Saturday, December 11, 2021

Eknath Chapter 13 Sloka 14

13.14

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే

ఈ విధముగ క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయముల విషయము తెలుపబడినది. దీనిని తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపామును పొందుటకు అర్హుడగుచున్నాడు

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విధ్ధి ప్రకృతిసంభావాన్

ప్రకృతి పురుషులకు ఆది లేదు . వికారములు, గుణములు ప్రకృతి వలన పుట్టిన వానివిగ తెలిసికొనుము

3 పదములు ఇక్కడ క్రొత్తగా చెప్పబడినవి. ఇవి సాంఖ్య సిద్ధాంతమునకు చెందినవి. ప్రకృతి అనగా శక్తి, పదార్థం, మనస్సు. మనమా శక్తి యొక్క క్రియలను చూడకపోయినా భౌతిక ప్రపంచము శక్తి నుండి ఆవిర్భవించినది. పదార్థమే కాక మనస్సులోని విభాగాలను మనకు ఇంద్రియముల ద్వారా చూడ శక్యమకాని మౌలిక శక్తి వలన వచ్చినవిని సాంఖ్య చెప్తుంది. ఇది అన్ని వస్తువులలోను, ఘటనలలోనూ మన అనుభవానికి వస్తుంది. ముందు చెప్పిన క్షేత్రము యొక్క 24 విశ్వ మూల సూత్రములలో ప్రకృతి మొదటిది. అది అవ్యక్తమై యుండి, కనబడే ప్రపంచమునకు మూలమై యున్నది.

పురుషుడనగా క్షేత్రమును తెలిసినవాడు. ఏది జ్ఞేయమో -- తెలిసికొనబడినది -- అది ప్రకృతి. పురుషుడు జ్ఞాత అనగా తెలిసికొనువాడు. అదే ఆత్మ లేదా పరమాత్మ అనుబడునది.

మూడవ పదము గుణమునకు ఈ పుస్తకములో విశేషమైన స్థాన మున్నది. సాంఖ్య సిద్ధాంతం ప్రకృతి 3 స్థితులుగా మారిన ఎరుక కలిగిఉంటుందని చెప్తుంది. అవి మూడు గుణాలు. అన్ని పదార్థములు, మనస్సు వీటి సముదాయము. అవి తమస్సు, రజస్సు, సత్వ గుణములు. తమస్సు నిద్రను సూచిస్తుంది. రజస్సు క్రియలను ప్రేరేపించునది. సత్వ మనగా సామరస్యము లేదా సమత్వము.

బడిలో మనము పదార్థము యొక్క 3 స్థితులను: ఘన, ద్రవ, వాయువుగా నేర్చుకొన్నాము. 3 గుణాలను కూడా ఇలాగే వివరింపవచ్చు. తమస్సు అనగా ఘనీభవించిన శక్తి. జడత్వముతో అడ్డంకులు కలిగిoచునది. ఒక ఘనీభవించిన నీటిలో (ice) అణువుల మధ్య శక్తి దాగి ఉన్నది. కాని ఆ శక్తి బంధింపబడినది లేదా అవ్యక్తమైనది. మళ్ళీ నీరు ద్రవ రూపములో మారిన కొంత శక్తి విడుదలచేయబడుతుంది. అది రజస్సుకు ప్రతీక. మనకు పోటెత్తిన నదియొక్క శక్తిని గూర్చి తెలుసు. అది రజస్సు. అదే నీరు వాయు రూపంలో ఆవిరిగా ఉంటే అది సత్వం ఎందుకంటే దానితో యంత్రములను నడుపవచ్చు.

గుణాలను మనస్సు దృక్పథంతో చూస్తే అవి వివిధమైన మానసిక స్థితులు. తమస్సు అన్నటికిన్న క్రిందనున్న స్థితి. అది అచేతనమైన బేస్మెంట్ లాంటిది. చాలామంది ఇళ్ళలో పనికిరాని సోఫాలూ, డబ్బాలూ, పనిముట్లూ, పాత పుస్తకాలూ, చెత్తా చెదారం బేస్మెంట్ లో పడేస్తారు. అచేతన మనస్సు అటువంటిదే. అలజడితో, కోట్ల జన్మల సంస్కారములతో నిండి ఉంటుంది. దానిలో గొప్ప శక్తిఉంది. కానీ అది బుద్ధికి అందుబాటులో లేదు.

రజస్సు బేస్మెంట్ మీద ఉన్నది. అది కోర్కెలు, క్రోధం, కుతంత్రాలు, పోటీ పడడం, నిరుత్సాహంతో నిండి ఉంటుంది. అది శక్తి వ్యక్తమైన స్థితి. కానీ దానిని కట్టడి చేయడానికి వీలు పడదు. అలాగే అది అహంకారి.

సత్వం ఉన్నత స్థితి. వైరాగ్యంతో, చెదరనిదై, స్వతహాగా అణిగిమణిగి ఉన్నది. దాని స్థితిలో ఇది నియంత కాక సామరస్యం, లక్ష్యం, బుద్ధి, కోరికతో నిండి ఉన్నది. నిరుత్సాహం ఉండచ్చు కాని దాన్ని నివారించవచ్చు.

ఈ విధంగా మూడు గుణాలూ మనిషిని ప్రవర్తింపజేస్తాయి. ఇటువంటి విశ్లేషణం నేను ఏ సిద్ధాంతములోనూ, మానసిక శాస్త్రంలోనూ చూడలేదు. వీనివల్ల మన వ్యక్తిత్వం ఏ విధంగా చేయబడినదో, ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య తేడా ఎందుకు వుందో తెలియబడును. తద్వారా మనం ఒక ఉన్నత ఆదర్శం ఏర్పరుచుకోవచ్చు.

మిగతా పుస్తకంలో వీటిని గూర్చి చెప్పబడుతుంది. తన సహజ స్థితిలో ఎరుక చైతన్యంయొక్క ప్రవాహం. క్రియలపై గుణముల ప్రభావము వలన మనమా సహజ స్థితి నుండి ఖండితమైన, ముక్కలైన, ఒక్కొక్కప్పుడు నిశ్చల మైన ఎరుకగలిగిన వారాలమౌతాము. ఈ విధంగా గుణాలు కంటి అద్దాలలా జీవితాన్ని పరిశీలించడానికి తోడ్పడతాయి. అవి మనమెక్కడ చూసినా ఖండమైనవి, వేర్పడినవి. మన విరుద్ధమైన ఇష్టాయిష్టాలు, మనలోని సంఘర్షణ, వేర్పాటు వీని వలనే.

పరిణామం మన సహజ స్థితికి అతి నెమ్మదిగా తీసికెళుతుందని గీత చెపుతుంది. అంటే నిర్మలమైన, ఖండింపబడని ఎరుక. మొదట తమస్సును రజస్సు గా మార్చాలి. అంటే ఉదాసీనత, సున్నితమకాని గుణమును శక్తివంతమైనదిగా, ఉత్సాహమైనదిగా మార్చడం. కానీ రజస్సు యొక్క శక్తి అహంకారంతో, చెల్లాచెదరై ఉంటుంది. దాన్ని సత్వంగా మార్చాలి. దానివల్ల శక్తినంతా పరోపకారనికి వెచ్చించవచ్చు. ఈ స్థితిలో అత్యంత ఆనందం ఉంది. శాంతమైన మనస్సు, మిక్కిలి ఉత్సాహము, బుద్ధి కుశలత ఏర్పడుతాయి. కాని ఇదే గమ్యం కాదు. మనము కళ్ల అద్దాలతో జీవితాన్ని చూసినంతసేపూ అది ముక్కలైనట్లుగా కనిపిస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం ఆ కళ్ల అద్దాలని తీసివేసి సమాధి స్థితి పొందడం. అంటే మనస్సును స్థిరపరచడం. దానివల్ల మనము శుద్ధమైన, అఖండమైన చైతన్యంతో ఉంటాము. అది శాశ్వతమైన ఆనందం. గుణాతీతులు ఎక్కడా వేర్పాటు చూడరు. తమ ప్రతిబింబాలు ఇతరులలో, అందరి ప్రతిబింబాలూ తమలో చూస్తారు. ఇది జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం. అది అఖండం, సర్వం.

