూ అపరిమిత ఆనందం ఉన్నప్పుడు, చాకలేట్ ట్రఫుల్ మీద మనస్సు ఎందుకు పోతుంది? నాకు ట్రఫుల్ అంటే ఇష్టం లేక కాదు. ఆత్మ జ్ఞానం వల్ల కలిగే ఆనందంతో పోలిస్తే ఇంద్రియముల ద్వారా వచ్చే సుఖం దిగతుడుపే.

ఇది సమాధి వలన పొందే ఫలం. సాధన మార్గము అనేకమైన విఘ్నములతో కూడినది. మనము సాధనలో ముందుకెళుతున్న కొద్దీ అవి తగ్గు తాయి. కాని అవి మన సాధనికి అంతరాయం ఎందుకంటే మనలోని ఘనీభవించిన కోరికలు. మనము ఆత్మ జ్ఞానం పొందుటకు విపరీతమైన కృషి చేయాలి. అదే మన లక్ష్యం. వ్యక్తిత్వం సాధనతో మార్చు కోవడం చాలా కష్టం. అందుకే సాధనని చిన్న చూపు చూసి, మిగతా వాటికి పెద్ద పీఠం వేయకూడదు.

అలాగని మనం వేరే క్రియలు చేయరాదని నిషేధం లేదు. సంస్కృతంలో భూగోళం ని కర్మ భూమి అంటారు. కర్మ అంటే క్రియ. భూమి క్రియలతో నిండినది. క్రియలు చేసే ప్రపంచం కర్మ ప్రపంచం. ఇతరులతో సామరస్యంగా పనిచేయడం ఆధ్యాత్మిక జీవనానికి చాలా ముఖ్యం. అది ఒక విధంగా తప్పనిసరి. మనం మనకన్నా వేరైన వారితో జీవిస్తూ పనిచేస్తూ ఉండకపోతే మనం ఏ విధంగా పాత కష్టాలు, తప్పులు సరి దిద్దుకొంటాం? మనం జీవితంలో ఉత్సాహంగా లేకపోతే -- ముఖ్యంగా కష్టాలెదురైనప్పుడు -- మనకు ధైర్యముతో, ఓర్పుతో, దయతో, గౌరవముతో కష్టాలని అధిగమించడం ఎలా సాధ్యం? వీటన్నిటికీ మూలం దేవుడు సర్వ జీవులలో ఉన్నాడనే జ్ఞానం. అదే భూమిమీద పుట్టినందుకు కారణం.

మొదట్లో సాధన ప్రారంభించినపుడు మన రోజూవారీ చేసే క్రియలనుండి మార్పు తప్పదు. పాత మిత్రులు మన నూతన స్వభావమువల్ల దూరమౌతారు. ఒకరు సోమర్ సెట్ మౌమ్ ని ఇలా అడిగేరు: "పాత మిత్రలను మారిచిపోవాలా?" ఆమె నిర్లిప్తంగా "కొన్నిసార్లు తప్పదు" అని సమాధానం ఇచ్చేరు. జీవితాన్ని పునరుద్దరించడానికి మన పాత మిత్రులను, జీవన శైలిని మార్చుకోవాలి. మొదట్లో ఇది బాధాకరంగా ఉంటుంది. రాను రాను మనం పాత మిత్రులను కలిసినపుడు గ్రుడ్డివాడికి గ్రుడ్డివాడు దారి చూపిస్తున్నట్టు లా కాక, మనం వాళ్ళ హృదయాలలో వెలుగు నింపుతాము.

భారతదేశంలో గుర్రం బగ్గీలు ఇంకా వాడకంలో ఉన్నాయి. వాటిని నడిపేవాడు గుర్రం జన సమూహాన్నిగాని, ఇతర వాహనాలను గానీ చూసి బెదరకుండా కళ్ళకి గంతలు కడతాడు. అలాగే సాధకులకు కూడా గంతలు ఉన్నాయి. ఒకటి వైరాగ్యం. అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో తాదాత్మ్యం చెందకుండుట. రెండవది వివేకము. అంటే అన్ని క్రియల్లోనూ మాటిమాటికి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం. లక్ష్యం లేక, మన ఇంద్రియాల చెప్పు చేతలలో ఉంటే మనం గంతలు లేని గుర్రాలలాగా చూసే, విన్న వానితో తికమకపడి ఏ దిక్కoటే ఆ దిక్కుకు పోతాం.

సాధకులుగా మనము విప్లవాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ఎంతో శాంతంగా ఉన్న మన మనస్సును ఉసిగొల్పుతాయి. అలాగే ప్రసార మాధ్యాలకు దూరంగా ఉండాలి. ఇది సాధన ఉపక్రమించినప్పుడే కాదు. అన్ని వేళలా. మన పూర్వీకులకు ఈ బెడద ఉండేది కాదు. మనం 21 వ శతాబ్దం వాళ్ళము కాబట్టి వీటిగురించి అప్రమత్తతో ఉండాలి. టివి లోని చిత్రాలు, మాటలు మనను ప్రభావితం చేస్తాయి. అలాగే చలన చిత్రాలు , సినిమా పాటలు కూడా. అవి మనకి తెలియకుండా మన అచేతన మనస్సును ఆక్రమించుకొంటాయి. నేనొక విత్తనాల జాబితాలో ఇలా చూసేను: "మా విత్తనాలు తప్పకుండా పెరుగుతాయి." ప్రసార మాధ్యాల విత్తనాలు కూడా తప్పక పెరుగుతాయి. మనము ఇది ధ్యానం మొదలెట్టిన చాలా కాలం అయినప్పుడు -- ఎప్పుడైతే మనం స్పృహ లేక చుట్టూ చూస్తున్నప్పుడు-- తెలుస్తుంది. ప్రసార మాధ్యమనే కలుపు మొక్కలను వేళ్ళతో పెకళించాలి. అది మనమనుకొంటున్నంత సులభము కాదు.

