Sunday, November 21, 2021

Eknath Chapter 13 Sloka 11

13.10

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృత మశ్నుతే

అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాస దుచ్యతే

దేనిని తెలుసుకొనుటవలన మోక్షము కలుగునో ఏది ఆదిలేని పరబ్రహ్మమో, దేనిని సత్తనిగాని, అసత్తని చెప్పలేమో అటువంటి జ్ఞేయమును చెప్పుచున్నాను

ఆధ్యాత్మిక చింతనాలక్ష్యం మరణించిన పిదప ఏమౌతుందో విశ్లేషించడం. అది చేయటం సాధ్యం. అది చేయ బడినది. ఎలా అంటే ఉనికిని శరీరముతో విడదీసి.

కఠ ఉపనిషత్ లో నాచికేతుడు యమధర్మరాజును ఒక ప్రశ్నని అడిగేడు. ఈ ప్రశ్నని ఎప్పుడో ఒకప్పుడు మనమూ అడిగే ఉంటాము. ఒక మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నాచికేతుడు "కొందరంటారు మరణించినవాడు ఎక్కడో బ్రతికి ఉంటాడు. ఇంకొందరు అతడు మాయ మౌతాడు అంటారు. అక్కడితో పరిసమాప్తం. ఓ ధర్మరాజా నాకు విడమరచి చెప్పు. నేనిది తప్పక తెలుసుకోవాలి." అని అడిగేడు.

నాకు ముగ్గురు మిత్రులు ఉన్నారు. వారు జియో డెసిక్ డోం (Geodesic Dome) అనబడే ఇంట్లో ఉంటారు. ఇది భూగోళం చుట్టూ ఉన్న వాయువుకు (Atmosphere) నిదర్శనం. వాళ్ళు రోజూ పనికి వెళతారు. సాయంత్రం డోం కి తిరిగి వస్తారు. ఒకరోజు వాళ్ళు ఇంటినుండి బయటకు వెళ్లకూడదని నిర్ణయించేరని అనుకుందాం. ఏవరో వాళ్ళకి కావలిసిన సరుకులు తెచ్చి, వాళ్ళ చెత్తని ఊడుస్తారు అనుకుందాం. వాళ్ళు దానికి అలవాటుపడిపోతారు. కొన్నాళ్ళకు వాళ్ళు బయట ప్రపంచాన్ని మరచిపోతారు. వాళ్ళ కార్లను, కార్ నడపడం మరచిపోతారు. బయట ఉన్న ప్రదేశం, పైన్ వృక్షాల గురించి కూడా వాళ్ళ స్మృతి కిరావు. వాళ్ళ ధ్యాస ఎప్పుడూ ఇంటి గురించే. వాళ్ళ పుస్తకాలకు, పాత పత్రికలకు, ఫోటో లకు, రోజూ వారి పత్రికలకు అంకితమైపోతారు. వాళ్ళ నీళ్ళ గొట్టాలు నీరు కారుతున్నా పట్టించుకోరు. మీద తిరుగుతున్న సాలీడులను చూడరు. వాళ్ళని సాన్ ఫ్రాన్ సిస్కో గురించి అడిగితే తెలీదంటారు. ఆ పట్టణం ఒక కలలా ఉంటుంది. "నాకు తెలీదు" అంటారు. చివరకి "ఏ పట్టణం లేదు. సాన్ ఫ్రాన్ సిస్కో నిజానికి లేదు. బయట ప్రపంచం ఉందని చెప్పటానికి ఆధారమేమిటి?" అని పైపెచ్చు అడుగుతారు.

మనమెక్కడి నుంచి వచ్చేమో మరచిపోయామా? మనమందరము వసుదైక కుటుంబమని, ఒకే భగవంతుని బిడ్డలమని మరచేమా? మనం భగవంతుని దగ్గిరకి తిరిగివెళ్ళ వలసిన వారలమని మారిచిపోయామా? మనం ప్రపంచ ధ్యాసలో పడిపోయేం. యుగయుగాలుగా ఈ ప్రపంచంలో ఎన్నో జన్మలెత్తి స్వార్థ పూరిత నడవడికతో, మన వేర్పాటుతో, మనకదేమి గుర్తుకు రావటంలేదు. నిజానికి దాన్ని మనం ఖండిస్తాము. జీవులపై పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు నాచికేతుని ప్రశ్నకు ఇలా సమాధానమిస్తారు: "మనిషి మరణించిన తరువాత వాని జీవితం పరిసమాప్తమైపోయింది. అదే చివరి జన్మ." యమధర్మరాజు దానికి ఒప్పుకోడు. నా మిత్రులు బయట ప్రపంచముందని ఆధారం ఏమిటంటే నేను "మీ డోం తలుపులు తెరవండి. బయటకు వెళ్ళి చుట్టూ చూడండి. నాకు మీరు చూసిందేమిటో చెప్పండి" అంటాను. "నేను తలుపులు తియ్యను. ఎందుకు తీయాలి? బయట ఏమీ లేదు" అని అనవచ్చు. వాళ్ళు బయటకే వెళితే మళ్ళీ ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. మనము ధ్యానముతో మన అహంకార పూరిత వ్యక్తిత్వం వదులుకుంటే, మనమేవరో తెలుసుకొంటాము. మనం శాశ్వతమైన, మరణములేని తాత్వికత అనబడే భగవంతుని గుర్తు తెచ్చుకుంటాము.

No comments:

Post a Comment