రైబ్రూక్ ఇలా చెప్పేరు: మనం వీక్షించేది మనలాగా ఉంటుంది. మనం వీక్షింప బడినట్టుగా ఉంటాము. మనము మనస్సుకున్న అద్దాలతో చూస్తాము. మనమెప్పుడైతే ఖండితమైనామో ఇతరులను వేర్పాటుతో చూస్తాము. మనం సర్వం అయితే, మన హృదయంలో దేవుని, ఇతరుల హృదయాలలో దేవుని చూస్తాం.

Sunday, December 5, 2021

Eknath Eswaran Bhagavat Gita Translation to Telugu Running Links

Click Here to Go To Complete 3 Volumes Of Prof. Eknath Easwaran's Gita Translation

Sep, 2021

https://gandikotam.blogspot.com/2021/09/ekanath-chapter-13-sloka-1.html

Oct, 2021

https://gandikotam.blogspot.com/2021/10/ekanath-chapter-13-sloka-2.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-3.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-4.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-5.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-6.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-7.html https://gandikotam.blogspot.com/2021/10/eknath-chapter-13-sloka-8.html

Nov, 2021

https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-9.html https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-10.html https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-11.html https://gandikotam.blogspot.com/2021/11/eknath-chapter-13-sloka-12.html

Dec,2021

https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-13.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-14.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-15.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-16.html https://gandikotam.blogspot.com/2021/12/eknath-chapter-13-sloka-17.html

Jan, 2022

18. https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-18.html 19. https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-19.html 20. 21.https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-20.html https://gandikotam.blogspot.com/2022/01/eknath-chapter-13-sloka-21.html

Chapter 14

Jan, 2022

22. https://gandikotam.blogspot.com/2022/01/eknath-gita-chapter-14-sloka-1.html

Feb, 2022

23. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-2.html 24. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-3.html 25. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-4.html 26. https://gandikotam.blogspot.com/2022/02/eknath-gita-chapter-14-sloka-5.html

March, 2022

27. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-6.html 28. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-7.html 29. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-8.html 30. https://gandikotam.blogspot.com/2022/03/eknath-gita-chapter-14-sloka-9.html

Saturday, December 4, 2021

Eknath Chapter 13 Sloka 13

13.13

అవిభక్తం చ్ భూతేషు విభక్త మివ చ స్థితం

భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ

అవిభక్తమైనను ప్రాణుల యందు విభక్తమై యున్నట్లు తెలియుచున్నది. ప్రాణులను సృష్టించునది , భరించునది, లయింపజేయునది అదియే.

జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పర ముచ్యతే

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం

అది జ్యోతులకు జ్యోతియై ఉన్నది. తనస్సునకు అన్యమైనది. అది జ్ఞానముగను, జ్ఞేయముగను, జ్ఞానగమ్యముగను భాసించుచున్నది. సకల ప్రాణుల హృదయాలలో ప్రకాశించు చున్నది

గీత పదే పదే ఆత్మ ప్రకాశమని, మూలమని చెప్పుచున్నది. అది ఒక ఉపమానము మాత్రమే కాదు. గాఢ ధ్యానంలో అది అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం వచ్చేవరకు ఆ పదాలను అర్థం చేసుకోవడం కష్టం.

ఆత్మ జ్ఞానం వచ్చేవరకు మనము చీకట్లో బ్రతుకుతున్నాము -- నిజంగా నేను శరీరమను భావంతో -- అని బుద్ధుడు వచించవచ్చు. ఇది మంచి శాస్త్ర జ్ఞానము. భౌతికంగా కూడా నిద్రలో వచ్చే కలలో అనుభవం, వేకువలో వచ్చే మాయా సంభంద కలలకు పెద్ద తేడా లేదు. జీవితమంతా మనము నిద్రలో నడుస్తున్నామని బుద్ధుడు చెప్ప వచ్చు. సూచనల ప్రకారం వెళ్ళి వచ్చి, మన వాటా చదివి, మన క్రియలను చేతన మనస్సుతో తెలిసికొనలేక, ఒక కలగంటున్న వాడికన్నా వేరుగా లేక ఉన్నాము.

"అర్థరహితము. నేను చూడలేనా ? వినలేనా? సూర్యుడు ప్రకాశించుచున్నాడు, పక్షులు కిలకిల మంటున్నాయి, ఇంటి ప్రక్క వారు వాదించుకుంటున్నారు. ఇవన్నీ నిద్రలో నాకు తెలీకుండా జరుగుతున్నాయి" అని చెప్దామనుకుంటాము. ఒక నిద్రిస్తున్న వ్యక్తి అలా అనలేడా? మనము వినడం చెవులతో కాక, చూడడం కళ్ళతో కాక వాటిని మనస్సుతో చేస్తాము. మనము నిద్రిస్తున్నంతసేపూ మనము కలలో విన్నవి, కన్నవి నిజం. ఒక కుక్క కలగంటునప్పుడు చూడ౦డి. దాని చెవులు, మూతి కదులుతాయి. అది దాని మనస్సులోని గత స్మృతులతో చేసిన ఒక పిల్లి గురించి కల గంటూ నిద్రలో రమిస్తున్నాది. నా కుక్క మూకా సముద్రపు ఒడ్డున పరిగెత్తుతున్నట్టు కల గంటుంది. ఎలా చెప్పగలనంటే నిద్రలో దాని కాళ్ళు ముందూ వెనుకకూ కదులుతూ ఉంటాయి. మీరు నిద్రలో ఎవరో చంపడానికి వస్తున్నారని కలగంటే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేహంలో రసాయనిక మార్పులు జరుగుతాయి. ఇదంతా మనం ప్రాణభయం నిజమనుకోవడమువల్ల.

మీరనవచ్చు: "అది సరే, కలలో జరిగే సంఘటలను ఒక క్రమంలో చూడు. ఒక నిమిషం నువ్వు 5 ఏళ్ల బాలుడివై కెనడా లో రైలులో ప్రయాణిస్తూ ఉంటావు. మరు నిమిషం నువ్వు డెడ్ సీ లో బోటు షికారు చేస్తూ ఉంటావు. కలలో ఎటువంటి తర్కము లేదు. నీ ఆధీనంలో ఏమీ లేదు."

మనం చేతనముతో అనుభవించే ప్రపంచం నిజమా? ఒక నిమిషం మీరు మిత్రురాలితో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. మరునిమిషం ఆమె ఏదో వెటకారం చేసిందని గట్టిగా గొడవపెట్టుకుంటారు. పనిచేసే చోట మర్యాదగా ఉంటారు. కానీ ఇంటికొస్తే వేరే రూపం మీ భార్యా పిల్లలకు చూపిస్తారు. మనకందరికి ఇటువంటి ఆశ్చర్యకరమైన నడవడిక తెలిసిందే. దయగల బుద్ధుడు "చేతనుడైన వానికి ఈ ప్రవర్తన కలకంటే వేరు కాదు" అనవచ్చు. వేకువలోనూ , నిద్రలోనూ మనం ఒకే మనస్సుతో, సంస్కారాలతో అనుభవిస్తాము. మన స్పందన వేకువలోనూ నిద్రలోనూ ఒకే రకంగా ఉంటుంది. అవి చేతన మనస్సుతో కప్పబడి ఉంటాయి.

మనం మెలుకువగా ఉన్నామని నిరూపించడానికి, బుద్ధుడు ఇలా చెప్పవచ్చు: మన దృష్టిని సులభంగా మనం తలచిన దానిపై చూపవచ్చు. అది కొందరికి సులభాతి సులభం. మరికొందరికి దానంత కష్టం ప్రపంచంలో మరేదీ లేదు.