నేను సాధన గూర్చి భారతదేశంలో చూసిన రైలు బండ్లను ఉపమానముగా తీసికొని చెప్తాను. మనం ధ్యానం మొదట్లో ప్యాసింజర్ బండిలా అనగా నెమ్మదిగా ఉంటాము. మనము మద్రాసు స్టేషన్ నుంచి బయలదేరేము. మన గమ్యం 2 వేల మైళ్ళు దూరం ఉన్న హిమాలయాలు. ప్యాసింజర్ రైలు ప్రతీ స్టేషన్ లోనూ ఆగాలి. అనేకమైన ఎక్కి దిగే ప్రయాణీకులు ఉంటారు. దానికి తోడు తినుబండారాలు అమ్మేవాళ్ళూ ఉంటారు. అలాగే కొందరు సాధకులు అన్ని బాధ్యతలను నిర్వహించేక ధ్యానం మొదలపెడదామని అనుకొంటారు. అలాంటివాళ్ళు ప్యాసింజర్ బండిలో ప్రయాణీకుల్లా ప్రతి స్టేషన్ లో దిగి, చుట్టూ చూసి మళ్ళీ బండి ఎక్కుతారు. సూర్యాస్త సమయంలో ఎక్కడో పల్లెటూరు స్టేషన్ లోనే తమ గమ్యానికి వందల మైళ్ళ దూరంలో ఉంటారు. చీకటి పడ్డాక, ఇక వాళ్ళు గమ్యం చేరినట్టే !

ప్యాసింజర్ రైలు లాగా, అలాంటి సాధకుడు తన గమ్యాన్ని ఎప్పుడో ఒక రోజు చేరుకొంటాడు. కానీ దానికి ఎన్నో జన్మలు ఎత్త వలసి ఉంటుంది. మనం బండిలా పట్టాల మీద ఉండి ముందుకు దూసుకుపోతున్నా ఎంతో దూరం వెళ్ళ వలసి ఉంది. ప్రయాణం చివరలో ఎంతో నిటారుగా ఉన్న కొండనెక్కాలి. ఇలాంటి పరిస్థితిలో ఒక మనిషికి ప్రతి వీధిని చూసి గమ్యం చేరుకోడానికి కావలసిన ఇంధనం ఒక జీవిత కాలంలో ఉండదు. మనకి వెయ్యేళ్ళు ఆయుష్షు ఉంటే అది సాధ్యమేమో. మనం జీవితాన్ని ఆటగా చేసికొని ప్రతి చిన్న విషయాన్ని అనుభవించవచ్చు. అలా చేసినా మన గమ్యం చేరుకోవచ్చు. కానీ వంద ఏళ్ళు ఆయుష్షు సరిపోదు. వృద్దాప్యం, బాల్యం ల వల్ల పూర్తిగా వంద ఏళ్ళు కూడా లేవు. మనకు రోడ్ల ప్రక్కన జరుగుతున్న జంతర్ మంతర్ చూడడానికి సమయం లేదు. టిబెట్ వాస్తవ్యుడు మిలెరెప ఇలా అన్నారు: "ప్రపంచ విషయాలు అలా ఉంటూనే ఉంటాయి. ధ్యానం మొదలు పెట్టడానికి ఆలస్యం చేయద్దు."

ఇప్పుడు ఎక్స్ ప్రెస్ బండి పరిస్థితి చూద్దాం. నేను భారతదేశంలో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ ఉదయాన్నే మద్రాసు స్టేషన్ నుంచి వెయ్యి మైళ్ళ దూరాన దేశం నడుమనున్న నాగ్ పూర్ పట్టణానికి వెళ్ళేది. అది ముఖ్యమైన స్టేషన్ లలోనే ఆగేది. ఆ రోజుల్లో హిమాలయ అంచుల్లో ఉన్న సిమ్లాకి ప్రయాణమైన వాళ్ళు మద్రాసు నుంచి ఎక్స్ ప్రెస్ బళ్ళు ఎక్కి రెండు మూడు రోజుల్లో గమ్యం చేరేవారు. ఇది రెండవ కోవకు చెందిన సాధకునికి ఉపమానము. మనందరికీ అట్టి సామర్థ్యం ఉంది. అటువంటి సాధకుడు జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అతని స్వంత ఊరిలో అతని ఆగడాల గురించి ఇంకా చెప్పుకునే వారు వుండవచ్చు. అయినప్పటికీ అతను ధ్యానం, ఆధ్యాత్మిక కార్యాలు సహృదయంగా చేస్తే రామ బాణంలా ముందుకు సాగుతాడు. 83

No comments:

Post a Comment