మీరు మీ గదిలో రేపు ఇవ్వవలసిన నివేదిక పై మనస్సును కేంద్రీకరించేరనుకో౦డి . ఒకానొక పదం మీ కాలేజీ రోజులను గుర్తు చేస్తుందనుకో౦డి. మరుక్షణం మీ గదిలోనించి వెలుపలకు వెళ్తారు. మీ కళ్ళు గోడ మీద వ్రేలాడుతున్న చిత్రం చూడవు. మీ చెవులు బయట జరుగుతున్న వివాదం వినవు. మీరు బెర్క్ లీ కి తిరిగి వచ్చేరు. అర్థరాత్రి వీధుల్లో అనుమానాస్పద స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. ఇది మనందరికీ అనుభవం లోకి పలు మార్లు వస్తుంది. మన మనస్సు అంగీకరిస్తే మనం మన గదికి తిరిగి వచ్చేయ వచ్చు. కానీ కొందరికి అది సాధ్యం కాదు. వాళ్ళు మనస్సులో గిరికీలు కొడుతూ ఉంటారు. పాత స్మృతులు పునరావృతమవుతుంటాయి. వాళ్ళు గతంలోనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు తమ ఆలోచనలకి నిబద్ధులు. వాళ్ళ స్మృతులు వాళ్ళని అణగదొక్కుతాయి. బుద్ధుడు అలాంటి వాళ్ళు నిద్రలో ఉన్నారని అంటాడు. వాళ్ళు వేకువలో కలలుగంటున్నారు.

నేను ఒక అతిశయమైన ఉదాహరణను ఇచ్చేను. కానీ దాన్నే పరధ్యానం అంటాను. మన మనస్సు ఒక సంఘటన నుంచి వేరొకటికి, ఒక స్మృతి నుంచి వేరొకటికి, ఒక కోరిక నుంచి మరొకటికి, మారుతూ ఉంటే మీరంటారు "ఇది నిజం. ఇది ఆలోచనల గొలుసు." బుద్ధుడు "నువ్వు నిద్రపోయి ఉన్నావు. నువ్వు ఒకదాని నుంచి ఉంకోదానికి కలలోలాగ మారుతున్నావు. నిద్రలోని కలలతో పోలిస్తే మెలకువలో నీ ఆలోచనలను ప్రకటించ గలవు మరియు స్వశక్తిప్రేరిత సమాధానాలను ఇవ్వగలవు. "ఇవి స్వల్పమైన తేడాలు కాదు. అవి పరిమాణంలో తేడా. జాతిలో తేడా లేదు. మీరు మెలకువగా -- బుద్ధుడులా-- ఉన్నారని నిరూపించడానికి మీ కార్ అనబడే మనస్సును ఉంకో కారుతో ఢీ కొట్టకుండా తిన్నగా నడిపి, మీరనుకొన్న గమ్యాన్ని చేరగలగాలి.

దీనికి ఎన్నో పర్యావసానాలున్నాయి. మీరు ఒకే గాడిలో కార్ నడుపుతూ ఉంటే కోపం రాదు. కోపం రావాలంటే మనస్సు గాడి తప్పాలి. దురాశ లేదా అసూయ రావాలంటే మీరు గాడి తప్పాలి. ఇది మానవ నైజం. మీరు కలలో తప్పు చేస్తే దానికి ఎవరు బాధ్యులు? అవి కలలోని మనుష్యులతో చేసే కలలోని తప్పులు. అవి మనస్సు చేసిన సృష్టి. అలాగే కొంతమందికి తమ ఆలోచనా క్రమమును స్వాధీనంలో పెట్టుకొనకపోతే వాళ్ళను దూషించడం అన్యాయము కాదా? వాళ్ళని నిందించడం నిర్దయత్వం కాదా? వాళ్ళ కారును నడపడం నేర్చుకోలేదు.

కొంతమంది, నన్ను గౌరవించి మెచ్చు కొనేవాళ్ళు, మనము వేకువలో నిద్ర పోతున్నామని చెప్పినందుకు, అది తమ మీద వేసిన నిందని, నా మీద కోపగించుకొన్నారు. "మీరు మాతో నవ్వుతూ ఉంటారు. వెంటనే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. అది నా గుండెలోకి బాణం వేసినట్టు ఉంటుంది" అని ఒక మంచి మిత్రుడు అన్నాడు.

చాలా మటుకు లైంగిక కార్యాల వల్లే. వాటికై మనుష్య జాతి చాలా నిహితమైన ఇష్టం ఉండి తమ శరీరాన్ని ఇతరులతో పోల్చుకొంటారు. "ఇది నాకు శిఖరాగ్రాము చేరినంత నిజం. లైంగిక కార్యం నిజం కాకపోతే మరేది నిజం?" అని ఆ మిత్రుడు అన్నాడు. "నీకు లైంగిక సంబంధమైన కలలు వస్తాయా?" అని అడిగేను.

"తప్పక"

"నీవు వాటివల్ల ఆనందం పొందుతావా?"

"తప్పకుండా"

"మెలకువలో వాటి అనుభవం ఉందా?"

నేను వేరే ఏమీ చెప్పక్కరలేదు. నేను వేసిన బాణం తిన్నగా వాని గుండెకు తగిలింది. ఒక తెలివైనవాడికి ఇంద్రియ సంబంధిత విషయాలు శాశ్వతము, నిజం కావు అని చెప్పినపుడు అర్థం అవుతుంది. కొంత కాలం తరువాత హేవ్ లాక్ ఎల్లిస్ అనే మానసికవేత్త వ్రాసినది చదివేను. ఆయన తన జీవితకాలమంతా మానవ లైంగికం మీద అధ్యయనం చేసేడు. "కలలు కల కంటున్నoత సేపూ అవి నిజం. జీవితం గురించి ఇంకా ఎక్కువగా వేరే మాట చెప్ప గలమా?" అని అతను వ్రాసేడు.

మన శరీరం పడుకున్నంత సేపూ మన వేకువతో పోలిస్తే సమమైన కలలు కంటాము. మన ఇంద్రియాలు, శరీరంలోని రసాయనాలు కూడా మనకు ఆ అనభావాన్ని ఇస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది. భౌతిక ఎరుక లేకపోయినా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మన ఉనికి ఉంటూనే ఉంటుంది. దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే భౌతికమైన ఎరుక జీవించడానికి అవసరం లేదు.

గీత భౌతికమైన జీవితం వ్యర్థమనటంలేదు. చేతనం అన్నటికన్నా ముఖ్యం కాదు అని చెప్తుంది. ఏవో రెండు డబ్బులు సంపాదించి, భోజనం చేసినంత మాత్రాన మీరు మెలకువగా ఉన్నానని చెప్పలేరు. కలల్లో లాగ ఈ అప్రయత్న కార్యం జరుగుతోంది.

ఆ స్థితిలో ఇంద్రియ సుఖం ఆయస్కాంతంలా పనిచేస్తుంది. అవి మనని లాగితే చాలు వాటివద్దకు వెళతాం. కలలను నియంత్రించడం మన చేతిలో లేదు. అవి మన మాటలు, చేష్టలు, సంస్కారముల వల్ల జనించినవి. ఎక్కువ మార్లు మెలకువలో అదే మనం చేసేది. కానీ ఒక తేడా ఉంది: మెలకువలో ఒక కార్యం చేయాలా వద్దా అని నిర్ణయించకోగలం. ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసికొని ఒక కార్యాన్ని ఎన్నుకుంటామో, ఇంద్రియాలు వెనుకకు లాగకపోతే, మనం మేలుకొంటాం. అప్పుడు వచ్చే ఆనందం నేను మాటల్లో చెప్పలేను. మీరు ఎల్లపుడూ మేల్కొనే ఉంటారు. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందక వాటిని కావలసినప్పుడు నియంత్రించి లేదా అనాలోచితంగా వాటితో ఒప్పుకొని జీవనం కొనసాగిస్తారు .

ధ్యానం చాలకాలం నుండి చేయక ఇప్పుడే మొదలపెడితే, అనాలోచింతగా చేయలేరు. పట్టుదలతో ఇలా వద్దు అని చెప్పగలగాలి. కానీ మనస్సు చంచలం. కొన్నాళ్ళకు దానికి ఊపిరి పీల్చుకొన్నట్టు, కాళ్లతో నడిచినట్లు అప్రయత్నంగా అలవాటైపోతుంది. సెయింట్ అగస్టీన్ అన్నారు: "నా చెయ్యి నే చెప్పే మాట వింటుంది. మనస్సు ఎందుకు వినదు?" మనం బాల్యంలో అనేక మార్లు చేతులతో పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసి మన చేతుల్ని మన ఆధీనంలో పెట్టుకున్నాము. అలాగే మన మనస్సుని కూడా మచ్చిక చేసుకొని మనం చెప్పే మాటను మనోహరంగాను, అనుకూలంగాను వినేటట్లు చేసికోవాలి. ఈ స్వతంత్రం మన వేకువ అవస్థకి నిదర్శనం. వేకువగా ఉండడం వల్ల మనం కోల్పోయేది బానిసత్వం మాత్రమే. 90

Saturday, November 27, 2021

Eknath Chapter 13 Sloka 12

13.12

సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖ్యం

సర్వత శృతిముల్లోకే సర్వమావ్ఱుత్య తిష్టతి

ఆ ఆత్మ స్వరూపము యొక్క కాళ్ళు అంతటను గలవు. చేతులు అన్ని చోట్ల కలవు. నేత్రములు సర్వత్ర గలవు, శిరములు ముఖములు, చెవులు అంతట కలవు. అది సర్వత్ర వ్యాపించి యున్నది

సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం

అసక్తం సర్వభృచ్ఛఐవ నిర్గుణం గుణభోక్తృ చ

ఇంద్రియములు లేనిదియై యున్నది. దేనితోను సంగత్వము లేనిదియై సకలమును భరించుచున్నది. గుణరహితమయ్యును గుణములను అనుభవించుచున్నది

బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వా త్తదవిజ్ఞేయం దూరస్థo చాంతికే చ తత్

ప్రాణులు బాహ్యాభ్యoతరముల యందున్నది. చలించునది, చలించనిది యైయున్నది. సూక్ష్మమైనందున అగ్రాహ్యమై యున్నది . అది దూరముగను , దగ్గరగను యున్నది

నా పెంపుడు కుక్కలు నన్ను చూడడానికి, బిస్కట్ ముక్కల కోసం ప్రతి ఉదయం నా గది తలుపు దగ్గర కూర్చుంటాయి. నేను ధ్యానం నుంచి వచ్చేక వాటిని కుక్కలుగా చూడను. భగవంతుడు కుక్క వేషంలో వచ్చేడని తలుస్తాను. నా స్వానుభవాన్ని చేతనయింత వరకు వివరిస్తున్నాను. ఇది ఒక ఉపమానము కాదు. నేను నా దృష్టికి కలిగిన అనుభవాన్ని చెపుతున్నాను. అవి కర్ర ముక్కతో ఆడుకొంటూ ఉంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ఆడుకొంటున్నాడు అని తలుస్తాను. అది ఆయన లీలతో పోలిస్తే అతి తక్కువే. ఈ సృష్టి అంతా దేవుడు ఆడుకునే రంగస్థలం. ఆయన అన్ని పాత్రలను పోషిస్తాడు: నా కుక్కలు కర్ర ముక్క తో ఆడుకొంటున్నట్టుగా, నా ఇంటి ప్రక్క వారి పిల్లలు వాటి వైపు కర్ర ముక్కను విసురుతున్నట్టుగా. ఆ పాత్రలకు వేరువేరు లక్ష్యాలు ఉన్నాయి. వసంత ఋతువులో వికసించే లైలెక్ పువ్వులు నా కిటికీ దగ్గర ఉన్నాయి. యోగులు "చుట్టూ చూడు. ప్రపంచమంతటా దేవుడున్నాడు" అంటారు.

ఈ దృష్టితో చూస్తే కాంతి వైపు పెరిగే మొక్కల్లాగ, ప్రాణులు పరిణామ క్రమములో దేవునివైపు వృద్ధి చెందుతున్నారు. ఈ ప్రపంచమంతా సూర్య కాంతి వైపు వంగే మొక్కల్లాగ, భగవంతుడి వైపు వంగే జీవులతో నిండి ఉన్నది. నా కుక్క మూకా నా ధ్యానం అయిన తరువాత నాతో మనిషి చేసే శబ్దాలతో మాట్లాడుతుంది. ఉదాహరణకు ఓం . అది నాతో "నేనూ నీలాగా మనిషిగా ఉండాలని ఎంతో కోరుకుంటున్నాను" అంటునట్టు ఉంటుంది. నేను ధ్యానం చేస్తే దానికీ అదే చేయాలని ఉంటుంది. ఇదే పరిణామానికి ఉన్న శక్తి. మూక తన లక్ష్యం చేరడానికి, పరిణామం చెందడానికి ఆ శక్తి సహకరిస్తుంది. అటువంటి ఐక్య కోరికతో నాకు మూకా మరుజన్మలో ఒక ఆశ్రమంలో మనిషిగా పుడుతుందని అనిపిస్తుంది. దేవుని వైపు ఈ విధంగా జీవులన్నీ నడుస్తున్నాయి.

అటువంటి దృష్టి దేవుని కృప వల్లే సాధ్యం. శ్రీ రామకృష్ణులు చెప్పినట్లు "దేవ మాత బ్రయన్ (అనబడే వ్యక్తి) కి అట్టి దృష్టి ఇవ్వాలి". ఆమే తన అందమైన కళ్ళతో క్రీగంటగా చూసి వానికి ప్రపంచ సుఖములుకన్న హృదయంలో దేవునికొరకై మిక్కిలి తపన కలిగిస్తుంది. మన అందరి హృదయాల్లో అటువంటి కోరిక గుప్తంగా వసంత ఋతువు కై వేచి వున్న విత్తులా ఉంది. ఆ తరువాత బ్రయన్ స్వార్థ పూరిత క్రియలు చేసినా, లేదా ఏమాత్రం జంకి వెనకంజ వేసినా ఆమె శక్తి ముందుకు లాగుతుంది. ఎలాగంటే వాని కోర్కెను ప్రజ్వలింప జేసి, లేదా లక్ష్యాన్ని గుర్తు చేసే కష్టాలు ఇస్తుంది. ఇటువంటి దృష్టిని కలిగినవారు ఆ పరాశక్తి ఉందని చెప్తారు. ఎవరైతే మనసా వాచా కర్మా ఆ పరాశక్తికై తపిస్తారో వాళ్ళు దాన్నే పొందుతారు. 86

Sunday, November 21, 2021

Eknath Chapter 13 Sloka 11

13.10

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృత మశ్నుతే

అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాస దుచ్యతే

దేనిని తెలుసుకొనుటవలన మోక్షము కలుగునో ఏది ఆదిలేని పరబ్రహ్మమో, దేనిని సత్తనిగాని, అసత్తని చెప్పలేమో అటువంటి జ్ఞేయమును చెప్పుచున్నాను

ఆధ్యాత్మిక చింతనాలక్ష్యం మరణించిన పిదప ఏమౌతుందో విశ్లేషించడం. అది చేయటం సాధ్యం. అది చేయ బడినది. ఎలా అంటే ఉనికిని శరీరముతో విడదీసి.

కఠ ఉపనిషత్ లో నాచికేతుడు యమధర్మరాజును ఒక ప్రశ్నని అడిగేడు. ఈ ప్రశ్నని ఎప్పుడో ఒకప్పుడు మనమూ అడిగే ఉంటాము. ఒక మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నాచికేతుడు "కొందరంటారు మరణించినవాడు ఎక్కడో బ్రతికి ఉంటాడు. ఇంకొందరు అతడు మాయ మౌతాడు అంటారు. అక్కడితో పరిసమాప్తం. ఓ ధర్మరాజా నాకు విడమరచి చెప్పు. నేనిది తప్పక తెలుసుకోవాలి." అని అడిగేడు.

నాకు ముగ్గురు మిత్రులు ఉన్నారు. వారు జియో డెసిక్ డోం (Geodesic Dome) అనబడే ఇంట్లో ఉంటారు. ఇది భూగోళం చుట్టూ ఉన్న వాయువుకు (Atmosphere) నిదర్శనం. వాళ్ళు రోజూ పనికి వెళతారు. సాయంత్రం డోం కి తిరిగి వస్తారు. ఒకరోజు వాళ్ళు ఇంటినుండి బయటకు వెళ్లకూడదని నిర్ణయించేరని అనుకుందాం. ఏవరో వాళ్ళకి కావలిసిన సరుకులు తెచ్చి, వాళ్ళ చెత్తని ఊడుస్తారు అనుకుందాం. వాళ్ళు దానికి అలవాటుపడిపోతారు. కొన్నాళ్ళకు వాళ్ళు బయట ప్రపంచాన్ని మరచిపోతారు. వాళ్ళ కార్లను, కార్ నడపడం మరచిపోతారు. బయట ఉన్న ప్రదేశం, పైన్ వృక్షాల గురించి కూడా వాళ్ళ స్మృతి కిరావు. వాళ్ళ ధ్యాస ఎప్పుడూ ఇంటి గురించే. వాళ్ళ పుస్తకాలకు, పాత పత్రికలకు, ఫోటో లకు, రోజూ వారి పత్రికలకు అంకితమైపోతారు. వాళ్ళ నీళ్ళ గొట్టాలు నీరు కారుతున్నా పట్టించుకోరు. మీద తిరుగుతున్న సాలీడులను చూడరు. వాళ్ళని సాన్ ఫ్రాన్ సిస్కో గురించి అడిగితే తెలీదంటారు. ఆ పట్టణం ఒక కలలా ఉంటుంది. "నాకు తెలీదు" అంటారు. చివరకి "ఏ పట్టణం లేదు. సాన్ ఫ్రాన్ సిస్కో నిజానికి లేదు. బయట ప్రపంచం ఉందని చెప్పటానికి ఆధారమేమిటి?" అని పైపెచ్చు అడుగుతారు.

మనమెక్కడి నుంచి వచ్చేమో మరచిపోయామా? మనమందరము వసుదైక కుటుంబమని, ఒకే భగవంతుని బిడ్డలమని మరచేమా? మనం భగవంతుని దగ్గిరకి తిరిగివెళ్ళ వలసిన వారలమని మారిచిపోయామా? మనం ప్రపంచ ధ్యాసలో పడిపోయేం. యుగయుగాలుగా ఈ ప్రపంచంలో ఎన్నో జన్మలెత్తి స్వార్థ పూరిత నడవడికతో, మన వేర్పాటుతో, మనకదేమి గుర్తుకు రావటంలేదు. నిజానికి దాన్ని మనం ఖండిస్తాము. జీవులపై పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు నాచికేతుని ప్రశ్నకు ఇలా సమాధానమిస్తారు: "మనిషి మరణించిన తరువాత వాని జీవితం పరిసమాప్తమైపోయింది. అదే చివరి జన్మ." యమధర్మరాజు దానికి ఒప్పుకోడు. నా మిత్రులు బయట ప్రపంచముందని ఆధారం ఏమిటంటే నేను "మీ డోం తలుపులు తెరవండి. బయటకు వెళ్ళి చుట్టూ చూడండి. నాకు మీరు చూసిందేమిటో చెప్పండి" అంటాను. "నేను తలుపులు తియ్యను. ఎందుకు తీయాలి? బయట ఏమీ లేదు" అని అనవచ్చు. వాళ్ళు బయటకే వెళితే మళ్ళీ ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. మనము ధ్యానముతో మన అహంకార పూరిత వ్యక్తిత్వం వదులుకుంటే, మనమేవరో తెలుసుకొంటాము. మనం శాశ్వతమైన, మరణములేని తాత్వికత అనబడే భగవంతుని గుర్తు తెచ్చుకుంటాము.

Saturday, November 13, 2021

Eknath Chapter 13 Sloka 10

13.9

మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ

వివిక్త దేశ సేవిత్వం అరతి ర్జనసంసది

నాయందు అనన్యమైన అచంచల భక్తిని కలిగియుండుట , ఏకాంతవాసము చేయుట, జనసమూహమునందు ప్రీతి లేకుండుట మరియు

ఆధ్యాత్మ జ్ఞానవిత్యత్వం తత్త్వ జ్ఞానార్థదర్శనం

ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా

ఆత్మ జ్ఞానము నందు స్థిరత్వము, తత్త్వజ్ఞానము కొరకు శాస్త్రావలోకనము ఇది అంతయు జ్ఞానమని చెప్పబడినది. దీని కంటెను అన్యమైన దంతయు అజ్ఞానము

ముందు చెప్పిన శ్లోకాలు వలె ఇక్కడ కూడా వైరాగ్యం పొందే పద్దతి, దాని గమ్యం చెప్పబడుచున్నది.

మన మెప్పుడైతే అనుభవంతో భగవంతుడు మనయందే ఉన్నాడని తెలుసుకొంటామో, తక్కినదంతా అస్థిరముగా చూస్తాము. మనము భూమి మీద సేవ కోసం ఉన్నాము. ఏ శక్తీ మనను స్వార్థపూరితమైన బంధం వైపు ఆకర్షింపలేదు. కొందరు నన్నడిగే వారు: "మీరు దేనికైనా ఆకర్షింపబడతారా?" నా సమాధానము "ఎవరి ద్వారా?". మన ప్రతి అణువులోనూ అపరిమిత ఆనందం ఉన్నప్పుడు, చాకలేట్ ట్రఫుల్ మీద మనస్సు ఎందుకు పోతుంది? నాకు ట్రఫుల్ అంటే ఇష్టం లేక కాదు. ఆత్మ జ్ఞానం వల్ల కలిగే ఆనందంతో పోలిస్తే ఇంద్రియముల ద్వారా వచ్చే సుఖం దిగతుడుపే.

ఇది సమాధి వలన పొందే ఫలం. సాధన మార్గము అనేకమైన విఘ్నములతో కూడినది. మనము సాధనలో ముందుకెళుతున్న కొద్దీ అవి తగ్గు తాయి. కాని అవి మన సాధనికి అంతరాయం ఎందుకంటే మనలోని ఘనీభవించిన కోరికలు. మనము ఆత్మ జ్ఞానం పొందుటకు విపరీతమైన కృషి చేయాలి. అదే మన లక్ష్యం. వ్యక్తిత్వం సాధనతో మార్చు కోవడం చాలా కష్టం. అందుకే సాధనని చిన్న చూపు చూసి, మిగతా వాటికి పెద్ద పీఠం వేయకూడదు.

అలాగని మనం వేరే క్రియలు చేయరాదని నిషేధం లేదు. సంస్కృతంలో భూగోళం ని కర్మ భూమి అంటారు. కర్మ అంటే క్రియ. భూమి క్రియలతో నిండినది. క్రియలు చేసే ప్రపంచం కర్మ ప్రపంచం. ఇతరులతో సామరస్యంగా పనిచేయడం ఆధ్యాత్మిక జీవనానికి చాలా ముఖ్యం. అది ఒక విధంగా తప్పనిసరి. మనం మనకన్నా వేరైన వారితో జీవిస్తూ పనిచేస్తూ ఉండకపోతే మనం ఏ విధంగా పాత కష్టాలు, తప్పులు సరి దిద్దుకొంటాం? మనం జీవితంలో ఉత్సాహంగా లేకపోతే -- ముఖ్యంగా కష్టాలెదురైనప్పుడు -- మనకు ధైర్యముతో, ఓర్పుతో, దయతో, గౌరవముతో కష్టాలని అధిగమించడం ఎలా సాధ్యం? వీటన్నిటికీ మూలం దేవుడు సర్వ జీవులలో ఉన్నాడనే జ్ఞానం. అదే భూమిమీద పుట్టినందుకు కారణం.

మొదట్లో సాధన ప్రారంభించినపుడు మన రోజూవారీ చేసే క్రియలనుండి మార్పు తప్పదు. పాత మిత్రులు మన నూతన స్వభావమువల్ల దూరమౌతారు. ఒకరు సోమర్ సెట్ మౌమ్ ని ఇలా అడిగేరు: "పాత మిత్రలను మారిచిపోవాలా?" ఆమె నిర్లిప్తంగా "కొన్నిసార్లు తప్పదు" అని సమాధానం ఇచ్చేరు. జీవితాన్ని పునరుద్దరించడానికి మన పాత మిత్రులను, జీవన శైలిని మార్చుకోవాలి. మొదట్లో ఇది బాధాకరంగా ఉంటుంది. రాను రాను మనం పాత మిత్రులను కలిసినపుడు గ్రుడ్డివాడికి గ్రుడ్డివాడు దారి చూపిస్తున్నట్టు లా కాక, మనం వాళ్ళ హృదయాలలో వెలుగు నింపుతాము.

భారతదేశంలో గుర్రం బగ్గీలు ఇంకా వాడకంలో ఉన్నాయి. వాటిని నడిపేవాడు గుర్రం జన సమూహాన్నిగాని, ఇతర వాహనాలను గానీ చూసి బెదరకుండా కళ్ళకి గంతలు కడతాడు. అలాగే సాధకులకు కూడా గంతలు ఉన్నాయి. ఒకటి వైరాగ్యం. అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో తాదాత్మ్యం చెందకుండుట. రెండవది వివేకము. అంటే అన్ని క్రియల్లోనూ మాటిమాటికి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం. లక్ష్యం లేక, మన ఇంద్రియాల చెప్పు చేతలలో ఉంటే మనం గంతలు లేని గుర్రాలలాగా చూసే, విన్న వానితో తికమకపడి ఏ దిక్కoటే ఆ దిక్కుకు పోతాం.

సాధకులుగా మనము విప్లవాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ఎంతో శాంతంగా ఉన్న మన మనస్సును ఉసిగొల్పుతాయి. అలాగే ప్రసార మాధ్యాలకు దూరంగా ఉండాలి. ఇది సాధన ఉపక్రమించినప్పుడే కాదు. అన్ని వేళలా. మన పూర్వీకులకు ఈ బెడద ఉండేది కాదు. మనం 21 వ శతాబ్దం వాళ్ళము కాబట్టి వీటిగురించి అప్రమత్తతో ఉండాలి. టివి లోని చిత్రాలు, మాటలు మనను ప్రభావితం చేస్తాయి. అలాగే చలన చిత్రాలు , సినిమా పాటలు కూడా. అవి మనకి తెలియకుండా మన అచేతన మనస్సును ఆక్రమించుకొంటాయి. నేనొక విత్తనాల జాబితాలో ఇలా చూసేను: "మా విత్తనాలు తప్పకుండా పెరుగుతాయి." ప్రసార మాధ్యాల విత్తనాలు కూడా తప్పక పెరుగుతాయి. మనము ఇది ధ్యానం మొదలెట్టిన చాలా కాలం అయినప్పుడు -- ఎప్పుడైతే మనం స్పృహ లేక చుట్టూ చూస్తున్నప్పుడు-- తెలుస్తుంది. ప్రసార మాధ్యమనే కలుపు మొక్కలను వేళ్ళతో పెకళించాలి. అది మనమనుకొంటున్నంత సులభము కాదు.

నేను సాధన గూర్చి భారతదేశంలో చూసిన రైలు బండ్లను ఉపమానముగా తీసికొని చెప్తాను. మనం ధ్యానం మొదట్లో ప్యాసింజర్ బండిలా అనగా నెమ్మదిగా ఉంటాము. మనము మద్రాసు స్టేషన్ నుంచి బయలదేరేము. మన గమ్యం 2 వేల మైళ్ళు దూరం ఉన్న హిమాలయాలు. ప్యాసింజర్ రైలు ప్రతీ స్టేషన్ లోనూ ఆగాలి. అనేకమైన ఎక్కి దిగే ప్రయాణీకులు ఉంటారు. దానికి తోడు తినుబండారాలు అమ్మేవాళ్ళూ ఉంటారు. అలాగే కొందరు సాధకులు అన్ని బాధ్యతలను నిర్వహించేక ధ్యానం మొదలపెడదామని అనుకొంటారు. అలాంటివాళ్ళు ప్యాసింజర్ బండిలో ప్రయాణీకుల్లా ప్రతి స్టేషన్ లో దిగి, చుట్టూ చూసి మళ్ళీ బండి ఎక్కుతారు. సూర్యాస్త సమయంలో ఎక్కడో పల్లెటూరు స్టేషన్ లోనే తమ గమ్యానికి వందల మైళ్ళ దూరంలో ఉంటారు. చీకటి పడ్డాక, ఇక వాళ్ళు గమ్యం చేరినట్టే !

ప్యాసింజర్ రైలు లాగా, అలాంటి సాధకుడు తన గమ్యాన్ని ఎప్పుడో ఒక రోజు చేరుకొంటాడు. కానీ దానికి ఎన్నో జన్మలు ఎత్త వలసి ఉంటుంది. మనం బండిలా పట్టాల మీద ఉండి ముందుకు దూసుకుపోతున్నా ఎంతో దూరం వెళ్ళ వలసి ఉంది. ప్రయాణం చివరలో ఎంతో నిటారుగా ఉన్న కొండనెక్కాలి. ఇలాంటి పరిస్థితిలో ఒక మనిషికి ప్రతి వీధిని చూసి గమ్యం చేరుకోడానికి కావలసిన ఇంధనం ఒక జీవిత కాలంలో ఉండదు. మనకి వెయ్యేళ్ళు ఆయుష్షు ఉంటే అది సాధ్యమేమో. మనం జీవితాన్ని ఆటగా చేసికొని ప్రతి చిన్న విషయాన్ని అనుభవించవచ్చు. అలా చేసినా మన గమ్యం చేరుకోవచ్చు. కానీ వంద ఏళ్ళు ఆయుష్షు సరిపోదు. వృద్దాప్యం, బాల్యం ల వల్ల పూర్తిగా వంద ఏళ్ళు కూడా లేవు. మనకు రోడ్ల ప్రక్కన జరుగుతున్న జంతర్ మంతర్ చూడడానికి సమయం లేదు. టిబెట్ వాస్తవ్యుడు మిలెరెప ఇలా అన్నారు: "ప్రపంచ విషయాలు అలా ఉంటూనే ఉంటాయి. ధ్యానం మొదలు పెట్టడానికి ఆలస్యం చేయద్దు."

ఇప్పుడు ఎక్స్ ప్రెస్ బండి పరిస్థితి చూద్దాం. నేను భారతదేశంలో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ ఉదయాన్నే మద్రాసు స్టేషన్ నుంచి వెయ్యి మైళ్ళ దూరాన దేశం నడుమనున్న నాగ్ పూర్ పట్టణానికి వెళ్ళేది. అది ముఖ్యమైన స్టేషన్ లలోనే ఆగేది. ఆ రోజుల్లో హిమాలయ అంచుల్లో ఉన్న సిమ్లాకి ప్రయాణమైన వాళ్ళు మద్రాసు నుంచి ఎక్స్ ప్రెస్ బళ్ళు ఎక్కి రెండు మూడు రోజుల్లో గమ్యం చేరేవారు. ఇది రెండవ కోవకు చెందిన సాధకునికి ఉపమానము. మనందరికీ అట్టి సామర్థ్యం ఉంది. అటువంటి సాధకుడు జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అతని స్వంత ఊరిలో అతని ఆగడాల గురించి ఇంకా చెప్పుకునే వారు వుండవచ్చు. అయినప్పటికీ అతను ధ్యానం, ఆధ్యాత్మిక కార్యాలు సహృదయంగా చేస్తే రామ బాణంలా ముందుకు సాగుతాడు. 83

Sunday, November 7, 2021

Eknath Chapter 13 Sloka 9

13.8

ఆసక్తి రస భిష్వంగః పుత్రదారగృహాదీషు

నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు

సంగము లేకుండుట , పుత్రుడు, భార్య, ఇల్లు మొదలగు వానియందు అభిమానము లేకుండుట, ఇష్టాయిష్టముల యందు సమ బుద్ధిని కలిగి యుండుట మరియు

మనమమిప్పుడు మన అనుబంధాల గూర్చి తెలుసుకొంటాం. వైరాగ్యం గూర్చి ఈ సంధర్భంలో చెప్పుకొంటాం. దాని నుండి పొందే మంచి గురించి తెలుసుకొంటాం.

ఒకసారి నేను 3 ఏళ్ల మిత్రుని వద్దకు వెళ్లి గౌరవంతో అడిగేను "లోరీ ఎలా ఉన్నావు?"

"నువ్వు నానుండి దూరంగా వుండు. నాకు నిద్ర సరిపోలేదు" అన్నది.

నేను ఆమెతో చాలా ఆప్యాయంగా ఉన్నాను. ఆమె జుట్టుని, దుస్తులని, పొగిడేను. ఆమె ఏమి తిన్నాదో అడిగేను. తెలివైనవాడెవ్వడూ మూడేళ్ళ బిడ్డని ప్రేరేపించడు. నేనేమి అడిగినా దానికి ఆమె తల వూపింది.

మూడేళ్ళ బిడ్డల నడవడిక సరిగ్గా లేకపోతే అది పట్టించుకోవలసిన విషయమేమీ కాదు. ముఖ్యంగా మనని అంకుల్ అనేవాళ్లు. కానీ పెద్దవాళ్ళు ఇలా మాట్లాడితే అది వేరే విషయం. "నేను 4 గంటలే పడుకున్నాను. కాబట్టి ఏమీ మాట్లాడకు" లేదా "నేను ఆకలితో ఉన్నాను. నాకు నా ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. తిన్న తరువాత నాతో మాట్లాడు" అని పెద్దవాళ్ళంటే ఆశ్చర్య పడవలసిన విషయం. కానీ కొన్ని సార్లు మనం ఒప్పుకోకపోయినా అలాగే ప్రవర్తిస్తాం. ఈమధ్య ఒక రాజకీయ తంత్రం గురించి విన్నా. మంచి రాజ భోజనం తిన్న తరువాత మంతనాలు చేయాలట. ఎందుకంటే మద్యం, భోజనం, మన సంభాషణని మెరుగు పరుస్తాయట.

మన మెప్పుడైతే మనస్సు కాదని, కాని దాన్ని నడిపేవారలమని, తెలుసుకొంటామో మన మనస్థితినుండి వైరాగ్యం పొందుతాము. మన మనస్సుకేదైనా అయితే, అది ఒక యంత్రం కాబట్టి, సరి చేసుకోవచ్చు. ఎవరైనా మనన్ని ఖండిస్తే -- నిద్ర సరిపోకపోయినా, తలనొప్పి వున్నా-- మనం కోపం చెందుతాం. కాని అది మన ఇతరులను ప్రేమించే, గౌరవించే వైఖరి మార్చదు. మన సంభందితుల మీద ఆ మంచి ప్రభావం చూడవచ్చు.

మనస్థితుల నుండి విడబడడం నేర్చుకుంటే మనం మనస్సు కాదని భావిస్తాం. అలాగే మనం మన అభిప్రాయాలూ కాము. దీన్నే బుద్ధి అంటారు. అంటే మన ఉన్నతమైన మనోస్థితిని కూడా అధిగమించడం.

మనముండే కాలంలో నకిలీ మేధ(pseudo intellectual) చాలా ఉంది. ఇలాంటి వాతావరణంలో వైరాగ్యం అంత సులభంగా వచ్చేది కాదు. చాలా మంది తమ అభిప్రాయాలతో తాదాత్మ్యం చెందుతారు. విశ్వవిద్యాలయోల్లో కూడా చాలామంది మేధావులు తమ అభిప్రాయాలనుండి విడబడలేక "ఈ అభిప్రాయం అంత మ౦చిది కాదు. దాన్ని మార్చుకొంటాను" అని అనరు. "ఈ అభిప్రాయం అంత మంచిది కాదు" అని అనలేక "ఇది నా అభిప్రాయం. దీన్ని ఎలా మార్చుకొంటాను?" అంటారు. ఈ తర్కం అర్థం కాదు. మనమెప్పుడైతే మనం మేధాశక్తి కామని తెలుసుకొంటామో -- నమ్మడమేకాదు, దాన్ని అనుభవానికి తెచ్చుకొంటామో -- మన ప్రతిపక్ష అభిప్రాయాలను మిక్కిలి ఆసక్తితో, భద్రతతో వింటాము. మనం ఇంకొకరి అభిప్రాయం మన దానికన్నా మంచిదనుకొంటే --మనం మన అభిప్రాయాన్ని 20 ఏళ్ల నుంచి ఉంచుకున్నా -- "ఎక్కడ చెత్త బుట్ట? దానిలో నా అభిప్రాయాన్ని పారేసి, నీ అభిప్రాయాన్ని సమర్థిస్తాను" అనగలగాలి.

ధ్యానంలో ప్రవేశించి కొన్నేళ్ళు అయితే మనస్సుని ఒక పని ముట్టుగా చూస్తాం. అది వాక్యూమ్ క్లీనర్ లాగ పెద్ద శబ్దం చేస్తుంది కాని ఇల్లు శుభ్రం చేస్తుంది. నా చిన్న పిల్లలు వాక్యూమ్ క్లీనర్ వాడుతూ ఉండగా చూసేను. వాళ్ళు ఎలాగో గొట్టాన్ని తిరగామరగా పెట్టి, ఇల్లంతా దుమ్ముతోనూ, కాగితాల తోను చిందరవందర చేసేరు. మనం మనస్సునిలాగే వాడుతాం. మన ఇష్టాయిష్టాలు మన వద్దకు వచ్చిన వారి మీద వెదజల్లుతాం. మనస్సుని సక్రమంగా వాడితే మనం చెత్తని ప్రోగుచేసి బయట పారేస్తాం. ఇదే ధ్యానమంటే: "మనస్సుతో మనస్సుని శుద్ధి చేసుకోవటం. ఇంకోవిధంగా చెప్పాలంటే ఉన్నతమైన మనస్సుతో క్రింద మనస్సుని శుభ్రం చేయడం."

నా స్వీయానుభవముతో, మనస్థితి నుండి , అభిప్రాయాలనుండి విడబడడానికి నేనొక ఒక మంచి ప్రక్రియ చెబుతాను: ఇష్టాయిష్టాలను తక్కువ చేసుకోండి. అవి బాంధవ్యాలు లోనే కాక అన్నిట్లోనూ. హేతుబద్ధం చేయాలంటే, మన ప్రతి ఇష్టం లేదా అయిష్టం అహంకారంకు సంభందించినవి. అది ఈ విధంగా తన తెలివిని ప్రదర్శిస్తుంది.

సాంఖ్యులు మనస్సు ఎలా పనిచేస్తుందన్న విషయం పై చెప్పేది మన అహంకారానికి వర్తిస్తుంది. సంస్కృతంలో చైతన్యాన్ని చిత్తమంటారు. మనం దాన్ని రూపంలేనిది విరగనిది, అఖండమైనది, ఆకారం లేనిది, పరిమాణం లేని బంక మన్నుగా భావించవచ్చు. మనమీ బంకమన్నుని మనం ఏమి ఇష్టపడతామో, ఏ కలలో కంటామో, ఏది ఊహించుకుంటామో దాని కనుగుణంగా చెట్లు, పక్షులు, బొమ్మలు, మనుష్యులు, కోపం, దయ లేదా బాధగా మార్చుకోవచ్చు. అనేకమార్లు పాత ఆలోచనలతో పునరుక్తి చేస్తే మన చిత్తాన్ని మేడమ్ టుస్సాద్ వాక్స్ వస్తుప్రదర్శనశాలగా చేసినవారమవుతాం. మన సంభందితులందరూ మనస్సులో వాళ్ళతో సాంగత్యం బట్టి కొలువై ఉంటారు. తలిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, అత్త జోసీ , మన ఆఫీస్ లోని సహోద్యోగులు, మన పెంపుడు కుక్క. ఒకటేమిటి అన్నీ మన మనస్సులో దాగి ఉన్నాయి. మనం ఊహించుకున్న అత్త జోసీ బాహ్యంగా ఎవరికీ వర్తింపక పోవచ్చు. అత్త జోసీ మనం వేసుకొన్న ఒకానొక చిత్రం. మనమావిడితో తగువు పడితే, మనము మన వస్తుప్రదర్శనశాలకు వెళ్ళి ఒక కోర అంటిస్తాము. "నేను వాళ్ళను ఎలా భావిస్తానో అలాగే చూస్తాను" అని అంటుంది మనస్సు. శ్రీకృష్ణుడు తల అడ్డంగా ఊపి: "నువ్వు వాళ్ళని ఎలా మనస్సులో తయారు చేసేవో అలాగ చూస్తున్నావు" అంటాడు. మనం గ్రహించే ప్రతి విషయం, ప్రతి అనుభవం చిత్తం మీద ఆధారపడే చైతన్యం వల్లనే. అవి మనం జీవితాన్ని ఎలా చూస్తామో నియంత్రిస్తాయి. కాబట్టి అవి మన స్పందనను తమ ఆధీనంలో ఉంచుకొంటాయి.

ఎప్పుడైతే క్రోధం, భయం, దురాశ ఆ బంకమన్నును ధృడమైన ఆకారాలుగా మారుస్తాయో దాన్ని ఖండించడం చాలా కష్టం. "నా తప్పులు నాకు తెలుసు" అని కొందరు జాలిగొలిపేలా అంటారు. "నాకు తెలుసు నాతో సహజీవనం చేయడం మిక్కిలి కష్టం. కానీ నేను మారలేను." ప్రతివొక్కరు ధ్యానంతో మార గలరు. మనము మనుష్యుల మీద చేతనంతో వేసే దృఢమైన బంకమన్నుతో చేసిన శకలాలను మళ్ళీ క్రొత్త, సాగుతూన్న బంకమన్నుగా మార్చవచ్చు. చిత్తాన్ని బంకమన్నులాగా సాగదీయగలం. దాన్ని అలా స్పందింపజేయగలం. మనం దయ, ఓర్పు, సత్సంభందం, ధైర్యం అనే అందమైన క్రొత్త వస్తువులను తయారు చేసుకోగలం. పనితనం మారలేదు. మునుపు వినాశనానికి హేతువైన చేతనం ఉండేది. ఇప్పుడు సృజనాత్మక శక్తితో మనకూ మన తోటివారకూ ఉపయోగపడే ఆకారాల్ని చేస్తున్నాం.

అనేక మానసిక సంక్షోభాలు తుచ్ఛమైన ఇష్టాయిష్టాల వల్ల కలుగుతాయి. వాటిని పెద్దవిగా చూసి: "నాకిది కావాలి. కాని నాకది సాధ్యం కాదు" లేదా "నాకిది నచ్చదు. కాని వొదిలించికోను" అనుకోవడం. కానీ వీటితో సరిపెట్టకోనక్కరలేదు. అదే శ్రీకృష్ణుడు చెప్పిన "సమస్థితి" లోనున్న మనస్సు. మన ఇష్టాయిష్టాలను తక్కువగా చూసుకోవాలి. అలా చేస్తే మన సంబంధాలు మెరుగు పడతాయి.

మనం చేసే ఉద్యోగంలో గాని, లేదా కార్యంలోగాని, అతి సూక్ష్మమైన క్రియలు చేయాలని ఉండదు కానీ చేయక తప్పదు. కోటికి ఒక్కడు "నా ఉద్యోగం నాకు నచ్చదు. కానీ చేయక తప్పదు" అంటాడు. మన అంతర్యామి చెప్పవలసింది ఇంతే: "నేను ఇది చేయలేను. నేను స్టాంపులు నాలుకతో తడిపి పని చేయలేను. ఇంకా మాబెల్ ప్రక్కన నాకు పనిచేయడం ఇష్టంలేదు." మనం "అలాగే, నీ ఇష్టం" అంటాము. అంతర్యామి కాలక్రమేణా పెద్దదై, ధైర్యంతో కూడినది అవుతుంది. ఆ తరువాత అది సంప్రదాయం పాటించదు. అది "మాబెల్ గుర్తుందా?" అంటుంది. మనం "నీ ఇష్టం, పో " అంటాము. చివరకు అది అహంకారపూరితమై "ఇక మర్చిపో" అంటుంది.

మనమిలాగ అంతర్యామిని తన ఇష్టం వచ్చినట్టు ప్రతి ఇష్టాయిష్టాలను ప్రదర్శనీయనిస్తే మనం కఠిన మవుతాము. కొన్ని పరిస్థితుల వల్ల మనం ఇతరులకు తలవొంచితే మన అంతర్యామి నరాల వ్యవస్థను చిందరవందర చేసి "నేను తల వంచను. నేను అఖండమైన ఎముకతో చేయబడ్డాను. నేను వంగలేను" అంటుంది. మొదట్లో ఈ ఆక్షేపణ మనస్సుకే పరిమితం. క్రమంగా మనస్సుకి శరీరానికి లోతుగా ఉన్న సంబంధం వల్ల శరీరం మీద తన ప్రభావం చూపుతుంది. పట్టుదలతో అంతర్యామిని వింటూ ఉన్నవాళ్ళకి అనేకములైన మానసిక, భౌతిక సమస్యలు వస్తాయి. అసహనీయత, తలనొప్పి, మొదలైనవి బాధిస్తాయి. వాళ్ళ అహంకారమునకు వ్యతిరేకంగా వెళితే వాళ్ళు తమ ఇష్టాయిష్టాలను చెప్పుకోలేరు, శ్వాస క్రమం తప్పుతుంది, రక్తపోటు అధికమౌతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. హాన్స్ సెల్యే అనే వైద్యుడు ఇలా చెప్పేరు: "ఒత్తిడి మానసిక వ్యాకులతకు దారి తీస్తుంది". మొదట మనస్సుకు వ్యాపిస్తుంది. మనం దాన్ని గాని నియంత్రించకపోతే తీవ్ర దీర్ఘమైన వ్యాధులకు గురై, దీనాతిదీనంగా తయారయి ఆయుష్ని తక్కువ చేసుకొంటాము.

అధృష్టవశాత్తూ అంతర్యామి యొక్క వ్యాకులత, ఇష్టాయిష్టాలను అదుపులో పెట్టుకొంటే తగ్గి పోతుంది. బాంధవ్యాలలో సఖ్యతకు ఇది చాలా ముఖ్యం. మాబెల్ పై ఆమెను చూసి దారి మార్చు కొనేటంత అయిష్టత ఉంటే, ఆమె కళ్లలోకి చూసి చిరునవ్వు చింది౦చండి. ఇలాగ రెండు మూడు సార్లు చేస్తే ఆమెని బలవంతంతో కాక నిజంగా ఇష్టపడడం అవుతుంది. మీరు మీ నిర్బంధంను సడలించుకొని పట్టు విడుస్తారు. అది మొదట నొప్పి కలిగించవచ్చు , అతి కష్టం అవ్వచ్చు. అయినా దానివల్ల ఎంతో లాభం ఉంది. మీ నరాల వ్యవస్త బాగుపడి ధృడమౌతుంది. మీ హుషారు ఎక్కువవుతుంది. పరిస్థితులు అనుకూలించక పోయినా మీరు నిరుత్సాహపడరు లేదా మీకు కోపం రాదు. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే మీ సమత్వాన్ని కోల్పోరు. గాలిలో మీరు కట్టుకొన్న కోటలు పఠాపంచల్ అవ్వచ్చు. వేరొకరు బాగుపడితే, మీకే అసూయ రాదు. నిజానికి మీరు పట్టించుకోరు. 80